ప్రస్తుతం రాజమౌళితో ‘ఆర్ఆర్ఆర్’ చేస్తున్న ఎన్టీఆర్, ఈ మూవీ తర్వాత దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్తో సినిమా చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించాడు. ‘అరవింద సమేత వీరరాఘవ’తో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న ఈ ఇద్దరూ, మరోసారి చేతులు కలుపుతున్నారు. అయితే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, ఎన్టీఆర్ మూవీలో కూడా తనకు అచొచ్చిన ఓ సెంటిమెంట్ను ఫాలో అవుతున్నాడట.
‘అరవింద సమేత వీరరాఘవ’ సినిమాలో విలన్గా యంగ్ హీరో నవీన్ చంద్రను చూపించాడు త్రివిక్రమ్. బాల్రెడ్డి పాత్రలో ఆలోచన ఉన్న యంగ్ ఫ్యాక్షనిస్టుగా నవీన్ చంద్ర నటన ఆకట్టుకుంది. ఆ తర్వాత అల్లుఅర్జున్ ‘అల వైకుంఠపురంలో’ రాజ్గా హీరో సుశాంత్ నటించాడు. అలాగే డిజాస్టర్ రిజల్ట్ వచ్చిన పవన్ కళ్యాణ్ ‘అజ్ఞాతవాసి’ సినిమాలో కూడా హీరో ఆది పినిశెట్టి సెకండ్ హీరోగా కనిపించాడు.
‘అజ్ఞాతవాసి’ విషయంలో వర్కవుట్ కాకపోయినా, ఆ తర్వాత రెండు సినిమాల్లోనూ సూపర్గా వర్కవుట్ అయ్యింది ఈ సెకండ్ హీరో సెంటిమెంట్. అందుకే ఇప్పుడు ఎన్టీఆర్30 మూవీలో ఓ ఇంపార్టెంట్ రోల్లో టాలీవుడ్ యంగ్ హీరో కనిపించబోతున్నాడని టాక్.
ఇందుకోసం ఇప్పటికోసం అతనితో చర్చలు జరిపారని కూడా వార్తలు వస్తున్నాయి. అయితే ఆ యంగ్ హీరో ఎవరనేది మాత్రం సస్పెన్స్గా మారింది. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’ చిత్రంతో మంచి గుర్తింపు దక్కించుకున్న నవీన్ పొలిశెట్టి, త్రివిక్రమ్- ఎన్టీఆర్ చిత్రంలో నటిస్తున్నాడని కొందరు అంటుంటే… కాదు త్రివిక్రమ్ ఈ సినిమాతో ఎవ్వరూ ఊహించని ట్విస్ట్ ఇవ్వబోతున్నారని… అందుకే ఆ సెకండ్ హీరో ఎవరనేది మూవీ రిలీజ్ దాకా సస్పెన్స్గా ఉంచబోతున్నారని టాక్. ‘ఆర్ఆర్ఆర్’ మూవీ షూటింగ్ ముగిసిన తర్వాత త్రివిక్రమ్- ఎన్టీఆర్ మూవీ రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కానుంది.
This post was last modified on April 29, 2020 8:21 am
భారత దేశానికి శత్రుదేశాలపై యుద్ధాలు కొత్తకాదు.. ఉగ్రవాదులపై దాడులు కూడా కొత్తకాదు. కానీ.. అందరినీ ఏకం చేయడంలోనూ.. అందరినీ ఒకే…
అట్లీ దర్శకత్వంలో రూపొందబోయే అల్లు అర్జున్ 22 షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. స్క్రిప్ట్ లాక్ చేసిన టీమ్ ప్రస్తుతం…
ఇన్నేళ్లు సమంతను ఒక కథానాయికగానే చూశాం. కానీ ఇప్పుడు ఆమెను నిర్మాతగా చూస్తున్నాం. తన ప్రొడక్షన్లో తెరకెక్కిన తొలి చిత్రం…
ఓర్పు-సహనం.. అనేవి ఎంతో కష్టం. ఒక విషయం నుంచి.. ప్రజల ద్వారా మెప్పు పొందాలన్నా.. అదేసమయంలో వస్తున్న విమర్శల నుంచి…
సుమారు 1000 కోట్ల రూపాయల వరకు ప్రకృతి సంపదను దోచుకున్నారన్న ఆరోపణలు ఉన్న ఓబులాపురం మైనింగ్ కేసులో ప్రధాన దోషులు..…
దాయాది దేశం పాకిస్థాన్కు ఊహించని పరిణామం ఎదురైంది. వాస్తవానికి పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత.. తమపై భారత్ కత్తి దూస్తుందని పాక్…