అక్కినేని అభిమానులు అప్డేట్ అంటూ తపించిపోతున్న అక్కినేని అభిమానుల కోసం తండేల్ దర్శకుడు చందూ మొండేటి ఎట్టకేలకు కుండ బద్దలు కొట్టేశారు. వేరే సినిమా ట్రైలర్ లాంఛ్ కు అతిథిగా విచ్చేసిన సందర్భంగా ఈ ప్రశ్న ఎదురు కావడంతో సమాధానం చెప్పాడు. డిసెంబర్ కు ఫస్ట్ కాపీ సిద్ధం చేయడం సాధ్యం కాదని, అందుకే క్రిస్మస్ ఆప్షన్ పెట్టుకోలేదని క్లారిటీ ఇచ్చాడు. జనవరి కంతా మొత్తం పూర్తవుతుందని, కానీ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ కోసం అల్లు అరవింద్ ఆలోచించినా, మేనమామ వెంకటేష్ కోసం నాగచైతన్య వద్దనుకున్నా సంక్రాంతి నుంచి తప్పుకోవాల్సి ఉంటుందని హింట్ ఇచ్చాడు.
సో దీన్ని బట్టి చూస్తే ఇంకా ఎలాంటి నిర్ణయం జరగలేదని అర్థమవుతోంది. నిజానికి సంక్రాంతి చాలా మంచి ఆప్షన్ అయినప్పటికీ స్వయానా మేనల్లుడి సినిమా బరిలో ఉండగా తండేల్ దింపడం గురించి అల్లు అరవింద్ ఖచ్చితంగా ఆలోచిస్తారు. పైగా పోటీలో వెంకటేష్, బాలకృష్ణ, అజిత్ లాంటి అగ్ర హీరోలు ఉన్నప్పుడు ప్రాక్టికల్ గా ఆలోచించాలి. తండేల్ మీద చాలా బడ్జెట్ పెట్టారు. చైతు కెరీర్ లోనే అత్యధిక ఖర్చు డిమాండ్ చేసిన సబ్జెక్టు ఇది. అలాంటిది ఏదో తొందరపడి పోటీకి వెళ్తే ఓపెనింగ్స్ ప్రభావితం చెందే అవకాశం ఉంది. అందుకే సోలోగా రావడం తండేల్ కు చాలా ముఖ్యం.
జనవరి చివరి వారం కూడా చందూ మొండేటి ఖరారు చేయడం లేదు. ఇంకో పది రోజులు మాత్రమే షూటింగ్ బ్యాలన్స్ ఉందని చెప్పడం చూస్తే అమరన్ ప్రమోషన్ల కోసం బిజీగా ఉన్న సాయిపల్లవి కోసమే ఈ బ్రేకని అర్థమవుతోంది. పైగా చైతు కూడా ఎంగేజ్మెంట్, ఏఎన్ఆర్ నేషనల్ అవార్డు ఫంక్షన్ అంటూ బిజీగా ఉన్నాడు. ఇండియా పాకిస్థాన్ నేపథ్యంలో రూపొందిన తండేల్ లో చైతన్య మొదటిసారి బెస్తవారి కుర్రాడిగా నటించాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం మీద కూడా భారీ అంచనాలున్నాయి. మరి చివరికి ఏం తెలుస్తారో తెలియడానికి ఇంకొన్ని రోజులు పడుతుంది. అప్పటిదాకా వెయిట్ చేయాల్సిందే.
This post was last modified on October 29, 2024 12:41 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…