అభిమాన హీరోల బర్త్ డేలు వస్తేనో.. లేదంటే వాళ్ల సినిమాలకు సంబంధించి వార్షికోత్సవాలు జరిగితేనో.. లేదా ఏవైనా టీజర్లు, ఇతర విశేషాలు రిలీజైతేనో సోషల్ మీడియాలో ‘రికార్డు’ ట్వీట్లు వేయడం.. నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్లో హ్యాష్ ట్యాగ్స్ ట్రెండ్ అయ్యేలా చేయడం ఈ మధ్య ఆనవాయితీగా మారింది.
వీటిలో కూడా రికార్డుల గురించి చెప్పుకుని మురిసిపోతున్నారు ఫ్యాన్స్. హీరోల పీఆర్వోలు, వ్యక్తిగత సిబ్బంది పనిగట్టుకుని ఈ ట్రెండ్స్ కోసం ఒక మాఫియాను నడిపిస్తున్నాయనే ఆరోపణలున్నాయి. డబ్బులు ఖర్చు పెట్టి ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి ట్వీట్లు వేయడం గమనిస్తూనే ఉన్నాం.
మొన్న అల్లు అర్జున్ పుట్టిన రోజు నాడు ఇలా కొందరు పనిగట్టుకుని ఫేక్ అకౌంట్ల ద్వారా ఒక టార్గెట్ పెట్టుకుని ట్వీట్లు వేసిన వైనం వెలుగులోకి వచ్చింది. మిగతా హీరోల అభిమానులు కూడా ఇందులో తక్కువేమీ లేదు.
ఎన్టీఆర్ పుట్టిన రోజుకు నెల రోజుల కౌంట్ డౌన్ను పురస్కరించుకుని అతడి అభిమానులు కూడా ‘రికార్డ్’ బ్రేకింగ్ ట్రెండ్ క్రియేట్ చేశారు. ఇందులోనూ పీఆర్వో టీం పాత్ర ఉందన్న అనుమానాలున్నాయి. ఇప్పుడు మహేష్ బాబు అభిమానులు కూడా ఇదే పనిలో పడ్డారు. మహేష్ కెరీర్లో అతి పెద్ద హిట్టుగా నిలిచిన ‘పోకిరి’కి 14 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ఫేక్ రికార్డుల కోసం అభిమానులు పడ్డ ఆరాటం గురించి సాక్ష్యాలు బయటికి వచ్చాయి.
ఈ విషయంలో అభిమానుల మధ్య కాన్వర్జేషన్లు.. ఫేక్ రికార్డు కోసం కొన్ని గ్రూపులకు డబ్బులు పంచడాల గురించి స్క్రీన్ షాట్లు ట్విట్టర్లో దర్శనమిస్తున్నాయి. ఇది చాలదన్నట్లు ఫేక్ అకౌంట్లు పెట్టి రికార్డు కోసం ప్రయత్నిస్తున్న వైనంపై ట్విట్టర్ యాజమాన్యానికి కంప్లైంట్లు వెళ్లడంతో అనుమానాస్పదంగా ఉన్న అకౌంట్లు చాలా వాటిని సస్పెండ్ చేసినట్లు తెలుస్తోది. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్లు కూడా పెద్ద ఎత్తున కనిపిస్తున్నాయి. ఇలాంటి రికార్డులు పట్టుకుని అభిమానులు, పీఆర్వోలు ఏం చేసుకుంటారన్నది అర్థం కాని విషయం.
This post was last modified on April 28, 2020 4:52 pm
కొన్ని రాజకీయ చర్చలు ఆసక్తిగా ఉంటాయి. ఆయా పార్టీల నాయకులు కూడా.. సుదీర్ఘకాలం చర్చించుకునేలా ఉంటాయి. అలాంటి రాజకీయ చర్చల్లో…
ఏపీ సీఎం చంద్రబాబు జపిస్తున్న పీ-4 మంత్రం గురించి తెలుసుకదా! పేదలను ధనికులుగా చేయాలన్నది ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం.…
పూజా హెగ్డే.. ఒక దశలో టాలీవుడ్లో నంబర్ వన్ హీరోయిన్గా ఉన్న భామ. తమిళంలో కూడా ఆమెకు మంచి క్రేజే…
అభిమానులు వీలు దొరికినప్పుడంతా ఓజి ఓజి అంటూ జపం చేస్తూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు కానీ నిజానికది ఈ…
కూటమిలో ప్రధాన రోల్ పోషిస్తున్న టీడీపీ.. ఇటు పాలనపరంగా.. అటు అభివృద్ధి, సంక్షేమాల పరంగా దూసుకుపోతోంది. ఈ క్రమంలో ఇప్పటికి…
వైసీపీ అధినేత జగన్కు షాకిచ్చే పరిణామం. రాష్ట్రంలోని బీజేపీ-టీడీపీ-జనసేనల కూటమిని ఆయన ఎంత తేలికగా తీసుకుంటున్నారో అందరికీ తెలిసిందే. ఈ…