Movie News

అక్షయ్ కుమార్ సంచలనం

బాలీవుడ్లో ఇప్పుడు అక్షయ్ కుమార్ ఉన్నంత స్పీడులో ఇంకెవరూ లేరు. ఒక్కో సినిమాకు తీసుకునే పారితోషకం విషయంలో ఆయన్ని మించిన హీరోలుండొచ్చు కానీ.. ఓవరాల్‌గా ఏడాది ఆదాయం తీసుకుంటే మాత్రం అక్షయే నంబర్ వన్. అందుక్కారణం అక్షయ్ ఏటా మూడు నుంచి నాలుగు సినిమాలు పూర్తి చేసి పక్కన పెట్టేస్తాడు. అలాగని అతను క్వాలిటీ విషయంలో ఏమీ రాజీ పడడు.

గత ఏడాది అతను మూణ్నాలుగు సినిమాలతో పలకరించడం విశేషం. అందులో మూడు (కేసరి, మిషన్ మంగల్, గుడ్ న్యూజ్) మంచి విజయం సాధించాయి. సరైన టాక్ రాకున్నప్పటికీ ‘హౌస్‌ ఫుల్-4’ సైతం బాగానే ఆడింది. ఈసారి కూడా మూణ్నాలుగు రిలీజ్‌లు టార్గెట్ పెట్టుకున్నాడు కానీ.. కరోనా బ్రేక్ వేసింది. సూర్యవంశీ, లక్ష్మీబాంబ్ చిత్రాల రిలీజ్ ఆగిపోయింది. అవి అనుకున్న ప్రకారం వచ్చేసి ఉంటే ఇంకో రెండు సినిమాలు రెడీ చేసేవాడేమో.

లక్ష్మీబాంబ్ వచ్చే నెల 9న హాట్‌స్టార్‌లో విడుదల కానుండగా.. ‘సూర్యవంశీ’ థియేటర్లు ఓపెనయ్యాక విడుదలవుతుంది. కరోనా రాకముందే అక్షయ్ అంగీకరించిన ‘బెల్ బాటమ్’ సినిమాను ఈ ఏడాది విడుదల చేయడానికి వీల్లేకపోయింది. దాన్ని వచ్చే వేసవికి అనుకుంటున్నారు. ఐతే ఈ సినిమాను కరోనా టైంలోనే మొదలుపెట్టి సంచలన రీతిలో పూర్తి చేసిన వైనం చూసి అందరూ విస్తుబోతున్నారు.

ఆగస్టులో షూటింగ్‌లు నెమ్మదిగా పున:ప్రారంభమవుతున్న దశలో ఈ సినిమాను మొదలుపెట్టారు. తర్వాత తన టీంతో కలిసి యూరప్‌కు వెళ్లాడు అక్షయ్. ఏదో ఒక షెడ్యూల్ షూటింగ్ చేసుకుని వస్తాడని అనుకుంటే.. మొత్తం సినిమాను పూర్తి చేసేశాడంటూ ఇప్పుడు అప్‌డేట్ బయటికి వచ్చింది. ఎంతో భారీతనంతో కూడుకున్న ఈ చిత్రం కేవలం 38 రోజుల వర్కింగ్ డేస్‌తో పూర్తయిందట. ఇండియాలో 50 మందికి మించి చిత్రీకరణలో పాల్గొనడానికి వీల్లేకపోవడంతో పెద్దగా జనం అవసరం లేని సన్నివేశాలన్నీ ఇక్కడ తీసేసి.. ఎక్కువమంది అవసరం ఉన్న సీన్లను కరోనా ప్రభావం పెద్దగా లేని విదేశాల్లో పూర్తి చేసుకుని వచ్చారు. అంత పెద్ద హీరో, పెద్ద సినిమా.. కరోనా టైంలో ఇలా మొదలై అలా పూర్తయిపోవడం అందరినీ విస్మయానికి గురి చేస్తోంది.

This post was last modified on October 2, 2020 11:34 am

Share

Recent Posts

లక్షల్లో తీసిన చెత్త సినిమా… కోట్లలో కలెక్షన్లు

ఒక చిన్న వేడుక చేయడానికే కనీసం లక్ష రూపాయలు ఖర్చయ్యే సొసైటీలో ఉన్నాం మనం. అలాంటిది కేవలం రెండు నుంచి…

2 hours ago

రజిని సినిమాలో విలన్… రాపో పెద్ద రిస్కు?

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో రూపొందుతున్న ధర్మన్ షూటింగ్ మంచి ఊపు మీద ఉంది. ఇప్పటికే…

3 hours ago

మడమ తిప్పిన విజయ సాయిరెడ్డి… కొత్త పార్టీ రెడీ!

వైసీపీ మాజీ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయసాయిరెడ్డి ప్రత్యక్ష రాజకీయాల నుంచి గత ఏడాది జనవరిలో తప్పుకున్న…

3 hours ago

శ్రీలీల మిస్సయ్యింది మమిత సాధించింది

ఇండస్ట్రీకి కొత్త హీరోయిన్లు వస్తున్నారు. ఇరవై, పాతిక వయసు ఉన్న వాళ్లకు మంచి అవకాశాలు దక్కుతున్నాయి. కానీ వాటిని ఎంచుకోవడం,…

3 hours ago

డీఎస్సీ నిర్వహణ సూపర్… లోకేష్ కు ఢిల్లీ మంత్రి అభినందనలు

రాష్ట్ర ప్రభుత్వం విజయవంతంగా నిర్వహించిన డీఎస్సీ పరీక్షల నిర్వాహణపై ప్రతిపక్ష వైసీపీ రాద్దాంతం చేస్తున్న విషయం తెలిసిందే. ఆధారాలు లేకుండా…

5 hours ago

మూడో బిడ్డను కంటే సంవత్సరం సెలవు

దక్షిణాది రాష్ట్రాల్లో తగ్గుతున్న జననాల రేటు నేపథ్యంలో కుటుంబాల్లో పిల్లల సంఖ్యను పెంచేందుకు ప్రభుత్వాలు పలు చర్యలు చేపడుతున్నాయి. ఈ…

6 hours ago