ఏవేవో ప్రయోగాలు చేయబోయి, ఏదో కొత్తగా ట్రై చేస్తున్నానుకుని వరస డిజాస్టర్లు చవి చూసిన వరుణ్ తేజ్ ఎట్టకేలకు దారిలో పడ్డాడు. గని, గాండీవధారి అర్జున, ఆపరేషన్ వాలెంటైన్ ఒకదాన్ని మించి మరొకటి దారుణంగా బోల్తా కొట్టడం మెగా ప్రిన్స్ మార్కెట్ ని ప్రమాదంలో పడేసింది. ఎఫ్ 3 సక్సెస్ అయినా దాని క్రెడిట్ వెంకటేష్, అనిల్ రావిపూడిలకు ఎక్కువగా దక్కింది కాబట్టి సోలో హిట్ కోసం వరుణ్ ఎదురు చూస్తూ వచ్చాడు. ఈ నేపథ్యంలో నవంబర్ 14న మట్కాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. వందల కోట్ల బడ్జెట్ తో రూపొందిన కంగువ లాంటి ప్యాన్ ఇండియా మూవీతో ఒకే రోజు క్లాష్ కి సిద్ధపడ్డాడు.
ఇంత రిస్క్ ఎందుకబ్బా అనే ప్రశ్నకు సమాధానం ఇవాళ విడుదల మట్కా ట్రైలర్ లో ఇచ్చేశారు. వైజాగ్ లో ఒక మాములు కూలీగా జీవితం మొదలుపెట్టిన వాసు అనే వ్యక్తి వందల కోట్లకు పడగలెత్తే స్థాయికి ఎలా చేరుకున్నాడు, ఈ క్రమంలో అతను గెలుచుకుంది ఏంటి, పోగొట్టుకున్నది ఏంటి లాంటివన్నీ ఒక బయోపిక్ తరహాలో చూపించబోతున్నారు. దర్శకుడు కరుణ కుమార్ ప్రెజెంట్ చేసిన విధానం, అప్పటి వాతావరణాన్ని ప్రతిబింబించేలా ఆర్ట్ వర్క్, భారీ బడ్జెట్ ఇవన్నీ కంటెంట్ ఎంత రిచ్ గా ఉండబోతోందో స్పష్టం చేశాయి. కావలసిందల్లా ఎంగేజ్ చేసేలా కథా కథనాలు ఉండటమే.
సో మట్కా మీద నమ్మకం ఏర్పడేందుకు ఇది సరిపోతుంది. లక్కీ భాస్కర్ తో ఇటీవలే హీరోయిన్ గా పెద్ద హిట్టు అందుకున్న మీనాక్షి చౌదరి కేవలం రెండు వారాల గ్యాప్ తో మరోసారి పలకరించబోతోంది. జివి ప్రకాష్ కుమార్ సంగీతం మరో ఆకర్షణగా నిలవబోతోంది. రిలీజ్ రోజు కాంపిటీషన్ ఒక్క కంగువతోనే ఆగిపోవడం లేదు. ప్రశాంత్ వర్మ కథను అందించిన దేవకీనందన వాసుదేవ కూడా అదే రోజు వస్తోంది. సో ట్రయాంగిల్ వార్ గట్టిగానే ఉండబోతోంది. ఇప్పుడు ట్రైలర్ చూశాక ముఖ్యంగా మాస్ ఆడియన్స్ లో అంచనాలు పెరిగేలా ఉన్నాయి కాబట్టి వాటిని నిలబెట్టుకుంటే మాత్రం బ్లాక్ బస్టర్ పడ్డట్టే.
This post was last modified on November 2, 2024 2:47 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…