ఆగస్టు 15 వీకెండ్లో ‘స్త్రీ-2’ అనే మిడ్ రేంజ్ సినిమా ఒకటి రిలీజైంది. దాంతో పాటు అక్షయ్ కుమార్ ముఖ్య పాత్ర పోషించిన ‘ఖేల్ ఖేల్ మే’, జాన్ అబ్రహాం ‘వేద’ కూడా రిలీజయ్యాయి. ‘స్త్రీ-2’ లేడీ ఓరియెంటెడ్ మూవీ. అందులో శ్రద్ధా కపూర్ ముఖ్య పాత్ర పోషించింది. రాజ్ కుమార్ రావు కీలక పాత్రలో కనిపించాడు.
వీళ్లతో పోలిస్తే అక్షయ్ కుమార్, జాన్ అబ్రహాం పెద్ద స్టార్లు. కానీ ‘స్త్రీ-2’ ముందు.. ఖేల్ ఖేల్ మే, వేద సినిమాలు అస్సలు నిలబడలేకపోయాయి. ‘స్త్రీ-2’ ఏకంగా 700 కోట్లకు పైగా వసూళ్లు రాబడితే.. మిగతా రెండు చిత్రాలు కలిపి ఇందులో నాలుగో వంతు వసూళ్లకు పరిమితం అయ్యాయి. దయ్యం సినిమా ముందు సూపర్ స్టార్ల చిత్రాలు వెలవెలబోయిన పరిస్థితి. ఇప్పుడు మరోసారి బాలీవుడ్లో ఇదే ట్రెండ్ రిపీటవుతోంది.
దీపావళి కానుకగా ‘భూల్ భులాయియా-3’ సినిమా విడుదలైంది. అందులో కార్తీక్ ఆర్యన్ లీడ్ రోల్ చేశాడు. దీనికి పోటీగా ‘సింగమ్ అగైన్’ విడుదలైంది. అందులో అజయ్ దేవగణ్ హీరో. కరీనా కపూర్ కథానాయిక. సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, రణ్వీర్ సింగ్, దీపికా పదుకొనే, టైగర్ ష్రాఫ్.. ఇలా చాలామంది స్పెషల్ క్యామియోలు చేశారు ఈ చిత్రంలో.
ఐతే కంటెంట్ పరంగా చూస్తే ‘భూల్ భులాయియా-3’ ముందు ‘సింగమ్ అగైన్’ నిలిచే పరిస్థితి కనిపించడం లేదు. రిలీజ్కు ముందు ఉన్న హైప్, స్టార్ పవర్ కారణంగా తొలి రోజు ‘సింగమ్ అగైన్’కు మంచి వసూళ్లే వచ్చాయి.
కానీ మిడ్ రేంజ్ మూవీ అయినా, తక్కువ థియేటర్లలో రిలీజైనా ‘భూల్ భులాయియా-3’ కూడా దానికి దీటుగా ఓపెనింగ్స్ తెచ్చుకుంది. రెండో రోజు టికెట్ల అమ్మకాల ట్రెండ్ చూస్తే ఈ చిత్రమే పైచేయి సాధించే సంకేతాలు కనిపిస్తున్నాయి. వీకెండ్ తర్వాత కచ్చితంగా ఈ హార్రర్ కామెడీనే ‘సింగమ్ అగైన్’తో పోలిస్తే ముందంజలో నిలిచేలా ఉంది. మొత్తానికి మరోసారి దయ్యం ముందు స్టార్లు నిలవలేకపోతున్నారన్నమాట.
This post was last modified on November 2, 2024 9:54 pm
స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ హీరో అవుతాడని చాలా ఏళ్ల ముందే ప్రచారం జరిగింది. సుకుమార్ లాంటి అగ్ర…
రాష్ట్రంలో ప్రతిపక్షం.. బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్.. ప్రజలుకడుతున్న పన్నులతో…
ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…
వైసీపీ అధినేత జగన్పై ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి నిప్పులు చెరిగారు. 'అన్న'…
దేశంలో విమానయాన సంస్థల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న…