అభిమాన హీరోల బర్త్ డేలు వస్తేనో.. లేదంటే వాళ్ల సినిమాలకు సంబంధించి వార్షికోత్సవాలు జరిగితేనో.. లేదా ఏవైనా టీజర్లు, ఇతర విశేషాలు రిలీజైతేనో సోషల్ మీడియాలో ‘రికార్డు’ ట్వీట్లు వేయడం.. నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్లో హ్యాష్ ట్యాగ్స్ ట్రెండ్ అయ్యేలా చేయడం ఈ మధ్య ఆనవాయితీగా మారింది.
వీటిలో కూడా రికార్డుల గురించి చెప్పుకుని మురిసిపోతున్నారు ఫ్యాన్స్. హీరోల పీఆర్వోలు, వ్యక్తిగత సిబ్బంది పనిగట్టుకుని ఈ ట్రెండ్స్ కోసం ఒక మాఫియాను నడిపిస్తున్నాయనే ఆరోపణలున్నాయి. డబ్బులు ఖర్చు పెట్టి ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి ట్వీట్లు వేయడం గమనిస్తూనే ఉన్నాం.
మొన్న అల్లు అర్జున్ పుట్టిన రోజు నాడు ఇలా కొందరు పనిగట్టుకుని ఫేక్ అకౌంట్ల ద్వారా ఒక టార్గెట్ పెట్టుకుని ట్వీట్లు వేసిన వైనం వెలుగులోకి వచ్చింది. మిగతా హీరోల అభిమానులు కూడా ఇందులో తక్కువేమీ లేదు.
ఎన్టీఆర్ పుట్టిన రోజుకు నెల రోజుల కౌంట్ డౌన్ను పురస్కరించుకుని అతడి అభిమానులు కూడా ‘రికార్డ్’ బ్రేకింగ్ ట్రెండ్ క్రియేట్ చేశారు. ఇందులోనూ పీఆర్వో టీం పాత్ర ఉందన్న అనుమానాలున్నాయి. ఇప్పుడు మహేష్ బాబు అభిమానులు కూడా ఇదే పనిలో పడ్డారు. మహేష్ కెరీర్లో అతి పెద్ద హిట్టుగా నిలిచిన ‘పోకిరి’కి 14 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ఫేక్ రికార్డుల కోసం అభిమానులు పడ్డ ఆరాటం గురించి సాక్ష్యాలు బయటికి వచ్చాయి.
ఈ విషయంలో అభిమానుల మధ్య కాన్వర్జేషన్లు.. ఫేక్ రికార్డు కోసం కొన్ని గ్రూపులకు డబ్బులు పంచడాల గురించి స్క్రీన్ షాట్లు ట్విట్టర్లో దర్శనమిస్తున్నాయి. ఇది చాలదన్నట్లు ఫేక్ అకౌంట్లు పెట్టి రికార్డు కోసం ప్రయత్నిస్తున్న వైనంపై ట్విట్టర్ యాజమాన్యానికి కంప్లైంట్లు వెళ్లడంతో అనుమానాస్పదంగా ఉన్న అకౌంట్లు చాలా వాటిని సస్పెండ్ చేసినట్లు తెలుస్తోది. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్లు కూడా పెద్ద ఎత్తున కనిపిస్తున్నాయి. ఇలాంటి రికార్డులు పట్టుకుని అభిమానులు, పీఆర్వోలు ఏం చేసుకుంటారన్నది అర్థం కాని విషయం.
This post was last modified on April 28, 2020 4:52 pm
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…
ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలు చేయడం తనకు కొత్త కాదని, ఎన్నికల్లో పోటీ చేయడం…
`సారీ మైలార్డ్.. ఇకపై అలాంటి తప్పులు జరగవు`` - అని తెలంగాణ హైకోర్టుకు హైడ్రా కమిషనర్, ఐపీఎస్ అధికారి రంగనాథ్…
పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ…
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా.. అఖండ-2. అంతా అనుకున్నట్లు జరిగితే.. ఈపాటికి ఈ…