అన్ స్టాపబుల్ షో చూశాక బాలయ్య ఎనర్జీ అఫ్ స్క్రీన్ కూడా ఏ స్థాయిలో ఉంటుందో ప్రేక్షకులకు అర్థమయ్యింది కానీ పబ్లిక్ స్టేజి మీద సైతం అదే జోరు చూపిస్తారని నిరూపించే సందర్భాలు తక్కువగా వస్తాయి. ఇటీవలే అబూ దాబిలో నెక్సా ఐఫా ఉత్సవం అవార్డుల వేడుక ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా నందమూరి బాలకృష్ణకు గోల్డెన్ లెగసి పురస్కారాన్ని అందజేశారు. దగ్గుబాటి రానా, సిద్దు జొన్నలగడ్డ వ్యాఖ్యాతలుగా చేసిన ఈ వేడుకలో చాలా మెరుపులే జరిగాయి. అందులో ఒకటి బాలీవుడ్ ఫిలిం మేకర్ కరణ్ జోహార్, బాలయ్యల మధ్య జరిగిన ఆన్ స్టేజి సరదా సంభాషణ.
సమకాలీకుల్లో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ ఈ ముగ్గురిలో ఎవరంటే ఇష్టమని కరణ్ జోహార్ చాలా తెలివైన ప్రశ్నగా భావించి బాలయ్యని అడిగాడు. దానికాయన ఏ మాత్రం సంకోచించకుండా నీకు సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్ లలో ఎవరంటే బాగా ఇష్టమని రివర్స్ కౌంటర్ వేయడంతో ఒక్కసారిగా స్టేడియం చప్పట్లతో మారుమ్రోగిపోయింది. కాఫీ విత్ కరణ్ ఇంటర్వ్యూలాగా వచ్చిన అతిథి తన క్వశ్చన్ తో లాక్ అవుతారనుకుంటే ఇలా రివర్స్ లో పంచ్ వేయడం చూసి షాకవ్వడం హోస్ట్ వంతయ్యింది. తేరుకునేలోపే బాలయ్య స్టయిల్ గా కుర్చీ నుంచి లేవడం, ఈలలు వినిపించడం జరిగిపోయాయి.
ఇలా సౌత్ హీరోలను కవ్వించడం అప్పుడప్పుడు హిందీ ప్రముఖులు చేయడం గతంలో జరిగింది కానీ ఈ మధ్య బలమైన సమాధానాలు రావడం మొదలవ్వడంతో తగ్గించారు. ఓసారి ప్రముఖ నార్త్ యాంకర్ ఒకరు రానాని సౌత్, నార్త్ అంటూ సినిమాని వేరుగా చేసి మేం ఎక్కువ అన్నట్టు మాట్లాడింది. దానికి రానా బదులు చెబుతూ బాహుబలి వచ్చాక అవన్నీ పోయాయని, హిందీ టాప్ గ్రాసర్ ఏదుందో ఒకసారి చూడండని చెప్పడం ఓ రేంజ్ లో పేలింది. తాజాగా బాలయ్య ఇచ్చిన కౌంటర్ ఆ కోవలోకి రాకపోయినా తెలుగువాడి సమయస్ఫూర్తిగా నిదర్శనంగా నిలుస్తోంది. అందుకే బాలయ్య రాక్స్ కరణ్ షాక్స్.
టాలీవుడ్ బాక్సాఫీస్ జూన్ నెల నుంచి ఊపందుకుంది. ఓవర్సీస్, నార్త్ పక్కనపెడితే తెలుగు రాష్ట్రాల వరకు పెద్ది బ్లాక్ బస్టర్…
టాలీవుడ్ లో ఎక్కువ డిమాండ్ ఉన్న సంగీత దర్శకులు ఎవరయ్యా అంటే ముందు వినిపించే పేరు తమన్. అది నిజం…
టాలీవుడ్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా మొత్తానికి ముహూర్త వేడుకను ముగించింది. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్…
టాలీవుడ్ లో క్లాసిక్ లుక్స్ తో ప్రేక్షకుల మనసు గెలుచుకున్న హీరోయిన్లలో మృణాల్ థాకూర్ ఒకరు. సీతారామం సినిమాతో తెలుగు…
పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కావడం ఇప్పుడు చాలా కామన్ పాయింట్. కానీ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా…
ధనుష్ కొత్త సినిమా పేరు 'ఓం'గా ఫిక్సయ్యింది. అమరన్ ఫేమ్ రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్…