అన్ స్టాపబుల్ షో చూశాక బాలయ్య ఎనర్జీ అఫ్ స్క్రీన్ కూడా ఏ స్థాయిలో ఉంటుందో ప్రేక్షకులకు అర్థమయ్యింది కానీ పబ్లిక్ స్టేజి మీద సైతం అదే జోరు చూపిస్తారని నిరూపించే సందర్భాలు తక్కువగా వస్తాయి. ఇటీవలే అబూ దాబిలో నెక్సా ఐఫా ఉత్సవం అవార్డుల వేడుక ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా నందమూరి బాలకృష్ణకు గోల్డెన్ లెగసి పురస్కారాన్ని అందజేశారు. దగ్గుబాటి రానా, సిద్దు జొన్నలగడ్డ వ్యాఖ్యాతలుగా చేసిన ఈ వేడుకలో చాలా మెరుపులే జరిగాయి. అందులో ఒకటి బాలీవుడ్ ఫిలిం మేకర్ కరణ్ జోహార్, బాలయ్యల మధ్య జరిగిన ఆన్ స్టేజి సరదా సంభాషణ.
సమకాలీకుల్లో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ ఈ ముగ్గురిలో ఎవరంటే ఇష్టమని కరణ్ జోహార్ చాలా తెలివైన ప్రశ్నగా భావించి బాలయ్యని అడిగాడు. దానికాయన ఏ మాత్రం సంకోచించకుండా నీకు సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్ లలో ఎవరంటే బాగా ఇష్టమని రివర్స్ కౌంటర్ వేయడంతో ఒక్కసారిగా స్టేడియం చప్పట్లతో మారుమ్రోగిపోయింది. కాఫీ విత్ కరణ్ ఇంటర్వ్యూలాగా వచ్చిన అతిథి తన క్వశ్చన్ తో లాక్ అవుతారనుకుంటే ఇలా రివర్స్ లో పంచ్ వేయడం చూసి షాకవ్వడం హోస్ట్ వంతయ్యింది. తేరుకునేలోపే బాలయ్య స్టయిల్ గా కుర్చీ నుంచి లేవడం, ఈలలు వినిపించడం జరిగిపోయాయి.
ఇలా సౌత్ హీరోలను కవ్వించడం అప్పుడప్పుడు హిందీ ప్రముఖులు చేయడం గతంలో జరిగింది కానీ ఈ మధ్య బలమైన సమాధానాలు రావడం మొదలవ్వడంతో తగ్గించారు. ఓసారి ప్రముఖ నార్త్ యాంకర్ ఒకరు రానాని సౌత్, నార్త్ అంటూ సినిమాని వేరుగా చేసి మేం ఎక్కువ అన్నట్టు మాట్లాడింది. దానికి రానా బదులు చెబుతూ బాహుబలి వచ్చాక అవన్నీ పోయాయని, హిందీ టాప్ గ్రాసర్ ఏదుందో ఒకసారి చూడండని చెప్పడం ఓ రేంజ్ లో పేలింది. తాజాగా బాలయ్య ఇచ్చిన కౌంటర్ ఆ కోవలోకి రాకపోయినా తెలుగువాడి సమయస్ఫూర్తిగా నిదర్శనంగా నిలుస్తోంది. అందుకే బాలయ్య రాక్స్ కరణ్ షాక్స్.
This post was last modified on November 2, 2024 12:53 pm
స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యకర్తలు, నాయకులకు కీలక…
తిరుమల అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతోపాటు, భక్తుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు టీటీడీ ఆధునిక సాంకేతిక…
ఇప్పుడు పెద్ద హీరోల నుంచి ఏడాదికో సినిమా వస్తే ఆశ్చర్యపోయే పరిస్థితి ఉంది. ఒక్క ప్రభాస్ను పక్కన పెడితే.. అల్లు…
ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న స్పిరిట్ షూటింగ్ మొదలుకాక ముందు హాట్ టాపిక్ గా మారింది…
పిల్లల విషయంలో తల్లిదండ్రులైనా, ఉపాధ్యాయులైనా ఎంత సున్నితంగా వ్యవహరించాలో చెప్పే ఉదంతమిది. విద్యార్థులను క్రమశిక్షణలో పెట్టాలని, వారిలో భయం పెంచాలని…
హైదరాబాద్ మాదాపూర్ ఇనార్బిట్ మాల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో భారతి అనే 26 ఏళ్ల యువతి మృతి చెందిన…