బాహుబలి, కేజీఎఫ్, పుష్ప లాంటి సినిమాలు దేశవ్యాప్తంగా అదరగొట్టాక.. అందరికీ పాన్ ఇండియా పిచ్చి పట్టుకుంది. మిడ్ రేంజ్, చిన్న స్థాయి హీరోలు సైతం పాన్ ఇండియా సినిమాలను ఘనంగా అనౌన్స్ చేస్తున్నారు. కానీ పోస్టర్ మీద నాలుగైదు భాషల పేర్లు కనిపిస్తున్నాయి కానీ.. ఆయా భాషల్లో నిజంగా సినిమాలు రిలీజవుతున్నాయా.. రిలీజైనా ప్రభావం చూపగలుగుతున్నాయా అంటే ‘లేదు’ అనే సమాధానమే వస్తుంది.
చాలా సినిమాలు తెలుగు వరకే రిలీజై.. మిగతా భాషల్లో అసలు విడుదలే కావడం లేదు. కొన్ని చిత్రాలు హిందీ వరకు రిలీజవుతున్నాయి. అక్కడ పెద్దగా ప్రభావం చూపడం లేదు. నాని లాంటి పేరున్న హీరో నుంచి వచ్చిన పాన్ ఇండియా మూవీస్ ‘దసరా’, ‘హాయ్ నాన్న’, ‘సరిపోదా శనివారం’ ఇతర భాషల్లో నామమాత్రంగా రిలీజయ్యాయి. ‘సరిపోదా శనివారం’ ఒక్కటి తమిళంలో కొంత ప్రభావం చూపిందంతే.
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కూడా ‘పాన్ ఇండియా’ కల కన్నాడు. తన కొత్త చిత్రం ‘క’ను తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళంలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేసుకున్నాడు. కానీ రిలీజ్ దగ్గర పడేసరికి ఈ చిత్రం కేవలం తెలుగులో మాత్రమే విడుదల కాబోతోంది. మలయాళంలో దుల్కర్ సల్మాన్ ఈ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి ముందుకు వచ్చాడు.
కానీ దుల్కర్ సినిమా ‘లక్కీ భాస్కర్’ కూడా అక్టోబరు 31నే రిలీజ్ అవుతుండడంతో దానికి పోటీగా ఈ చిత్రాన్ని విడుదల చేయడం కరెక్ట్ కాదని హీరో కిరణే వారించాడట. ఇక తమిళంలో ఏమో ఈ చిత్రానికి థియేటర్లు ఇవ్వలేదు.
చిన్న స్థాయిలో రిలీజ్ చేయాలని చూసినా కుదరకపోవడంతో తమిళ రిలీజ్ ప్రస్తుతానికి ఆపేశారు. హిందీలో ఈ చిత్రానికి బజ్ క్రియేట్ కాకపోవడం, డిస్ట్రిబ్యూటర్లు దొరక్కపోవడంతో వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. తెలుగులో ఈ సినిమాకు మంచి టాక్ వచ్చి.. పెద్ద సక్సెస్ అయితే.. తర్వాత ఏమైనా ఇతర భాషల్లో రిలీజ్ చేస్తారేమో చూడాలి.
This post was last modified on October 27, 2024 4:02 pm
తొలి చిత్రం ‘మళ్ళీ రావా’తో దర్శకుడిగా బలమైన ముద్ర వేశాడు గౌతమ్ తిన్ననూరి. సుమంత్ లాంటి ఫాంలో లేని హీరోను పెట్టి,…
ఆరంభ సీజన్లతో పోలిస్తే ‘బిగ్ బాస్’ షోకు ఇప్పుడు ఆదరణ కొంచెం తగ్గిన మాట వాస్తవం. ఒకప్పట్లా సోషల్ మీడియాలో…
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…