Movie News

అఫీషియల్: కంగువ హంగామా 4 గంటల నుంచే

సౌత్ సినిమా నుంచి రాబోతున్న నెక్స్ట్ బిగ్ రిలీజ్ అంటే.. ‘కంగువ’నే. తమిళ టాప్ స్టార్లలో ఒకడైన సూర్య ప్రధాన పాత్రలో ‘శౌర్యం’ శివ రూపొందించిన చిత్రమిది. సూర్య కెరీర్‌కు పెద్ద మలుపుగా నిలుస్తుందని ఈ చిత్రంపై అంచనాలున్నాయి. సూర్య కజిన్ జ్ఞానవేల్ రాజా వందల కోట్ల బడ్జెట్ పెట్టి ప్రొడ్యూస్ చేసిన ఈ చిత్రం క్రేజీ టీజర్, ట్రైలర్లతో ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచింది.

సూర్యకు తెలుగులో కూడా బంపర్ క్రేజ్ ఉండడంతో ‘కంగువ’ను భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ఈసినిమాకు హైప్ ఉంది. దీన్ని క్యాష్ చేసుకోవడానికి ‘కంగువ’కు అర్ధరాత్రి, తెల్లవారుజామున స్పెషల్ షోలు వేస్తారని వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఈ విషయమై అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ‘కంగువ’ నిర్మాణ సంస్థ స్టూడియో గ్రీన్ ‘కంగువ’ స్పెషల్ షోలపై సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.

‘కంగువ’ చిత్రానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో తెల్లవారుజామున 4 గంటలకు స్పెషల్ షోలు వేయబోతున్నామని స్టూడియో గ్రీన్ ట్విట్టర్ హ్యాండిల్లో పోస్ట్ పెట్టారు. ఐతే తమిళనాడులో తెల్లవారుజామున షోలను నిషేధించిన సంగతి తెలిసిందే.

స్టాలిన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ షోలకు అనుమతి ఇవ్వడం లేదు. కానీ దీని మీద ఇండస్ట్రీ నుంచి ప్రభుత్వానికి వినతులు వెళ్తూనే ఉన్నాయి. త్వరలో పరిస్థితి మారొచ్చని భావిస్తున్నారు. తమిళ స్టార్ హీరోల ఫ్యాన్స్ రాష్ట్రం దాటి వెళ్లి బోర్డర్లోని వేరే రాష్ట్రాల్లో స్పెషల్ షోలు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘కంగువ’ స్పెషల్ షోల కోసం ప్రభుత్వానికి విన్నవించామని.. త్వరలో సానుకూల వార్త వస్తుందని భావిస్తున్నామని స్టూడియో గ్రీన్ సంస్థ పేర్కొంది. ‘కంగువ’కు ఏపీ, తెలంగాణల్లో కొన్ని థియేటర్లలో మిడ్ నైట్ షోలు కూడా పడొచ్చని భావిస్తున్నారు. సలార్, గుంటూరు కారం, కల్కి, దేవర లాంటి పెద్ద సినిమాలకు అర్ధరాత్రి షోలు పడ్డ సంగతి తెలిసిందే.

Satya

Recent Posts

శ్రీలీలని టార్గెట్ చేయడం సబబేనా

లెనిన్ విడుదలై మంచి స్పందన దక్కించుకున్నాక సోషల్ మీడియాలో శ్రీలీల డిస్కషన్ జరుగుతోంది. ఎందుకంటే లెనిన్ షూటింగ్ మొదలుపెట్టినప్పుడు హీరోయిన్…

16 minutes ago

కొత్త ‘ఈవిల్ డెడ్’ అంత భయపెట్టిందా

హాలీవుడ్ లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా హారర్ జానర్ పరిచయం చేసిన కల్ట్ సిరీస్ గా 'ఈవిల్ డెడ్' సినిమాకున్న ఆదరణ…

1 hour ago

తండ్రి కొడుకులకు కలిసొచ్చిన పల్లెటూరు

కొన్ని కాకతాళీయంగా జరిగినట్టు అనిపించినా దాని వెనుక తెలుసుకోవాల్సిన బాక్సాఫీస్ సత్యాలు చాలా ఉంటాయి. అలాంటిదే ఇది. ఇండస్ట్రీకి వచ్చి…

2 hours ago

ఎన్టీఆర్ అభిమానులకు ఆందోళన అక్కర్లేదు

నిన్న ధనుష్ తమిళ్ మురుగన్ టీజర్ వచ్చాక మొదట ఆందోళన చెందింది జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు. ఎందుకంటే త్రివిక్రమ్ సినిమాలోనూ…

2 hours ago

పల్లి పల్లి మంత్రి లోకేష్

పల్లి పల్లి లోకేశ్... ఇదేం పేరండి బాబూ అని జుట్టు పీక్కుంటున్నారా? అంత అవసరం ఏమీ లేదు. ఇదేమీ రాజకీయ ప్రత్యర్థులో,…

2 hours ago

ఫోక్సో కేసు పెట్టారని ఆరుగురిని చంపి.. ఆపై ఏం చేశాడంటే..

రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడలో ఆదివారం తెల్లవారుజామున దారుణ ఘటన చోటుచేసుకుంది. తనపై నమోదైన పోక్సో కేసుకు ప్రతీకారంగా…

3 hours ago