సౌత్ సినిమా నుంచి రాబోతున్న నెక్స్ట్ బిగ్ రిలీజ్ అంటే.. ‘కంగువ’నే. తమిళ టాప్ స్టార్లలో ఒకడైన సూర్య ప్రధాన పాత్రలో ‘శౌర్యం’ శివ రూపొందించిన చిత్రమిది. సూర్య కెరీర్కు పెద్ద మలుపుగా నిలుస్తుందని ఈ చిత్రంపై అంచనాలున్నాయి. సూర్య కజిన్ జ్ఞానవేల్ రాజా వందల కోట్ల బడ్జెట్ పెట్టి ప్రొడ్యూస్ చేసిన ఈ చిత్రం క్రేజీ టీజర్, ట్రైలర్లతో ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచింది.
సూర్యకు తెలుగులో కూడా బంపర్ క్రేజ్ ఉండడంతో ‘కంగువ’ను భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ఈసినిమాకు హైప్ ఉంది. దీన్ని క్యాష్ చేసుకోవడానికి ‘కంగువ’కు అర్ధరాత్రి, తెల్లవారుజామున స్పెషల్ షోలు వేస్తారని వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఈ విషయమై అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ‘కంగువ’ నిర్మాణ సంస్థ స్టూడియో గ్రీన్ ‘కంగువ’ స్పెషల్ షోలపై సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.
‘కంగువ’ చిత్రానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో తెల్లవారుజామున 4 గంటలకు స్పెషల్ షోలు వేయబోతున్నామని స్టూడియో గ్రీన్ ట్విట్టర్ హ్యాండిల్లో పోస్ట్ పెట్టారు. ఐతే తమిళనాడులో తెల్లవారుజామున షోలను నిషేధించిన సంగతి తెలిసిందే.
స్టాలిన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ షోలకు అనుమతి ఇవ్వడం లేదు. కానీ దీని మీద ఇండస్ట్రీ నుంచి ప్రభుత్వానికి వినతులు వెళ్తూనే ఉన్నాయి. త్వరలో పరిస్థితి మారొచ్చని భావిస్తున్నారు. తమిళ స్టార్ హీరోల ఫ్యాన్స్ రాష్ట్రం దాటి వెళ్లి బోర్డర్లోని వేరే రాష్ట్రాల్లో స్పెషల్ షోలు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘కంగువ’ స్పెషల్ షోల కోసం ప్రభుత్వానికి విన్నవించామని.. త్వరలో సానుకూల వార్త వస్తుందని భావిస్తున్నామని స్టూడియో గ్రీన్ సంస్థ పేర్కొంది. ‘కంగువ’కు ఏపీ, తెలంగాణల్లో కొన్ని థియేటర్లలో మిడ్ నైట్ షోలు కూడా పడొచ్చని భావిస్తున్నారు. సలార్, గుంటూరు కారం, కల్కి, దేవర లాంటి పెద్ద సినిమాలకు అర్ధరాత్రి షోలు పడ్డ సంగతి తెలిసిందే.
This post was last modified on November 4, 2024 10:16 am
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…