ఏవేవో ప్రయోగాలు చేయబోయి, ఏదో కొత్తగా ట్రై చేస్తున్నానుకుని వరస డిజాస్టర్లు చవి చూసిన వరుణ్ తేజ్ ఎట్టకేలకు దారిలో పడ్డాడు. గని, గాండీవధారి అర్జున, ఆపరేషన్ వాలెంటైన్ ఒకదాన్ని మించి మరొకటి దారుణంగా బోల్తా కొట్టడం మెగా ప్రిన్స్ మార్కెట్ ని ప్రమాదంలో పడేసింది. ఎఫ్ 3 సక్సెస్ అయినా దాని క్రెడిట్ వెంకటేష్, అనిల్ రావిపూడిలకు ఎక్కువగా దక్కింది కాబట్టి సోలో హిట్ కోసం వరుణ్ ఎదురు చూస్తూ వచ్చాడు. ఈ నేపథ్యంలో నవంబర్ 14న మట్కాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. వందల కోట్ల బడ్జెట్ తో రూపొందిన కంగువ లాంటి ప్యాన్ ఇండియా మూవీతో ఒకే రోజు క్లాష్ కి సిద్ధపడ్డాడు.
ఇంత రిస్క్ ఎందుకబ్బా అనే ప్రశ్నకు సమాధానం ఇవాళ విడుదల మట్కా ట్రైలర్ లో ఇచ్చేశారు. వైజాగ్ లో ఒక మాములు కూలీగా జీవితం మొదలుపెట్టిన వాసు అనే వ్యక్తి వందల కోట్లకు పడగలెత్తే స్థాయికి ఎలా చేరుకున్నాడు, ఈ క్రమంలో అతను గెలుచుకుంది ఏంటి, పోగొట్టుకున్నది ఏంటి లాంటివన్నీ ఒక బయోపిక్ తరహాలో చూపించబోతున్నారు. దర్శకుడు కరుణ కుమార్ ప్రెజెంట్ చేసిన విధానం, అప్పటి వాతావరణాన్ని ప్రతిబింబించేలా ఆర్ట్ వర్క్, భారీ బడ్జెట్ ఇవన్నీ కంటెంట్ ఎంత రిచ్ గా ఉండబోతోందో స్పష్టం చేశాయి. కావలసిందల్లా ఎంగేజ్ చేసేలా కథా కథనాలు ఉండటమే.
సో మట్కా మీద నమ్మకం ఏర్పడేందుకు ఇది సరిపోతుంది. లక్కీ భాస్కర్ తో ఇటీవలే హీరోయిన్ గా పెద్ద హిట్టు అందుకున్న మీనాక్షి చౌదరి కేవలం రెండు వారాల గ్యాప్ తో మరోసారి పలకరించబోతోంది. జివి ప్రకాష్ కుమార్ సంగీతం మరో ఆకర్షణగా నిలవబోతోంది. రిలీజ్ రోజు కాంపిటీషన్ ఒక్క కంగువతోనే ఆగిపోవడం లేదు. ప్రశాంత్ వర్మ కథను అందించిన దేవకీనందన వాసుదేవ కూడా అదే రోజు వస్తోంది. సో ట్రయాంగిల్ వార్ గట్టిగానే ఉండబోతోంది. ఇప్పుడు ట్రైలర్ చూశాక ముఖ్యంగా మాస్ ఆడియన్స్ లో అంచనాలు పెరిగేలా ఉన్నాయి కాబట్టి వాటిని నిలబెట్టుకుంటే మాత్రం బ్లాక్ బస్టర్ పడ్డట్టే.
This post was last modified on November 2, 2024 2:47 pm
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…