Movie News

3 నెలలు…2 బడా బ్యానర్లు….2 సినిమాలు

భీష్మ తర్వాత నితిన్ సక్సెస్ చూసి నాలుగేళ్లు గడిచిపోయాయి. రంగ్ దే మరీ డ్యామేజ్ చేయలేదు కానీ మాచర్ల నియోజకవర్గం, ఎక్స్ ట్రాడినరి మ్యాన్ ఒకదాన్ని మించి మరొకటి పోటీపడి మరీ డిజాస్టర్లయ్యాయి. అందుకే అతి మూసకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్న నితిన్ కేవలం రెండు నెలల గ్యాప్ లో రెండు పెద్ద సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. వాటిలో మొదటిది రాబిన్ హుడ్ డిసెంబర్ 20 విడుదలకు రెడీ అయ్యింది. ఛలో, భీష్మ ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ఎంటర్ టైనర్ లో శ్రీలీల హీరోయిన్ కాగా దొంగతనాల బ్యాక్ డ్రాప్ లో కథ చెబుతారట.

మైత్రి మూవీ మేకర్స్ రాజీ లేకుండా నిర్మాణం సాగించారు కాబట్టి ప్రొడక్షన్ వేల్యూస్ పరంగా గ్రాండ్ గా ఉంటుంది. ఫారిన్ షెడ్యూల్స్ ఎక్కువే చేశారు.ఇంకా టీజర్ రాలేదు కాబట్టి కంటెంట్ మీద వెంటనే ఒక అవగాహనకు రాలేం కానీ చిరంజీవి ప్రాజెక్టు మిస్సయ్యాక చేస్తున్న సినిమా కావడంతో వెంకీ కుడుముల చాలా కసితో చేస్తున్నాడని ఇన్ సైడ్ టాక్. ఇక నెక్స్ట్ లైన్ లో ఉన్నది తమ్ముడు. వకీల్ సాబ్ తర్వాత నిర్మాత రాజు దర్శకుడు శ్రీరామ్ వేణుని లాక్ చేసుకుని ఆ మాట మేరకు ఇచ్చిన మూవీ. బడ్జెట్ కూడా నితిన్ కెరీర్ లోనే అత్యధికం అంటున్నారు. ఒక్క ఫైట్ కే రెండు కోట్లంటే మాటలా.

మైత్రి, ఎస్విసి ఇలా రెండు బడా సంస్థలతో నితిన్ సినిమాలు చేయడం కొత్త కాదు కానీ ఇంత గ్రాండ్ స్కేల్ లో వరసగా తెరకెక్కడం మాత్రం ఫ్యాన్స్ కి పండగే. అందులోనూ అతి తక్కువ గ్యాప్ లో వరస రిలీజులు ఎప్పుడూ చేయలేదు. గత కొన్నేళ్లుగా ఏడాదికి ఒకటే చేస్తున్న తరుణంలో ఇప్పుడు ఏకంగా డబుల్ బొనాంజా రెడీ అవుతోంది. రాబిన్ హుడ్ వినోదం మీద ఎక్కువ ఆధారపడగా తమ్ముడులో కమర్షియల్ ఎలిమెంట్స్, సెంటిమెంట్ పుష్కలంగా దట్టించారు. ఈ రెండు హిట్టయితే మాత్రం నితిన్ మళ్ళీ ఊపందుకున్నట్టే. అది ఏ స్థాయిలో అనేది వేచి చూడాలి. ఇంకొద్ది రోజుల్లో తమ్ముడు ప్రకటన రావొచ్చు.

This post was last modified on November 4, 2024 10:03 am

Share

Recent Posts

టార్గెట్ చేరుకున్న టాక్సిక్ తెలుగు వేడుక

నిన్న హైదరాబాద్ లో జరిగిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సౌండ్ బార్ల మీద కూర్చున్న…

41 minutes ago

మెగా హీరోలు అభిమానులు ఇద్దరూ చెక్ చేసుకోవాలి

సోషల్ మీడియా రాను రాను మరీ సెన్సిటివ్ గా, టాక్సిక్ గా మారిపోతోంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ…

2 hours ago

ఎండోస్కోపిక్ కెమెరాతో పేపర్ లీక్… బీజేపీ రాష్ట్రంలో సంచలనం

రాయ్ పూర్ లోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షా పేపర్ లీకేజి వ్యవహారం ఇప్పుడు…

2 hours ago

టీడీపీతో పోల్చుకుంటే.. వైసీపీకి `వ‌ర్గ‌`పోరు…!

పార్టీలు బ‌లంగా ఉండాలంటే.. స‌మాజంలోని ప‌లు వ‌ర్గాల మ‌ద్ద‌తు అవ‌స‌రం. నాయ‌కులు, అధినేత‌లు ఎంత బ‌లంగా ఉన్నా.. స‌మాజంలోని వ‌ర్గాలు…

3 hours ago

ఎన్డీయే క‌న్వీన‌ర్‌గా చంద్ర‌బాబు… ఛాన్స్ ఖాయ‌మేనా?

కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే కూట‌మిని బ‌లోపేతం చేసేందుకు.. రాబోయే రోజుల్లో మ‌రింత ఐక్యంగా ముందుకు సాగేలా వ్యూహాత్మ‌క అడుగులు…

7 hours ago

ర‌వితేజ హిట్టు కొడితే ఆల్ హ్యాపీస్

తెలుగు సినీ అభిమానుల్లో ఎన్నెన్ని వ‌ర్గాలున్నాయో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. అందులో ఒక వ‌ర్గానికి ఇంకో వ‌ర్గానికి అస్స‌లు…

8 hours ago