అన్ స్టాపబుల్ షో చూశాక బాలయ్య ఎనర్జీ అఫ్ స్క్రీన్ కూడా ఏ స్థాయిలో ఉంటుందో ప్రేక్షకులకు అర్థమయ్యింది కానీ పబ్లిక్ స్టేజి మీద సైతం అదే జోరు చూపిస్తారని నిరూపించే సందర్భాలు తక్కువగా వస్తాయి. ఇటీవలే అబూ దాబిలో నెక్సా ఐఫా ఉత్సవం అవార్డుల వేడుక ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా నందమూరి బాలకృష్ణకు గోల్డెన్ లెగసి పురస్కారాన్ని అందజేశారు. దగ్గుబాటి రానా, సిద్దు జొన్నలగడ్డ వ్యాఖ్యాతలుగా చేసిన ఈ వేడుకలో చాలా మెరుపులే జరిగాయి. అందులో ఒకటి బాలీవుడ్ ఫిలిం మేకర్ కరణ్ జోహార్, బాలయ్యల మధ్య జరిగిన ఆన్ స్టేజి సరదా సంభాషణ.
సమకాలీకుల్లో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ ఈ ముగ్గురిలో ఎవరంటే ఇష్టమని కరణ్ జోహార్ చాలా తెలివైన ప్రశ్నగా భావించి బాలయ్యని అడిగాడు. దానికాయన ఏ మాత్రం సంకోచించకుండా నీకు సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్ లలో ఎవరంటే బాగా ఇష్టమని రివర్స్ కౌంటర్ వేయడంతో ఒక్కసారిగా స్టేడియం చప్పట్లతో మారుమ్రోగిపోయింది. కాఫీ విత్ కరణ్ ఇంటర్వ్యూలాగా వచ్చిన అతిథి తన క్వశ్చన్ తో లాక్ అవుతారనుకుంటే ఇలా రివర్స్ లో పంచ్ వేయడం చూసి షాకవ్వడం హోస్ట్ వంతయ్యింది. తేరుకునేలోపే బాలయ్య స్టయిల్ గా కుర్చీ నుంచి లేవడం, ఈలలు వినిపించడం జరిగిపోయాయి.
ఇలా సౌత్ హీరోలను కవ్వించడం అప్పుడప్పుడు హిందీ ప్రముఖులు చేయడం గతంలో జరిగింది కానీ ఈ మధ్య బలమైన సమాధానాలు రావడం మొదలవ్వడంతో తగ్గించారు. ఓసారి ప్రముఖ నార్త్ యాంకర్ ఒకరు రానాని సౌత్, నార్త్ అంటూ సినిమాని వేరుగా చేసి మేం ఎక్కువ అన్నట్టు మాట్లాడింది. దానికి రానా బదులు చెబుతూ బాహుబలి వచ్చాక అవన్నీ పోయాయని, హిందీ టాప్ గ్రాసర్ ఏదుందో ఒకసారి చూడండని చెప్పడం ఓ రేంజ్ లో పేలింది. తాజాగా బాలయ్య ఇచ్చిన కౌంటర్ ఆ కోవలోకి రాకపోయినా తెలుగువాడి సమయస్ఫూర్తిగా నిదర్శనంగా నిలుస్తోంది. అందుకే బాలయ్య రాక్స్ కరణ్ షాక్స్.
This post was last modified on November 2, 2024 12:53 pm
ఒకప్పుడు ఇంగ్లీష్ సినిమాలకు మన దేశంలో తెగ క్రేజ్ ఉండేది. జురాసిక్ పార్క్ నుంచి ఇది విపరీతంగా పెరిగిపోయింది. దానికి…
గత వారం విడుదలైన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ఫుల్ పాజిటివ్ టాకేమీ తెచ్చుకోలేదు. ప్రిమియర్స్ నుంచే డివైడ్ టాక్ మొదలైంది.…
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విష్ణుమూర్తి అవతారంగా ప్రముఖ బాలివుడ్ నటుడు సుదేష్ బెర్రీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో…
బలమైన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆశలన్నీ కొరియన్ కనకరాజు మీదే ఉన్నాయి. ఆగస్ట్…
జంతర్ మంతర్ ఆందోళనలో ప్రధాని మోదీపై విమర్శలు చేయడం కన్నీళ్లు తెప్పించిందని, పండ్లు కాసే చెట్టుపైకి రాళ్లేస్తారని, దేశం కోసం…
బారత ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ... వరుసబెట్టి మూడు పర్యాయాలు దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. అంతేకాకుండా దేశానికి అత్యధిక…