ప్రస్తుతం రాజమౌళితో ‘ఆర్ఆర్ఆర్’ చేస్తున్న ఎన్టీఆర్, ఈ మూవీ తర్వాత దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్తో సినిమా చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించాడు. ‘అరవింద సమేత వీరరాఘవ’తో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న ఈ ఇద్దరూ, మరోసారి చేతులు కలుపుతున్నారు. అయితే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, ఎన్టీఆర్ మూవీలో కూడా తనకు అచొచ్చిన ఓ సెంటిమెంట్ను ఫాలో అవుతున్నాడట.
‘అరవింద సమేత వీరరాఘవ’ సినిమాలో విలన్గా యంగ్ హీరో నవీన్ చంద్రను చూపించాడు త్రివిక్రమ్. బాల్రెడ్డి పాత్రలో ఆలోచన ఉన్న యంగ్ ఫ్యాక్షనిస్టుగా నవీన్ చంద్ర నటన ఆకట్టుకుంది. ఆ తర్వాత అల్లుఅర్జున్ ‘అల వైకుంఠపురంలో’ రాజ్గా హీరో సుశాంత్ నటించాడు. అలాగే డిజాస్టర్ రిజల్ట్ వచ్చిన పవన్ కళ్యాణ్ ‘అజ్ఞాతవాసి’ సినిమాలో కూడా హీరో ఆది పినిశెట్టి సెకండ్ హీరోగా కనిపించాడు.
‘అజ్ఞాతవాసి’ విషయంలో వర్కవుట్ కాకపోయినా, ఆ తర్వాత రెండు సినిమాల్లోనూ సూపర్గా వర్కవుట్ అయ్యింది ఈ సెకండ్ హీరో సెంటిమెంట్. అందుకే ఇప్పుడు ఎన్టీఆర్30 మూవీలో ఓ ఇంపార్టెంట్ రోల్లో టాలీవుడ్ యంగ్ హీరో కనిపించబోతున్నాడని టాక్.
ఇందుకోసం ఇప్పటికోసం అతనితో చర్చలు జరిపారని కూడా వార్తలు వస్తున్నాయి. అయితే ఆ యంగ్ హీరో ఎవరనేది మాత్రం సస్పెన్స్గా మారింది. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’ చిత్రంతో మంచి గుర్తింపు దక్కించుకున్న నవీన్ పొలిశెట్టి, త్రివిక్రమ్- ఎన్టీఆర్ చిత్రంలో నటిస్తున్నాడని కొందరు అంటుంటే… కాదు త్రివిక్రమ్ ఈ సినిమాతో ఎవ్వరూ ఊహించని ట్విస్ట్ ఇవ్వబోతున్నారని… అందుకే ఆ సెకండ్ హీరో ఎవరనేది మూవీ రిలీజ్ దాకా సస్పెన్స్గా ఉంచబోతున్నారని టాక్. ‘ఆర్ఆర్ఆర్’ మూవీ షూటింగ్ ముగిసిన తర్వాత త్రివిక్రమ్- ఎన్టీఆర్ మూవీ రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కానుంది.
This post was last modified on April 29, 2020 8:21 am
రేపు విడుదల కాబోతున్న టాక్సిక్ మీద అభిమానుల అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఆశ్చర్యకరంగా హిందీ వెర్షన్ అమ్మకాలు…
మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టుతో లిక్కర్ కుంభకోణం మళ్ళీ తెరపైకి వచ్చింది. వైసీపీ ప్రభుత్వంలో నాశిరకం మద్యం వ్యాపారాన్ని…
``కాంగ్రెస్ పార్టీలో నేనైనా ఆమె అయినా ఒక్కటే. పార్టీ క్రమశిక్షణ విషయంలో అందరూ సమానమే. ఎవరు ఏం చేశారన్నది పార్టీ…
ఒక పార్టీలో ఇబ్బందులు రావొచ్చు.. నాయకులు అసంతృప్తి వ్యక్తం చేయొచ్చు. కానీ.. అడుగు పెట్టిన ప్రతిపార్టీలోనూ ఇబ్బందులు వస్తే.. ప్రతిపార్టీపైనా…
‘ఎల్లమ్మ’ గురించి ఇప్పటివరకు ఎక్కువగా మాట్లాడుకున్నది వేణు యెల్దండి కథ, గ్రామీణ నేపథ్యం, డీఎస్పీ లుక్ గురించే. ‘బలగం’ తర్వాత…
వారం రోజుల క్రితం తిరుపతిలో వెంకటేశ్వర స్వామి సాక్షిగా రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి…