తెలుగు చిత్ర పరిశ్రమకు ఇప్పుడు కొత్త కొరత వచ్చింది. ప్రస్తుతం మన పెద్ద సినిమాలకు విలన్లు దొరకడం లేదు. జగపతిబాబు రొటీన్ అయిపోవడంతో ఇప్పుడాయనను తీసుకోవడానికి దర్శకులు ఇష్టపడడం లేదు. రాజశేఖర్, నారా రోహిత్, గోపీచంద్ తదితరులు విలన్ పాత్రలు చేయడానికి ఆసక్తి చూపించట్లేదు.
దీంతో పరభాషా సీనియర్ హీరోలను తెచ్చి ఇక్కడ విలన్లుగా చేయించడానికి మన దర్శకులు తంటాలు పడుతున్నారు. కన్నడ స్టార్ ఉపేంద్ర ఇటీవల చాలా తెలుగు సినిమా విలన్ క్యారెక్టర్లను రిజెక్ట్ చేసాడు. విజయ్ సేతుపతి ‘ఉప్పెన’లో విలన్గా నటించినా కానీ తర్వాత పుష్ప సినిమాకు డేట్లు సర్దుబాటు చేయలేకపోయాడు. మాధవన్కి కూడా విలన్ క్యారెక్టర్స్ పట్ల ఇంట్రెస్ట్ ఉన్నట్టు లేదు.
ధృవలో విలన్గా చేసిన అరవింద్ స్వామి కోసం పరశురామ్ ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. మహేష్తో చేస్తోన్న ‘సర్కారు వారి పాట’ సినిమాలో విలన్గా అరవింద్ స్వామి నటించే అవకాశం వుందట. ఇంతవరకు పుష్పలో అల్లు అర్జున్కి విలన్ ఎవరనేది తేలలేదు. మొన్నటివరకు హీరోయిన్ల కొరత మాత్రమే తెలుగు సినిమా దర్శకులను ఇబ్బంది పెట్టేది. ఇప్పుడు విలన్స్ కొరత కూడా తోడవడం షెడ్యూల్స్ ప్లానింగ్కి పెద్ద ఇబ్బందిగా పరిణమించింది.
This post was last modified on October 2, 2020 2:52 pm
టీడీపీ అధినేత చంద్రబాబుకు.. బిగ్ బ్రేక్ వచ్చింది. ఇప్పటి వరకు కేంద్రంలోని పెద్దలు ఎవరూ.. ముఖ్యంగా బీజేపీ అగ్రనాయకులుగా ఉన్నవారు…
ఏపీలో సంచలనం చోటు చేసుకుంది. ఎన్నికల వేళ అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఇప్పటికే చాలా మంది…
ఏపీలో ఎన్నికలకు మరో వారం రోజులు మాత్రమే గడువు ఉంది. ఈ నెల 13న అంటే వచ్చే సోమవారం.. ఎన్నికల…
‘ఆర్ఆర్ఆర్’ తర్వాత మెగా పవర్ స్టార్ ఆలస్యం చేయకుండా శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ చేంజర్’ మొదలుపెట్టేశాడని చాలా సంతోషించారు మెగా…
కేంద్ర మంత్రి, బీజేపీ అగ్రనేత.. అమిత్ షా.. ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్పై సంచలన వ్యాఖ్యలు చేశా రు.…
ఈ ఏడాది పాన్ ఇండియా స్థాయిలో మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ‘పుష్ప: ది రూల్’ ఒకటి. ‘పుష్ప: ది రైజ్’తో…