ఎన్టీఆర్ కోసం ఆ సెకండ్ హీరో ఎవరబ్బా??

ప్రస్తుతం రాజమౌళితో ‘ఆర్ఆర్ఆర్’ చేస్తున్న ఎన్టీఆర్, ఈ మూవీ తర్వాత దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో సినిమా చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించాడు. ‘అరవింద సమేత వీరరాఘవ’తో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న ఈ ఇద్దరూ, మరోసారి చేతులు కలుపుతున్నారు. అయితే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, ఎన్టీఆర్ మూవీలో కూడా తనకు అచొచ్చిన ఓ సెంటిమెంట్‌ను ఫాలో అవుతున్నాడట.

‘అరవింద సమేత వీరరాఘవ’ సినిమాలో విలన్‌గా యంగ్ హీరో నవీన్ చంద్రను చూపించాడు త్రివిక్రమ్. బాల్‌రెడ్డి పాత్రలో ఆలోచన ఉన్న యంగ్ ఫ్యాక్షనిస్టుగా నవీన్ చంద్ర నటన ఆకట్టుకుంది. ఆ తర్వాత అల్లుఅర్జున్ ‘అల వైకుంఠపురంలో’ రాజ్‌గా హీరో సుశాంత్ నటించాడు. అలాగే డిజాస్టర్‌ రిజల్ట్ వచ్చిన పవన్ కళ్యాణ్ ‘అజ్ఞాతవాసి’ సినిమాలో కూడా హీరో ఆది పినిశెట్టి సెకండ్ హీరోగా కనిపించాడు.

‘అజ్ఞాతవాసి’ విషయంలో వర్కవుట్ కాకపోయినా, ఆ తర్వాత రెండు సినిమాల్లోనూ సూపర్‌గా వర్కవుట్ అయ్యింది ఈ సెకండ్ హీరో సెంటిమెంట్. అందుకే ఇప్పుడు ఎన్టీఆర్30 మూవీలో ఓ ఇంపార్టెంట్ రోల్‌లో టాలీవుడ్ యంగ్ హీరో కనిపించబోతున్నాడని టాక్.

ఇందుకోసం ఇప్పటికోసం అతనితో చర్చలు జరిపారని కూడా వార్తలు వస్తున్నాయి. అయితే ఆ యంగ్ హీరో ఎవరనేది మాత్రం సస్పెన్స్‌గా మారింది. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’ చిత్రంతో మంచి గుర్తింపు దక్కించుకున్న నవీన్ పొలిశెట్టి, త్రివిక్రమ్- ఎన్టీఆర్ చిత్రంలో నటిస్తున్నాడని కొందరు అంటుంటే… కాదు త్రివిక్రమ్ ఈ సినిమాతో ఎవ్వరూ ఊహించని ట్విస్ట్ ఇవ్వబోతున్నారని… అందుకే ఆ సెకండ్ హీరో ఎవరనేది మూవీ రిలీజ్ దాకా సస్పెన్స్‌గా ఉంచబోతున్నారని టాక్. ‘ఆర్ఆర్ఆర్’ మూవీ షూటింగ్ ముగిసిన తర్వాత త్రివిక్రమ్- ఎన్టీఆర్ మూవీ రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కానుంది.