నవంబర్ 14 విడుదల కాబోతున్న కంగువ ప్రమోషన్లలో భాగంగా హీరో సూర్య నిన్నబాలకృష్ణ అన్ స్టాపబుల్ సీజన్ 4 షోలో పాల్గొన్నాడు. ఆ తర్వాత ఎఎంబిలో జరిగిన ట్రైలర్ లాంచ్ లో అభిమానులను ప్రత్యక్షంగా కలుసుకున్నాడు. తనకు ఇక్కడ ఫాలోయింగ్ కొత్త కాకపోయినా గత కొన్నేళ్లుగా సరైన హిట్ లేని నేపథ్యంలో ఎక్కువ రద్దీ ఉండకపోవచ్చని నిర్వాహకులు భావించారు. కానీ ఆ అంచనాలను తలకిందలు చేస్తూ ఒక్కసారిగా ఫ్యాన్స్ వందల సంఖ్యలో రావడంతో ప్రాంగణం కిక్కిరిసిపోయింది. ఉన్న సెక్యూరిటీ దీన్ని నియంత్రించలేక ఒక దశలో చేతులు ఎత్తేయాల్సిన పరిస్థితి వచ్చినా ఎలాగోలా కంట్రోల్ చేశారు.
నిజానికి ఇంత ప్రేమ సూర్య ఊహించాడో లేదో కానీ ఒక్కసారి ప్రేమించడం మొదలుపెడితే టాలీవుడ్ ఫ్యాన్స్ జీవితాంతం హీరోలను తమ గుండెల్లో పెట్టుకుంటారని చెప్పడానికి ఇంత కన్నా ఉదాహరణ అక్కర్లేదు. అందుకే సూర్య ఎమోషనల్ కాకుండా ఉండలేకపోయాడు. కన్నీళ్లు పెట్టుకున్నంత పని చేశాడు. సూర్య సన్ అఫ్ కృష్ణన్ రీ రిలీజ్ టైంలో థియేటర్లలో మీరు చేసిన సందడి చూసి కళ్ళు చెమర్చాయని, ఇంతగా ఇష్టపడే నేను తెలుగువాడిని కాదని చాలా మందికి తెలియకపోవడం గురించి సోషల్ మీడియా మీమ్ ని ఉదాహరణగా చెప్పి తన ప్రసంగం ద్వారా ఆకట్టుకున్నాడు.
ఇంకో ఇరవై రోజుల్లో రిలీజవుతున్న కంగువ మీద మంచి బజ్ ఉంది. సూర్య కెరీర్ లోనే కాదు కోలీవుడ్ లోనే అత్యధిక బడ్జెట్ పెట్టిన అతి కొద్ది సినిమాల్లో కంగువ ఉంటుందని నిర్మాత నమ్మకంగా చెబుతున్నాడు. అంతే కాదు ఈ కంటెంట్ కి రెండు వేల కోట్లు వసూళ్లు వచ్చినా ఆశ్చర్యం లేదని పలు సందర్భాల్లో ప్రకటించడం అంచనాలు మరింత పెంచుతోంది. అడవి జాతుల మధ్య జరిగే అంతర్యుద్ధాన్ని బ్యాక్ డ్రాప్ గా తీసుకున్న దర్శకుడు సిరుతై శివ వందల సంవత్సరాల క్రితం వెనక్కు తీసుకెళ్లబోతున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, బాబీ డియోల్ విలనీ, దిశా పటాని గ్లామర్ ఇలా ఎన్నో ఆకర్షణలు కంగువ నిండా ఉన్నాయి.
This post was last modified on %s = human-readable time difference 10:26 am
తెలుగు ఎంట్రీని సీతారామం రూపంలో ఘనంగా జరుపుకున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కి ఆ తర్వాత హాయ్ నాన్న కూడా…
మాజీ మంత్రి కేటీఆర్, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతలపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో…
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్, ఏపీపీసీసీ అధ్యక్షురాలు మధ్య ఆస్తి వివాదం తారస్థాయికి చేరిన సంగతి తెలిసిందే. సొంత…
టీడీపీ ఎమ్మెల్యేలు ఎంత చెబుతున్నా.. వినిపించుకోవడం లేదన్న ఆవేదన సీఎం చంద్రబాబులో కనిపి స్తోంది. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రెండు కీలక…
గత మూడు సీజన్లలో అన్ స్టాపబుల్ షో కోసం రామ్ చరణ్ వస్తాడేమోనని ఫ్యాన్స్ తెగ ఎదురు చూశారు కానీ…
కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల.. తాజాగా సంచలన లేఖ ఒకటి మీడియాకు విడుదల చేశారు. దీనిలో ప్రధానంగా ఆమె…