బాహుబలి, కేజీఎఫ్, పుష్ప లాంటి సినిమాలు దేశవ్యాప్తంగా అదరగొట్టాక.. అందరికీ పాన్ ఇండియా పిచ్చి పట్టుకుంది. మిడ్ రేంజ్, చిన్న స్థాయి హీరోలు సైతం పాన్ ఇండియా సినిమాలను ఘనంగా అనౌన్స్ చేస్తున్నారు. కానీ పోస్టర్ మీద నాలుగైదు భాషల పేర్లు కనిపిస్తున్నాయి కానీ.. ఆయా భాషల్లో నిజంగా సినిమాలు రిలీజవుతున్నాయా.. రిలీజైనా ప్రభావం చూపగలుగుతున్నాయా అంటే ‘లేదు’ అనే సమాధానమే వస్తుంది.
చాలా సినిమాలు తెలుగు వరకే రిలీజై.. మిగతా భాషల్లో అసలు విడుదలే కావడం లేదు. కొన్ని చిత్రాలు హిందీ వరకు రిలీజవుతున్నాయి. అక్కడ పెద్దగా ప్రభావం చూపడం లేదు. నాని లాంటి పేరున్న హీరో నుంచి వచ్చిన పాన్ ఇండియా మూవీస్ ‘దసరా’, ‘హాయ్ నాన్న’, ‘సరిపోదా శనివారం’ ఇతర భాషల్లో నామమాత్రంగా రిలీజయ్యాయి. ‘సరిపోదా శనివారం’ ఒక్కటి తమిళంలో కొంత ప్రభావం చూపిందంతే.
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కూడా ‘పాన్ ఇండియా’ కల కన్నాడు. తన కొత్త చిత్రం ‘క’ను తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళంలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేసుకున్నాడు. కానీ రిలీజ్ దగ్గర పడేసరికి ఈ చిత్రం కేవలం తెలుగులో మాత్రమే విడుదల కాబోతోంది. మలయాళంలో దుల్కర్ సల్మాన్ ఈ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి ముందుకు వచ్చాడు.
కానీ దుల్కర్ సినిమా ‘లక్కీ భాస్కర్’ కూడా అక్టోబరు 31నే రిలీజ్ అవుతుండడంతో దానికి పోటీగా ఈ చిత్రాన్ని విడుదల చేయడం కరెక్ట్ కాదని హీరో కిరణే వారించాడట. ఇక తమిళంలో ఏమో ఈ చిత్రానికి థియేటర్లు ఇవ్వలేదు.
చిన్న స్థాయిలో రిలీజ్ చేయాలని చూసినా కుదరకపోవడంతో తమిళ రిలీజ్ ప్రస్తుతానికి ఆపేశారు. హిందీలో ఈ చిత్రానికి బజ్ క్రియేట్ కాకపోవడం, డిస్ట్రిబ్యూటర్లు దొరక్కపోవడంతో వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. తెలుగులో ఈ సినిమాకు మంచి టాక్ వచ్చి.. పెద్ద సక్సెస్ అయితే.. తర్వాత ఏమైనా ఇతర భాషల్లో రిలీజ్ చేస్తారేమో చూడాలి.
This post was last modified on October 27, 2024 4:02 pm
రాష్ట్రంలో ప్రతిపక్షం.. బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్.. ప్రజలుకడుతున్న పన్నులతో…
ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…
వైసీపీ అధినేత జగన్పై ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి నిప్పులు చెరిగారు. 'అన్న'…
దేశంలో విమానయాన సంస్థల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న…
ఏపీలో మరో కీలక పథకం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. 'దివ్యాంగ శక్తి' పేరుతో కీలక పథకాన్ని సీఎం చంద్రబాబు, ఉప…