ప్రస్తుతం రాజమౌళితో ‘ఆర్ఆర్ఆర్’ చేస్తున్న ఎన్టీఆర్, ఈ మూవీ తర్వాత దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్తో సినిమా చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించాడు. ‘అరవింద సమేత వీరరాఘవ’తో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న ఈ ఇద్దరూ, మరోసారి చేతులు కలుపుతున్నారు. అయితే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, ఎన్టీఆర్ మూవీలో కూడా తనకు అచొచ్చిన ఓ సెంటిమెంట్ను ఫాలో అవుతున్నాడట.
‘అరవింద సమేత వీరరాఘవ’ సినిమాలో విలన్గా యంగ్ హీరో నవీన్ చంద్రను చూపించాడు త్రివిక్రమ్. బాల్రెడ్డి పాత్రలో ఆలోచన ఉన్న యంగ్ ఫ్యాక్షనిస్టుగా నవీన్ చంద్ర నటన ఆకట్టుకుంది. ఆ తర్వాత అల్లుఅర్జున్ ‘అల వైకుంఠపురంలో’ రాజ్గా హీరో సుశాంత్ నటించాడు. అలాగే డిజాస్టర్ రిజల్ట్ వచ్చిన పవన్ కళ్యాణ్ ‘అజ్ఞాతవాసి’ సినిమాలో కూడా హీరో ఆది పినిశెట్టి సెకండ్ హీరోగా కనిపించాడు.
‘అజ్ఞాతవాసి’ విషయంలో వర్కవుట్ కాకపోయినా, ఆ తర్వాత రెండు సినిమాల్లోనూ సూపర్గా వర్కవుట్ అయ్యింది ఈ సెకండ్ హీరో సెంటిమెంట్. అందుకే ఇప్పుడు ఎన్టీఆర్30 మూవీలో ఓ ఇంపార్టెంట్ రోల్లో టాలీవుడ్ యంగ్ హీరో కనిపించబోతున్నాడని టాక్.
ఇందుకోసం ఇప్పటికోసం అతనితో చర్చలు జరిపారని కూడా వార్తలు వస్తున్నాయి. అయితే ఆ యంగ్ హీరో ఎవరనేది మాత్రం సస్పెన్స్గా మారింది. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’ చిత్రంతో మంచి గుర్తింపు దక్కించుకున్న నవీన్ పొలిశెట్టి, త్రివిక్రమ్- ఎన్టీఆర్ చిత్రంలో నటిస్తున్నాడని కొందరు అంటుంటే… కాదు త్రివిక్రమ్ ఈ సినిమాతో ఎవ్వరూ ఊహించని ట్విస్ట్ ఇవ్వబోతున్నారని… అందుకే ఆ సెకండ్ హీరో ఎవరనేది మూవీ రిలీజ్ దాకా సస్పెన్స్గా ఉంచబోతున్నారని టాక్. ‘ఆర్ఆర్ఆర్’ మూవీ షూటింగ్ ముగిసిన తర్వాత త్రివిక్రమ్- ఎన్టీఆర్ మూవీ రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కానుంది.
This post was last modified on April 29, 2020 8:21 am
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…