యువ కథానాయకుడు నిఖిల్ నుంచి ఇప్పుడో సర్ప్రైజింగ్ మూవీ రాబోతోంది. అదే.. అప్పుడో ఇప్పుడో ఎప్పుడో. సుధీర్తో ‘స్వామి రారా’, ‘కేశవ’ చిత్రాలు తీసిన సుధీర్ వర్మ డైరెక్ట్ చేసిన సినిమా ఇది. ఈ సినిమా ఎప్పుడు మొదలైందో, ఎప్పుడు పూర్తయిందో తెలియిదు. సడెన్గా ఫస్ట్ లుక్ లాంచ్ చేసి రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. దీపావళికే అనుకున్న ఈ సినిమాను నవంబరు 8కు మార్చారు.
ఈ సినిమా పట్ల నిఖిల్కు పెద్దగా ఆసక్తి లేదని, దీని మీద తనకు నమ్మకం కూడా లేదని వార్తలు వచ్చాయి. కానీ అదంతా ఉత్త ప్రచారమే అని తేలిపోయింది. నిఖిల్ చక్కగా ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ సినిమా ప్రమోషన్లు మొదలుపెట్టేశాడు. సినిమా గురించి చాలా పాజిటివ్గా మాట్లాడాడు. తన ఫ్రెండే అయిన దర్శకుడు చందూ మొండేటి, సుధీర్ వర్మలతో కలిసి ఓ ఇంటర్వ్యూలోనూ పాల్గొన్నాడు.
ఈ సందర్భంగా నిఖిల్తో ఉన్న ఫ్రెండ్షిప్ కొద్దీ జనాల దృష్టిలో ఈ సినిమా మీద ఉన్న అనుమానాలు తీర్చేందుకు ఒక ప్రశ్న అడిగాడు చందూ. “అసలీ సినిమా ఎప్పుడు చేశార్రా” అని నిఖిల్ను చందూ అడిగాడు. అందుకు నిఖిల్ బదులిస్తూ.. ‘కార్తికేయ-2’ సినిమా చేస్తున్నపుడు చివర్లో ఈ చిత్రాన్ని మొదలుపెట్టినట్లు వెల్లడించాడు. కొవిడ్ టైంలో సినిమా షూట్ జరిగిందని.. కొన్ని కారణాల వల్ల రిలీజ్ ఆలస్యం అయిందని చెప్పాడు.
‘పుష్ప’ సహా పలు చిత్రాలకు రచయితగా పని చేసిన శ్రీకాంత్ విస్సా ఈ మూవీకి కథ అందించాడని.. సినిమాలో చాలా ట్విస్టులు ఉంటాయని.. తర్వాత ఏం జరుగుతుందో ప్రేక్షకులు ఊహించలేరని.. క్లైమాక్స్ అయితే అస్సలు గెస్ చేయలేరని నిఖిల్ తెలిపాడు. ప్రతిసారీ పెద్ద స్పాన్లో కార్తికేయ-2, స్వయంభు లాంటి సినిమాలు చేయలేమని.. అప్పుడప్పుడూ కాన్సెప్ట్ బేస్డ్గా నడిచే ‘అప్పుడో ఇప్పుడు ఎప్పుడో’ లాంటి కొత్త సినిమాలు కూడా చేయాలని.. ఈ చిత్రం మీద తాను ఎంతో నమ్మకంగా ఉన్నానని నిఖిల్ తెలిపాడు.
This post was last modified on November 4, 2024 10:18 am
టాలీవుడ్లో బిగ్గెస్ట్ సినీ ఫ్యామిలీ ఏది అంటే.. మెగా కుటుంబం గురించే ముందుగా చెప్పుకోవాలి. ఆ కుటుంబంలో ఉన్నంత మంది…
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో మలయాళ పరిశ్రమను మినహాయిస్తే.. ప్రతి చోటా సినిమాల మేకింగ్ బాగా టైం తీసుకుంటోంది. కొంచెం స్టార్ ఇమేజ్…
టీడీపీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఏపీకి పలుమార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన దివంగత నందమూరి తారక రామారావుకు భారత దేశ అత్యున్నత పురస్కారం భారత రత్న ఇవ్వాలన్నమాట నిత్యం…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో కూటమి పార్టీలకు చెందిన నేతల మధ్య…
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఎక్కడైనా హీరోల ఆధిపత్యమే నడుస్తుంటుంది. దర్శక నిర్మాతలు వాళ్ల మాటను అనుసరించే నడుచుకోవాల్సి ఉంటుంది. హీరోలు మాట తప్పినా..…
ఒక పాట థియేటర్లలో కంటే బయట ఎంతలా వినిపిస్తుందనే దానిపైనే ఆ సినిమా క్రేజ్ ఆధారపడి ఉంటుంది. తాజాగా ఉప్పల్…