టాలీవుడ్లో క్రేజీయెస్ట్ సీజన్ అయిన సంక్రాంతికి ఏ సినిమాలు వస్తాయనే విషయంలో ప్రతిసారీ ఉత్కంఠ నెలకొంటుంది. ఈసారి కూడా అందుకు భిన్నమేమీ కాదు. సంక్రాంతి సినిమాల విషయంలో సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. ‘గేమ్ చేంజర్’ ఒక్కటే ఈ పండక్కి రిలీజ్ డేట్ ఖరారు చేసుకుంది. బాలకృష్ణ-బాబీ సినిమా కూడా సంక్రాంతికే వస్తుందని మేకర్స్ ప్రకటించినప్పటికీ.. ఇంకా డేట్ అయితే ఇవ్వలేదు. ఈ చిత్రానికి ఇంకా టైటిల్ కూడా ఖరారు చేయలేదు. దీపావళికి ఏమైనా టైటిల్ ప్రకటించి రిలీజ్ డేట్ కూడా చెబుతారేమో చూడాలి.
మరోవైపు ‘తండేల్’ సినిమా క్రిస్మస్ రేసు నుంచి తప్పుకుని సంక్రాంతికి వస్తుందని వార్తలు వచ్చాయి. కానీ ఆ సంగతి కూడా ఎటూ తేలలేదు. ‘తండేల్’ రేసులోకి రావడంతో చైతూ మావయ్య వెంకటేష్ సినిమా ‘సంక్రాంతికి కలుద్దాం’ (వర్కింగ్ టైటిల్) పండుగ రేసు నుంచి తప్పుకుంటుందనే ప్రచారం జరిగింది.
‘సంక్రాంతికి కలుద్దాం’ గురించి కొన్నాళ్లుగా అసలు సౌండ్ లేదు. దిల్ రాజు ఫోకస్ అంతా ‘గేమ్ చేంజర్’ మీదే నిలిచింది. సంక్రాంతికి ఒక బేనర్ నుంచి రెండు సినిమాలు రిలీజ్ కావేమో అన్న సందేహాలు కూడా కలిగాయి. కానీ రాజు వెంకీ మూవీని కూడా సంక్రాంతికే తేవడానికి సన్నాహాలు చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ వాళ్లు గత ఏడాది ‘వాల్తేరు వీరయ్య’, ‘వీరసింహారెడ్డి’ చిత్రాలను సంక్రాంతికే రిలీజ్ చేసి సక్సెస్ అయిన నేపథ్యంలో రాజుకు అడ్డంకి ఏమీ లేనట్లే.
‘సంక్రాంతికి కలుద్దాం’ సంక్రాంతికే రాబోతుందనే సంకేతాలను టీం కూడా ఇచ్చేసింది. ఈ రోజే ఈ మూవీకి డబ్బింగ్ పనులు మొదలయ్యాయి. 90 శాతం చిత్రీకరణ కూడా పూర్తయినట్లు ఈ సందర్భంగా ప్రకటించారు. ఈ సందర్భంగా చిన్న వీడియో గ్లింప్స్ కూడా చూపించారు. అది చూస్తే ఇది పక్కా పండక్కి సూటయ్యే ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనిపిస్తోంది. త్వరలోనే ‘సంక్రాంతికి కలుద్దాం’ సంక్రాంతి రిలీజ్ గురించి ప్రకటన వస్తుందని భావిస్తున్నారు.
This post was last modified on October 27, 2024 5:04 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…