తెలుగు టాక్ షోల్లో నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేసే అన్ స్టాపబుల్ చాలా స్పెషల్. అందులో చాలామంది అతిథులతో ఎన్నో కొత్త కొత్త విషయాలు చెప్పించాడు బాలయ్య. ఇప్పుడు ఆయన షోలోకి విశిష్ట అతిథులు వచ్చారు. తెలుగు వారికి చేరువైన మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్తో పాటు అతడితో లక్కీ భాస్కర్ సినిమా తీసిన వెంకీ అట్లూరి, నాగవంశీ, కథానాయికగా నటించిన మీనాక్షి చౌదరి లేటెస్ట్గా ఈ షోకు గెస్టులుగా వచ్చారు.
దీపావళి కానుకగా రాబోతున్న ఈ ఎపిసోడ్కు సంబంధించి ప్రోమోను తాజాగా లాంచ్ చేశారు. అది దీపావళి టపాసుల్లాగే పేలింది. ఎపిసోడ్లో హైలైట్లతో ప్రోమో కూడా చాలా షార్ప్గా కట్ చేశారు. ఈ మధ్య ఇంటర్వ్యూల్లో సంచలన కామెంట్లతో సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిన నిర్మాత నాగవంశీ కామెంట్లే ఈ ఎపిసోడ్కు ఆకర్షణగా మారేలా కనిపిస్తున్నాయి.
బాలయ్య ఈ ఎపిసోడ్లో అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు ఇచ్చాడు నాగవంశీ. నీకు నచ్చని డ్రెస్సింగ్ స్టైల్ గురించి చెప్పమని అడిగితే.. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు అప్పుడప్పుడూ ఒక పింక్ ప్యాంట్ వేస్తారని.. అది వద్దు అని రాజుకు చెప్పాలని అనుకుంటున్నట్లు నాగవంశీ కామెంట్ చేయడం విశేషం. మరోవైపు వెంకీ అట్లూరి పని చేయాలని ఆశపడే హీరోయిన్ ఎవరు అని అడిగితే.. ఎప్పట్నుంచో పూజా హెగ్డే మీద మనోడికి కన్ను ఉందంటూ మరో ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నాగవంశీ.
ఇక సినిమా సినిమాకూ పారితోషకం పెంచేస్తున్నాడని మీరు ఫీలయ్యే హీరో ఎవరు అని అడిగితే.. తన మనసులో ఒకరు ఉన్నారంటూ సస్పెన్స్ మెయింటైన్ చేస్తూ జవాబు చెప్పే ప్రయత్నం చేశాడు నాగవంశీ. ఫుల్ ఎపిసోడ్ మీద ఆసక్తి పెంచేలా ఈ ప్రశ్నలు, సమాధానాలు ఉన్నాయనడంలో సందేహం లేదు. మరోవైపు దుల్కర్ సల్మాన్తో బాలయ్య చిట్ చాట్, మీనాక్షితో సరదా కామెంట్లు, వెంకీ అట్లూరి మీద కౌంటర్లతో ఎపిసోడ్ చాలా హుషారుగా సాగినట్లే కనిపిస్తోంది. ఈ నెల 31న రాత్రి ఈ ఎపిసోడ్ ఆహాలో ప్రసాదరం అవుతుంది.
This post was last modified on October 30, 2024 9:54 am
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…
ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…
వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…