భీష్మ తర్వాత నితిన్ సక్సెస్ చూసి నాలుగేళ్లు గడిచిపోయాయి. రంగ్ దే మరీ డ్యామేజ్ చేయలేదు కానీ మాచర్ల నియోజకవర్గం, ఎక్స్ ట్రాడినరి మ్యాన్ ఒకదాన్ని మించి మరొకటి పోటీపడి మరీ డిజాస్టర్లయ్యాయి. అందుకే అతి మూసకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్న నితిన్ కేవలం రెండు నెలల గ్యాప్ లో రెండు పెద్ద సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. వాటిలో మొదటిది రాబిన్ హుడ్ డిసెంబర్ 20 విడుదలకు రెడీ అయ్యింది. ఛలో, భీష్మ ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ఎంటర్ టైనర్ లో శ్రీలీల హీరోయిన్ కాగా దొంగతనాల బ్యాక్ డ్రాప్ లో కథ చెబుతారట.
మైత్రి మూవీ మేకర్స్ రాజీ లేకుండా నిర్మాణం సాగించారు కాబట్టి ప్రొడక్షన్ వేల్యూస్ పరంగా గ్రాండ్ గా ఉంటుంది. ఫారిన్ షెడ్యూల్స్ ఎక్కువే చేశారు.ఇంకా టీజర్ రాలేదు కాబట్టి కంటెంట్ మీద వెంటనే ఒక అవగాహనకు రాలేం కానీ చిరంజీవి ప్రాజెక్టు మిస్సయ్యాక చేస్తున్న సినిమా కావడంతో వెంకీ కుడుముల చాలా కసితో చేస్తున్నాడని ఇన్ సైడ్ టాక్. ఇక నెక్స్ట్ లైన్ లో ఉన్నది తమ్ముడు. వకీల్ సాబ్ తర్వాత నిర్మాత రాజు దర్శకుడు శ్రీరామ్ వేణుని లాక్ చేసుకుని ఆ మాట మేరకు ఇచ్చిన మూవీ. బడ్జెట్ కూడా నితిన్ కెరీర్ లోనే అత్యధికం అంటున్నారు. ఒక్క ఫైట్ కే రెండు కోట్లంటే మాటలా.
మైత్రి, ఎస్విసి ఇలా రెండు బడా సంస్థలతో నితిన్ సినిమాలు చేయడం కొత్త కాదు కానీ ఇంత గ్రాండ్ స్కేల్ లో వరసగా తెరకెక్కడం మాత్రం ఫ్యాన్స్ కి పండగే. అందులోనూ అతి తక్కువ గ్యాప్ లో వరస రిలీజులు ఎప్పుడూ చేయలేదు. గత కొన్నేళ్లుగా ఏడాదికి ఒకటే చేస్తున్న తరుణంలో ఇప్పుడు ఏకంగా డబుల్ బొనాంజా రెడీ అవుతోంది. రాబిన్ హుడ్ వినోదం మీద ఎక్కువ ఆధారపడగా తమ్ముడులో కమర్షియల్ ఎలిమెంట్స్, సెంటిమెంట్ పుష్కలంగా దట్టించారు. ఈ రెండు హిట్టయితే మాత్రం నితిన్ మళ్ళీ ఊపందుకున్నట్టే. అది ఏ స్థాయిలో అనేది వేచి చూడాలి. ఇంకొద్ది రోజుల్లో తమ్ముడు ప్రకటన రావొచ్చు.
This post was last modified on November 4, 2024 10:03 am
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర…
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…