Movie News

నందమూరి నాలుగో తరం హీరో దర్శనం ఆ రోజే

టాలీవుడ్లో బిగ్గెస్ట్ సినిమా ఫ్యామిలీస్‌లో నందమూరి వారిది ఒకటి. ఎన్టీఆర్ ఘన వారసత్వాన్ని కొనసాగిస్తూ ఆ కుటుంబం నుంచి చాలామందే సినీ రంగంలోకి వచ్చారు. ఎన్టీఆర్ తర్వాత రెండు తరాల నుంచి హీరోలు టాలీవుడ్లో తమ ప్రత్యేకతను చాటుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు నాలుగో తరం ఎంట్రీకి రంగం సిద్ధమవుతోంది. దివంగత హరికృష్ణ మనవడు, దివంగత జానకి రామ్ తనయుడు అయిన నందమూరి తారక రామారావు (తన షార్ట్ నేమ్ కూడా ఎన్టీఆర్‌యే)ను సీనియర్ దర్శక నిర్మాత వైవీఎస్ చౌదరి హీరోగా పరిచయం చేయబోతున్నట్లు ఇంతకుముందే ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఐతే సినిమాను ప్రకటించినపుడు హీరోను మీడియా ముందుకు తీసుకురాలేదు. తన ఫస్ట్ లుక్ కూడా లాంచ్ చేయలేదు. ఇప్పుడు అందుకోసం ప్రత్యేకంగా ముహూర్తం నిర్ణయించారు.

దీపావళి ముంగిట అక్టోబరు 30న తన హీరో ఫస్ట్ లుక్‌ను లాంచ్ చేయబోతున్నాడు వైవీఎస్ చౌదరి. నందమూరి నాలుగో తరం వారసుడి దర్శనం ఒక రేంజిలో ఉంటుందని ఆయన ఊరిస్తున్నారు. ఐతే కేవలం ఫస్ట్ లుక్ మాత్రమే లాంచ్ చేస్తాడా.. లేక మీడియా ముందుకు తీసుకొచ్చి హీరోను పరిచయం చేస్తాడా అన్నది చూడాలి.

చివరగా ‘రేయ్’ మూవీతో దారుణమైన ఫలితాన్ని అందుకున్న చౌదరి.. దాదాపు దశాబ్దం పాటు విరామం తీసుకున్నారు. ఈ కాలంలో ఆయన వారం వారం కొత్త సినిమాలు చూస్తూ.. మారిన సినిమా పోకడలను గమనిస్తూ వచ్చారు. ఇక ఆయన మళ్లీ సినిమా తీయడేమో అనుకున్న సమయంలో తానెంతో అభిమానించే నందమూరి తారక రామారావు ముని మనవడిని హీరోగా పరిచయం చేయడానికి సిద్ధమయ్యారు. ఈ చిత్రానికి కీరవాణి, చంద్రబోస్, సాయిమాధవ్ బుర్రా లాంటి పేరున్న టెక్నషియన్లు పని చేస్తున్నారు. ఎప్పట్లాగే ఈ సినిమాను కూడా చౌదరి సొంత బేనర్లోనే తీస్తున్నారు.

This post was last modified on October 26, 2024 7:58 am

Share

Recent Posts

అల వైకుంఠపురములో కాదు అనంతపురములో… వైరల్

‘‘ఏమ్మా నాన్నగారు ఉన్నారా? నాన్న గారు….ఇంట్లో లేరని చెప్పమన్నారండీ….నాన్న గారు లేరని చెప్పమన్నారేంట్రా…చెయ్యి పట్టుకొని ఇక్కడికే తీసుకురాలేకపోయావా…కన్ఫ్యూజన్ లేకుండా……’’అల వైకుంఠపురములో…

1 hour ago

మమిత బైజు – వయసు తక్కువా… హిట్లు ఎక్కువ!

ఇటీవలే విడుదలైన విశ్వనాథ్ అండ్ సన్స్ లో మమిత బైజు పోషించిన పాత్ర ఆ సినిమా విజయంలో ఎంత కీలక…

2 hours ago

కేరళం ప్రకృతి వైద్యానికి పవన్ ప్రాధాన్యత

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకృతి చికిత్స కోసం శుక్రవారం కేరళం బయలుదేరి వెళ్లనున్నారు. 20 రోజుల పాటు కేరళంలోనే…

2 hours ago

మల్లెపూల పల్లకి… ఊగుతున్న థియేటర్లు

ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…

4 hours ago

శాశ్వత సెలవు తీసుకున్న షావుకారు జానకి

దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…

5 hours ago

సింగిల్ సింహం అంటారు… ఇదేం రాజకీయం జగన్?

ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…

6 hours ago