Movie News

ప్రభాస్ సినిమాలు.. రోజుకో న్యూస్

ప్రస్తుతం సినిమాల స్కేల్ పరంగా ప్రభాస్‌ను అందుకునే హీరో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఎవ్వరూ లేరు. బాహుబలితో ఎవ్వరికీ సాధ్యం కాని స్థాయిని అందుకున్న అతను.. వరుసగా భారీ చిత్రాలే చేస్తున్నాడు. మధ్యలో కొన్ని సినిమాలు పోయినా.. సలార్, కల్కి చిత్రాలతో తన రేంజ్ ఏంటో చూపించాడు.

ఇప్పుడు రాజా సాబ్, ఫౌజీ (వర్కింగ్ టైటిల్) లాంటి క్రేజీ చిత్రాల్లో నటిస్తున్నాడు. ఇంకా తన చేతిలో స్పిరిట్, సలార్-2, కల్కి-2 లాంటి మెగా ప్రాజెక్టులు ఉన్నాయి. ఇవి పూర్తి కావడానికే చాలా టైం పట్టేలా ఉంది. నాలుగేళ్ల పాటు మరో సినిమా ఓకే చేసే పరిస్థితి కనిపించడం లేదు. కానీ ప్రభాస్ కొత్త ప్రాజెక్టుల గురించి ఊహాగానాలు మాత్రం ఆగట్లేదు. ఎప్పటికప్పుడు కొత్త ప్రాజెక్ట్ తెరపైకి వస్తోంది.

బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్‌తో ప్రశాంత్ వర్మ చేయాలనుకున్న ‘బ్రహ్మ రాక్షస’ క్యాన్సిల్ అయిన సంగతి తెలిసిందే. ఇద్దరికీ క్రియేటివ్ డిఫరెన్సెస్ రావడంతో ఈ ప్రాజెక్టు చర్చల దశలో ఆగిపోయింది. ఈ కథనే ప్రభాస్‌తో చేయడానికి ప్రశాంత్ రెడీ అవుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇందులో నెగెటివ్ షేడ్స్ ఉన్న హీరో పాత్ర పట్ల ప్రభాస్ ఆసక్తిగా ఉన్నాడంటున్నారు. ఈ సినిమాను త్వరలో ప్రకటించవచ్చని ప్రచారం సాగుతోంది. కానీ ‘హనుమాన్’తో తనపై అంచనాలు పెరిగాక ప్రశాంత్ ఎప్పటికప్పుడు కొత్త సినిమాల గురించి అప్డేట్స్ ఇస్తున్నాడు కానీ.. వీటిలో ఏది పట్టాలెక్కుతుందో అర్థం కాకుండా ఉంది. కాబట్టి ‘బ్రహ్మరాక్షస’ ప్రభాస్‌తో నిజంగా ఉంటుందా అని కచ్చితంగా చెప్పలేం.

ఇదిలా ఉంటే ‘ఆదిపురుష్’తో తనకు చేదు అనుభవాన్ని మిగిల్చిన ఓం రౌత్‌తో ప్రభాస్ మళ్లీ జట్టు కట్టబోతున్నాడని తాజాగా ఓ రూమర్ బయటికి వచ్చింది. ఓం ఈసారి బాగా టైం తీసుకుని మంచి సబ్జెక్ట్ రెడీ చేశాడని.. చారిత్రక నేపథ్యం ఉన్న ఈ కథను పాన్ ఇండియా స్థాయిలో చేయాలనుకుంటున్నాడని బాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కానీ ‘ఆదిపురుష్’ అనుభవం తర్వాత ప్రభాస్ మళ్లీ ఓంతో జట్టు కట్టే సాహసం చేస్తాడా అన్నది డౌట్.

This post was last modified on November 4, 2024 10:22 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

28 seconds ago

‘నీట్’ గా పేపర్ అమ్మేశారట!

నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…

3 minutes ago

భగీరథ్ కేసు వాదించేది వైసీపీ ఎంపీనే

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…

1 hour ago

కేరళం ‘సీల్డ్ కవర్’ తెరచుకునేదెన్నడో..?

దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…

1 hour ago

ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్న మోదీ వ్యాఖ్యలు

యావత్తు ప్రపంచాన్ని కరోనా చుట్టుముట్టిన తరుణంలో లాక్ డౌన్ అంటే ఏమిటో… ఎలా ఉంటుందో చూశాం. ఇప్పుడు కరోనా లాంటి…

5 hours ago

ఒక్క ఓటుతో గెలిస్తే ఓటేయొద్దా…?

తమిళ రాజకీయాల్లో వరుసబెట్టి ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తమిళనాడు అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడిన దగ్గర నుంచి రోజుకో…

5 hours ago