ఈ ఏడాది పెద్ద సినిమాల సందడి అనుకున్న స్థాయిలో లేకపోయింది. సంక్రాంతికి ‘గుంటూరు కారం’, జులైలో ‘కల్కి 2898 ఏడీ’, సెప్టెంబరు చివర్లో ‘దేవర’ మాత్రమే పెద్ద చిత్రాలు. వీటిలో ‘గుంటూరు కారం’ నిరాశపరచగా.. మిగతా రెండు చిత్రాలు బాగానే ఆడాయి.
ఇక టాలీవుడ్ నుంచి రాబోతున్న తర్వాతి పెద్ద సినిమా అంటే ‘పుష్ప: ది రూల్’యే. కేవలం తెలుగులోనే కాక దేశవ్యాప్తంగా అన్ని ముఖ్య భాషల్లోనూ ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ‘పుష్ఫ-2’ విడుదలకు అటు ఇటుగా నెల రోజులే సమయం ఉంది. ఈ సినిమాపై ఉన్న అంచనాల దృష్ట్యా రిలీజ్ భారీగా ఉండబోతోంది. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా మోత మోగిపోవడం ఖాయం. కాగా యుఎస్లో చాలా ముందుగానే ఈ చిత్రానికి ప్రి సేల్స్ మొదలుపెట్టేశారు.
‘పుష్ప: ది రూల్’ టికెట్ల అమ్మకాలను తాజాగా మొదలుపెట్టారు యుఎస్లో. ఈ సినిమా కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్న అక్కడి ప్రేక్షకుల్లో ఉత్సాహం మామూలుగా లేదు. కొన్ని గంటల్లోనే లక్ష డాలర్ల మార్కును టచ్ చేసేసింది ‘పుష్ప-2’. ఈ ఊపు చూస్తుంటే ప్రి సేల్స్ విషయంలో రికార్డులు నమోదు కావడం గ్యారెంటీ. ‘దేవర’ సినిమాకు ప్రి సేల్స్ ద్వారా రిలీజ్కు ముందే 2 మిలియన్ డాలర్ల వసూళ్లు వచ్చేశాయి.
‘పుష్ప-2’ ఆరంభం చూస్తే ‘దేవర’ కంటే ముందే ఆ మార్కును టచ్ చేసేలా ఉంది. సినిమాకు పాజిటివ్ టాక్ రావాలే కానీ.. ప్రి సేల్స్తోనే 3 మిలియన్ డాలర్లు కొల్లగొట్టినా ఆశ్చర్యం లేదు. సినిమా బాగుంటే ఫుల్ రన్లో 10 మిలియన్ మార్కును కూడా అందుకుంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వరల్డ్ వైడ్ వెయ్యి కోట్లకు తక్కువ కాకుండా వసూళ్లు వస్తాయనే అంచనాలు కూడా ఉన్నాయి. డిసెంబరు 5న ఈ చిత్రం విడుదల కానున్న సంగతి తెలిసిందే.
This post was last modified on November 2, 2024 4:41 pm
ఒకప్పటి డిజాస్టర్లు ఇప్పుడు రీ రిలీజ్ ట్రెండ్ లో బాగా ఆడటం గమనిస్తున్నాం. ఆరెంజ్ మూడుసార్లు వచ్చినా కలెక్షన్లు కుమ్మరించింది.…
టాలీవుడ్లో ఘన చరిత్ర ఉన్న బేనర్లో లక్ష్మీప్రసన్న పిక్చర్స్ ఒకటి. ఈ బేనర్ మీద పదుల సంఖ్యలో సినిమాలు తీశారు…
‘యమదొంగ’ చిత్రంతో టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది మలయాళ భామ మమతా మోహన్ దాస్. ఆ చిత్రంలో చలాకీ పాత్ర…
ఇరు తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నాయకుల్లో చాలామంది పెద్దగా భావోద్వేగాలకు లోను కారు. మిన్ను విరిగి మీద పడ్డా…ఎన్నికల…
మన శంకరవరప్రసాద్ గారు రూపంలో చిరంజీవికి బ్లాక్ బస్టర్ కానుక ఇచ్చి రెమ్యునరేషన్ తో పాటు రేంజ్ రోవర్ కారు…
24 ఏళ్ల కిందట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే కాక దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయిన నటి ప్రత్యూష మృతి వ్యవహారంలో సుప్రీం కోర్టు…