ఈ ఏడాది పెద్ద సినిమాల సందడి అనుకున్న స్థాయిలో లేకపోయింది. సంక్రాంతికి ‘గుంటూరు కారం’, జులైలో ‘కల్కి 2898 ఏడీ’, సెప్టెంబరు చివర్లో ‘దేవర’ మాత్రమే పెద్ద చిత్రాలు. వీటిలో ‘గుంటూరు కారం’ నిరాశపరచగా.. మిగతా రెండు చిత్రాలు బాగానే ఆడాయి.
ఇక టాలీవుడ్ నుంచి రాబోతున్న తర్వాతి పెద్ద సినిమా అంటే ‘పుష్ప: ది రూల్’యే. కేవలం తెలుగులోనే కాక దేశవ్యాప్తంగా అన్ని ముఖ్య భాషల్లోనూ ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ‘పుష్ఫ-2’ విడుదలకు అటు ఇటుగా నెల రోజులే సమయం ఉంది. ఈ సినిమాపై ఉన్న అంచనాల దృష్ట్యా రిలీజ్ భారీగా ఉండబోతోంది. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా మోత మోగిపోవడం ఖాయం. కాగా యుఎస్లో చాలా ముందుగానే ఈ చిత్రానికి ప్రి సేల్స్ మొదలుపెట్టేశారు.
‘పుష్ప: ది రూల్’ టికెట్ల అమ్మకాలను తాజాగా మొదలుపెట్టారు యుఎస్లో. ఈ సినిమా కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్న అక్కడి ప్రేక్షకుల్లో ఉత్సాహం మామూలుగా లేదు. కొన్ని గంటల్లోనే లక్ష డాలర్ల మార్కును టచ్ చేసేసింది ‘పుష్ప-2’. ఈ ఊపు చూస్తుంటే ప్రి సేల్స్ విషయంలో రికార్డులు నమోదు కావడం గ్యారెంటీ. ‘దేవర’ సినిమాకు ప్రి సేల్స్ ద్వారా రిలీజ్కు ముందే 2 మిలియన్ డాలర్ల వసూళ్లు వచ్చేశాయి.
‘పుష్ప-2’ ఆరంభం చూస్తే ‘దేవర’ కంటే ముందే ఆ మార్కును టచ్ చేసేలా ఉంది. సినిమాకు పాజిటివ్ టాక్ రావాలే కానీ.. ప్రి సేల్స్తోనే 3 మిలియన్ డాలర్లు కొల్లగొట్టినా ఆశ్చర్యం లేదు. సినిమా బాగుంటే ఫుల్ రన్లో 10 మిలియన్ మార్కును కూడా అందుకుంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వరల్డ్ వైడ్ వెయ్యి కోట్లకు తక్కువ కాకుండా వసూళ్లు వస్తాయనే అంచనాలు కూడా ఉన్నాయి. డిసెంబరు 5న ఈ చిత్రం విడుదల కానున్న సంగతి తెలిసిందే.
This post was last modified on November 2, 2024 4:41 pm
అగ్రరాజ్యం అమెరికా కొత్తగా సుంకాల పెంపు కారణంగా ఏపీలో ఆక్వా రంగంపై తీవ్ర ప్రభావం పడినా... కూటమి సర్కారు తీసుకున్న…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ తో కలిసి…
ఒకప్పుడు తమిళ డబ్బింగ్ సినిమాలను చూసి తెలుగులో ఇలాంటి సినిమాలు రావేంటి అని చాలా ఫీలయ్యేవాళ్లు మన ప్రేక్షకులు. అక్కడ ఎన్నో కొత్త…
మాస్ రాజా రవితేజకు గత కొన్నేళ్లలో పెద్ద హిట్ అంటే.. ధమాకానే. ఈ సినిమా డివైడ్ టాక్ తెచ్చుకుని కూడా బ్లాక్ బస్టర్…
హైదరాబాద్ శిల్ప కళావేదికలో జరిగిన అర్జున్ సన్నాఫ్ వైజయంతి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇవాళ అభిమానులతో కళకళలాడిపోయింది. ఇదే నెలలో…
పాకిస్థాన్ క్రికెటర్ల మీద సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరుగుతూ ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఆటతోనే కాక మాటతీరుతోనూ వాళ్లు సోషల్ మీడియాకు టార్గెట్ అవుతుంటారు.…