టాలీవుడ్లో చాలా వేగంగా స్టార్ ఇమేజ్ తెచ్చుకుని విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్న నటుడు విజయ్ దేవరకొండ. పెళ్ళిచూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం, ట్యాక్సీవాలా లాంటి సక్సెస్లతో అతడి పేరు ఒక సమయంలో మార్మోగింది. కానీ తర్వాత వరుస ఫ్లాపులు విజయ్ని వెనక్కి లాగేశాయి. అందులోనూ లైగర్, ఫ్యామిలీ స్టార్ డిజాస్టర్లు కావడం విజయ్ కెరీర్ను బాగా దెబ్బ తీశాయి. దీంతో ఎంతో ఆత్మవిశ్వాసంతో కనిపించే విజయ్ ఈ మధ్య కొంచెం డల్ అయినట్లు కనిపిస్తున్నాడు.
తాజాగా ‘లక్కీ భాస్కర్’ ప్రి రిలీజ్ ఈవెంట్లో కూడా విజయ్ ఒకప్పటి స్థాయిలో హుషారుగా కనిపించలేదు. తన మాటల్లో దూకుడు తగ్గింది. ఈ విషయం గమనించాడో ఏమో.. ఈ వేడుకలో పాల్గొన్న స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ రౌడీ స్టార్కు మంచి బూస్ట్ ఇచ్చాడు.
తన ప్రసంగంలో విజయ్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించి, తనను దగ్గరికి తీసుకున్న త్రివిక్రమ్.. విజయ్ తనకు ఎంతో నచ్చిన నటుడని చెప్పాడు. విజయ్ చాలా తక్కువ సమయంలో ప్రేక్షకుల నుంచి ఎంతో ప్రేమను చూశాడని.. అలాగే అంతకు రెట్టింపు ద్వేషాన్ని కూడా ఎదుర్కొన్నాడని త్రివిక్రమ్ పేర్కొన్నాడు. కానీ విజయ్ అన్నింటినీ తట్టుుకన్నాడని చెబుతూ.. “మావాడు చాలా గట్టివాడు” అని విజయ్ని కౌగిలించుకోవడంతో స్టేజ్, ఆడిటోరియం ఎమోషనల్గా మారాయి.
ప్రస్తుత విజయ్ మానసిక స్థితిని త్రివిక్రమ్ బాగా అర్థం చేసుకున్నాడని.. సోషల్ మీడియాలో అతడి మీద పనిగట్టుకుని నెగెటివిటీని చూపించిన విషయాన్ని త్రివిక్రమ్ బాగానే గుర్తించి సందర్భానుసారంగా బాగా మాట్లాడాడని.. త్రివిక్రమ్ స్థాయి వ్యక్తి ఇలా స్ట్రగుల్లో ఉన్న టాలెంటెడ్ యంగ్ హీరోకు బూస్ట్ ఇవ్వడం చాలా మంచి విషయమని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. త్రివిక్రమ్ విజయ్ గురించి మాట్లాడిన వీడియోను రౌడీ ఫ్యాన్స్ సోషల్ మీడియలో వైరల్ చేస్తూ ఆయన్ని కొనియాడుతున్నారు.
This post was last modified on October 28, 2024 10:22 am
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…