అన్ స్టాపబుల్ షో చూశాక బాలయ్య ఎనర్జీ అఫ్ స్క్రీన్ కూడా ఏ స్థాయిలో ఉంటుందో ప్రేక్షకులకు అర్థమయ్యింది కానీ పబ్లిక్ స్టేజి మీద సైతం అదే జోరు చూపిస్తారని నిరూపించే సందర్భాలు తక్కువగా వస్తాయి. ఇటీవలే అబూ దాబిలో నెక్సా ఐఫా ఉత్సవం అవార్డుల వేడుక ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా నందమూరి బాలకృష్ణకు గోల్డెన్ లెగసి పురస్కారాన్ని అందజేశారు. దగ్గుబాటి రానా, సిద్దు జొన్నలగడ్డ వ్యాఖ్యాతలుగా చేసిన ఈ వేడుకలో చాలా మెరుపులే జరిగాయి. అందులో ఒకటి బాలీవుడ్ ఫిలిం మేకర్ కరణ్ జోహార్, బాలయ్యల మధ్య జరిగిన ఆన్ స్టేజి సరదా సంభాషణ.
సమకాలీకుల్లో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ ఈ ముగ్గురిలో ఎవరంటే ఇష్టమని కరణ్ జోహార్ చాలా తెలివైన ప్రశ్నగా భావించి బాలయ్యని అడిగాడు. దానికాయన ఏ మాత్రం సంకోచించకుండా నీకు సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్ లలో ఎవరంటే బాగా ఇష్టమని రివర్స్ కౌంటర్ వేయడంతో ఒక్కసారిగా స్టేడియం చప్పట్లతో మారుమ్రోగిపోయింది. కాఫీ విత్ కరణ్ ఇంటర్వ్యూలాగా వచ్చిన అతిథి తన క్వశ్చన్ తో లాక్ అవుతారనుకుంటే ఇలా రివర్స్ లో పంచ్ వేయడం చూసి షాకవ్వడం హోస్ట్ వంతయ్యింది. తేరుకునేలోపే బాలయ్య స్టయిల్ గా కుర్చీ నుంచి లేవడం, ఈలలు వినిపించడం జరిగిపోయాయి.
ఇలా సౌత్ హీరోలను కవ్వించడం అప్పుడప్పుడు హిందీ ప్రముఖులు చేయడం గతంలో జరిగింది కానీ ఈ మధ్య బలమైన సమాధానాలు రావడం మొదలవ్వడంతో తగ్గించారు. ఓసారి ప్రముఖ నార్త్ యాంకర్ ఒకరు రానాని సౌత్, నార్త్ అంటూ సినిమాని వేరుగా చేసి మేం ఎక్కువ అన్నట్టు మాట్లాడింది. దానికి రానా బదులు చెబుతూ బాహుబలి వచ్చాక అవన్నీ పోయాయని, హిందీ టాప్ గ్రాసర్ ఏదుందో ఒకసారి చూడండని చెప్పడం ఓ రేంజ్ లో పేలింది. తాజాగా బాలయ్య ఇచ్చిన కౌంటర్ ఆ కోవలోకి రాకపోయినా తెలుగువాడి సమయస్ఫూర్తిగా నిదర్శనంగా నిలుస్తోంది. అందుకే బాలయ్య రాక్స్ కరణ్ షాక్స్.
This post was last modified on November 2, 2024 12:53 pm
వైసీపీ పాలనలో ఏపీలో భూముల అన్యాక్రాంతం యథేచ్చగా సాగిందన్న ఆరోపణలు ఒకింత గట్టిగానే వినిపించాయి. ఇప్పుడు టీడీపీ నేతృత్వంలోని కూటమి…
రాష్ట్రంలోని కూటమి సర్కారు ఇప్పటి వరకు నామినేటెడ్ పదవులను మాత్రమే భర్తీ చేస్తోంది. అయితే.. ఈ క్రమంలో సీఎం విచక్షణ…
"రాజకీయాలు కుళ్లిపోయాయి. ఆయన మా తండ్రి అని చెప్పుకొనేందుకు సిగ్గుపడుతున్నా" ఓ 15 ఏళ్ల కిందట కర్ణాటకలో జరిగిన రాజకీయం…
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చుట్టూ బీజేపీకి చెందిన హేమాహేమీలు ఉంటారు. దాదాపుగా వారంతా ఉత్తరాదికి చెందిన వారే. దక్షిణాదికి…
తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అతిథిగా వచ్చిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా చిన్నపాటి బాంబు పేల్చారు. ఇప్పటిదాకా…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత నియోజకవర్గం పుంగనూరులో ఆదివారం జరిగిన జనసేన బహిరంగ సభ…