ఆగస్టు 15 వీకెండ్లో ‘స్త్రీ-2’ అనే మిడ్ రేంజ్ సినిమా ఒకటి రిలీజైంది. దాంతో పాటు అక్షయ్ కుమార్ ముఖ్య పాత్ర పోషించిన ‘ఖేల్ ఖేల్ మే’, జాన్ అబ్రహాం ‘వేద’ కూడా రిలీజయ్యాయి. ‘స్త్రీ-2’ లేడీ ఓరియెంటెడ్ మూవీ. అందులో శ్రద్ధా కపూర్ ముఖ్య పాత్ర పోషించింది. రాజ్ కుమార్ రావు కీలక పాత్రలో కనిపించాడు.
వీళ్లతో పోలిస్తే అక్షయ్ కుమార్, జాన్ అబ్రహాం పెద్ద స్టార్లు. కానీ ‘స్త్రీ-2’ ముందు.. ఖేల్ ఖేల్ మే, వేద సినిమాలు అస్సలు నిలబడలేకపోయాయి. ‘స్త్రీ-2’ ఏకంగా 700 కోట్లకు పైగా వసూళ్లు రాబడితే.. మిగతా రెండు చిత్రాలు కలిపి ఇందులో నాలుగో వంతు వసూళ్లకు పరిమితం అయ్యాయి. దయ్యం సినిమా ముందు సూపర్ స్టార్ల చిత్రాలు వెలవెలబోయిన పరిస్థితి. ఇప్పుడు మరోసారి బాలీవుడ్లో ఇదే ట్రెండ్ రిపీటవుతోంది.
దీపావళి కానుకగా ‘భూల్ భులాయియా-3’ సినిమా విడుదలైంది. అందులో కార్తీక్ ఆర్యన్ లీడ్ రోల్ చేశాడు. దీనికి పోటీగా ‘సింగమ్ అగైన్’ విడుదలైంది. అందులో అజయ్ దేవగణ్ హీరో. కరీనా కపూర్ కథానాయిక. సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, రణ్వీర్ సింగ్, దీపికా పదుకొనే, టైగర్ ష్రాఫ్.. ఇలా చాలామంది స్పెషల్ క్యామియోలు చేశారు ఈ చిత్రంలో.
ఐతే కంటెంట్ పరంగా చూస్తే ‘భూల్ భులాయియా-3’ ముందు ‘సింగమ్ అగైన్’ నిలిచే పరిస్థితి కనిపించడం లేదు. రిలీజ్కు ముందు ఉన్న హైప్, స్టార్ పవర్ కారణంగా తొలి రోజు ‘సింగమ్ అగైన్’కు మంచి వసూళ్లే వచ్చాయి.
కానీ మిడ్ రేంజ్ మూవీ అయినా, తక్కువ థియేటర్లలో రిలీజైనా ‘భూల్ భులాయియా-3’ కూడా దానికి దీటుగా ఓపెనింగ్స్ తెచ్చుకుంది. రెండో రోజు టికెట్ల అమ్మకాల ట్రెండ్ చూస్తే ఈ చిత్రమే పైచేయి సాధించే సంకేతాలు కనిపిస్తున్నాయి. వీకెండ్ తర్వాత కచ్చితంగా ఈ హార్రర్ కామెడీనే ‘సింగమ్ అగైన్’తో పోలిస్తే ముందంజలో నిలిచేలా ఉంది. మొత్తానికి మరోసారి దయ్యం ముందు స్టార్లు నిలవలేకపోతున్నారన్నమాట.
తెలంగాణపై మరోసారి ఏపీ డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధినేత కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో సోమవారం చేపట్టిన జాతీయ…
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో బీజేపీని మరింత బలోపేతం చేసుకునేందుకు ఆ పార్టీ అగ్ర నేతలు ప్రయత్నం చేస్తున్నారా? ప్రాంతీయ పార్టీల…
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పురోగతిపై సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ ఆసక్తి కనబరిచారు. సింగపూర్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి…
మాస్ మహారాజా రవితేజ లైనప్ అభిమానుల అంచనాలకు తగ్గట్టు చక్కగా కనిపిస్తోంది. వరస డిజాస్టర్ల సంగతి పక్కనపెడితే ఇరుముడి మీద…
కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. రాజస్థాన్ రాజధాని జైపూర్లో నిర్వహించిన…
జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎదురు చూస్తున్న అప్డేట్ దేవర 2. మొదటి భాగం వచ్చి రెండేళ్లు దాటిపోతున్నా ఇప్పటికీ సీక్వెల్…