నవంబర్ 14 విడుదల కాబోతున్న కంగువ ప్రమోషన్లలో భాగంగా హీరో సూర్య నిన్నబాలకృష్ణ అన్ స్టాపబుల్ సీజన్ 4 షోలో పాల్గొన్నాడు. ఆ తర్వాత ఎఎంబిలో జరిగిన ట్రైలర్ లాంచ్ లో అభిమానులను ప్రత్యక్షంగా కలుసుకున్నాడు. తనకు ఇక్కడ ఫాలోయింగ్ కొత్త కాకపోయినా గత కొన్నేళ్లుగా సరైన హిట్ లేని నేపథ్యంలో ఎక్కువ రద్దీ ఉండకపోవచ్చని నిర్వాహకులు భావించారు. కానీ ఆ అంచనాలను తలకిందలు చేస్తూ ఒక్కసారిగా ఫ్యాన్స్ వందల సంఖ్యలో రావడంతో ప్రాంగణం కిక్కిరిసిపోయింది. ఉన్న సెక్యూరిటీ దీన్ని నియంత్రించలేక ఒక దశలో చేతులు ఎత్తేయాల్సిన పరిస్థితి వచ్చినా ఎలాగోలా కంట్రోల్ చేశారు.
నిజానికి ఇంత ప్రేమ సూర్య ఊహించాడో లేదో కానీ ఒక్కసారి ప్రేమించడం మొదలుపెడితే టాలీవుడ్ ఫ్యాన్స్ జీవితాంతం హీరోలను తమ గుండెల్లో పెట్టుకుంటారని చెప్పడానికి ఇంత కన్నా ఉదాహరణ అక్కర్లేదు. అందుకే సూర్య ఎమోషనల్ కాకుండా ఉండలేకపోయాడు. కన్నీళ్లు పెట్టుకున్నంత పని చేశాడు. సూర్య సన్ అఫ్ కృష్ణన్ రీ రిలీజ్ టైంలో థియేటర్లలో మీరు చేసిన సందడి చూసి కళ్ళు చెమర్చాయని, ఇంతగా ఇష్టపడే నేను తెలుగువాడిని కాదని చాలా మందికి తెలియకపోవడం గురించి సోషల్ మీడియా మీమ్ ని ఉదాహరణగా చెప్పి తన ప్రసంగం ద్వారా ఆకట్టుకున్నాడు.
ఇంకో ఇరవై రోజుల్లో రిలీజవుతున్న కంగువ మీద మంచి బజ్ ఉంది. సూర్య కెరీర్ లోనే కాదు కోలీవుడ్ లోనే అత్యధిక బడ్జెట్ పెట్టిన అతి కొద్ది సినిమాల్లో కంగువ ఉంటుందని నిర్మాత నమ్మకంగా చెబుతున్నాడు. అంతే కాదు ఈ కంటెంట్ కి రెండు వేల కోట్లు వసూళ్లు వచ్చినా ఆశ్చర్యం లేదని పలు సందర్భాల్లో ప్రకటించడం అంచనాలు మరింత పెంచుతోంది. అడవి జాతుల మధ్య జరిగే అంతర్యుద్ధాన్ని బ్యాక్ డ్రాప్ గా తీసుకున్న దర్శకుడు సిరుతై శివ వందల సంవత్సరాల క్రితం వెనక్కు తీసుకెళ్లబోతున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, బాబీ డియోల్ విలనీ, దిశా పటాని గ్లామర్ ఇలా ఎన్నో ఆకర్షణలు కంగువ నిండా ఉన్నాయి.
2026లో టాలీవుడ్ బాక్సాఫీస్ మోతెక్కిపోతుందనే సంకేతాలు కనిపించాయి ఆరంభంలో. ‘మన శంకర వరప్రసాద్ గారు’తో పాటు ‘అనగనగా ఒక రాజు’,…
ఈ రోజుల్లో చిన్న, మిడ్ రేంజ్ సినిమాలకు రిలీజ్రోజు ఇచ్చిన థియేటర్లను జనంతో నింపడమే కష్టమైపోతోంది. జనం థియేటర్లకు రావడం…
ఏపీలో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనను పూర్తి చేసుకుంది. మూడో ఏడాదిలోకి అడుగులు వేసింది. ప్రభుత్వం ఏం చేయాలన్నా.. మరో…
ఇటీవల నాగ్ అశ్విన్ తో ప్రభాస్ చేసిన ప్రమోషనల్ ఇంటర్వ్యూ నెట్టింట ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలుసు. అందులో…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. పశ్చిమబెంగాల్లో శనివారం సాయంత్రం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన దేశవ్యాప్తంగా అన్నదాతలకు పీఎం-కిసాన్ నిధులను…
ఏపీ సీఎం చంద్రబాబు.. మరోసారి వైసీపీపై నిప్పులు చెరిగారు. గత ఐదేళ్ల కాలంలో గొడ్డలి పార్టీ(వైసీపీ) రాష్ట్రాన్ని ధ్వంసం చేయడం..…