బాహుబలి, కేజీఎఫ్, పుష్ప లాంటి సినిమాలు దేశవ్యాప్తంగా అదరగొట్టాక.. అందరికీ పాన్ ఇండియా పిచ్చి పట్టుకుంది. మిడ్ రేంజ్, చిన్న స్థాయి హీరోలు సైతం పాన్ ఇండియా సినిమాలను ఘనంగా అనౌన్స్ చేస్తున్నారు. కానీ పోస్టర్ మీద నాలుగైదు భాషల పేర్లు కనిపిస్తున్నాయి కానీ.. ఆయా భాషల్లో నిజంగా సినిమాలు రిలీజవుతున్నాయా.. రిలీజైనా ప్రభావం చూపగలుగుతున్నాయా అంటే ‘లేదు’ అనే సమాధానమే వస్తుంది.
చాలా సినిమాలు తెలుగు వరకే రిలీజై.. మిగతా భాషల్లో అసలు విడుదలే కావడం లేదు. కొన్ని చిత్రాలు హిందీ వరకు రిలీజవుతున్నాయి. అక్కడ పెద్దగా ప్రభావం చూపడం లేదు. నాని లాంటి పేరున్న హీరో నుంచి వచ్చిన పాన్ ఇండియా మూవీస్ ‘దసరా’, ‘హాయ్ నాన్న’, ‘సరిపోదా శనివారం’ ఇతర భాషల్లో నామమాత్రంగా రిలీజయ్యాయి. ‘సరిపోదా శనివారం’ ఒక్కటి తమిళంలో కొంత ప్రభావం చూపిందంతే.
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కూడా ‘పాన్ ఇండియా’ కల కన్నాడు. తన కొత్త చిత్రం ‘క’ను తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళంలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేసుకున్నాడు. కానీ రిలీజ్ దగ్గర పడేసరికి ఈ చిత్రం కేవలం తెలుగులో మాత్రమే విడుదల కాబోతోంది. మలయాళంలో దుల్కర్ సల్మాన్ ఈ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి ముందుకు వచ్చాడు.
కానీ దుల్కర్ సినిమా ‘లక్కీ భాస్కర్’ కూడా అక్టోబరు 31నే రిలీజ్ అవుతుండడంతో దానికి పోటీగా ఈ చిత్రాన్ని విడుదల చేయడం కరెక్ట్ కాదని హీరో కిరణే వారించాడట. ఇక తమిళంలో ఏమో ఈ చిత్రానికి థియేటర్లు ఇవ్వలేదు.
చిన్న స్థాయిలో రిలీజ్ చేయాలని చూసినా కుదరకపోవడంతో తమిళ రిలీజ్ ప్రస్తుతానికి ఆపేశారు. హిందీలో ఈ చిత్రానికి బజ్ క్రియేట్ కాకపోవడం, డిస్ట్రిబ్యూటర్లు దొరక్కపోవడంతో వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. తెలుగులో ఈ సినిమాకు మంచి టాక్ వచ్చి.. పెద్ద సక్సెస్ అయితే.. తర్వాత ఏమైనా ఇతర భాషల్లో రిలీజ్ చేస్తారేమో చూడాలి.
This post was last modified on October 27, 2024 4:02 pm
టాలీవుడ్లో భోజన ప్రియులుగా కొందరు హీరోలకు పేరుంది. అందులో జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ల పేర్లు ముందు వరుసలో ఉంటాయి. తనకు…
బాలీవుడ్ అతి పెద్ద బ్లాక్ బస్టర్ సాధించిన హీరో రణ్వీర్ సింగ్ విచిత్రమైన పరిస్థితిలో ఉన్నాడు. దురంధర్ 2 తర్వాత…
ఇరు తెలుగు రాష్ట్రాలకు 'సర్' వస్తున్నారు.. దేశవ్యాప్తంగా ఓటరు జాబితాలను సమగ్రంగా పరిశీలించేందుకు భారత ఎన్నికల సంఘం ‘స్పెషల్ ఇంటెన్సివ్…
టీ20 వరల్డ్ కప్ 2026 లీగ్ దశ ముగిసి అసలైన మజా మొదలవ్వబోతోంది. ఈసారి సూపర్ 8 గ్రూపులు ఫైనల్…
హైదరాబాద్ నగరంలోని అమీర్పేట మైత్రీవనం చౌరస్తా వద్ద ఉన్న ఆదిత్య ఎన్క్లేవ్ భవనంలో శుక్రవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది.…
విద్యుత్ శాఖలో అవినీతి ఆరోపణలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. లంచాల వ్యవహారంపై విజిలెన్స్ జరిపిన విచారణలో షాకింగ్ నిజాలు బయటపడటంతో…