టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అత్యాచార ఆరోపణల నేపథ్యంలో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. తనపై జానీ మాస్టర్ అత్యాచారం చేశారంటూ మహిళా కొరియోగ్రాఫర్ పోలీస్ కేసు పెట్టడంతో ఆయన అరెస్టు అయ్యారు. బాధిత యువతి ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం జానీ మాస్టర్ పై పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే ఆయనకు వచ్చిన బెస్ట్ కొరియోగ్రాఫర్ నేషనల్ అవార్డు కూడా వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. అయితే, అప్పటినుంచి జానీ మాస్టర్ బెయిల్ కోసం ప్రయత్నిస్తుండగా ఆయనకు కోర్టు నుంచి నిరాశ ఎదురవుతూ వస్తుంది.
ఈ నేపథ్యంలోనే తాజాగా జానీ మాస్టర్ కు రంగారెడ్డి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీనితో చంచల్గూడ జైల్లో రిమాండ్ లో ఉన్న జానీ మాస్టర్ ఈరోజు బెయిలుపై విడుదల కాబోతున్నారు.
కాగా, తనను బెదిరించి పలుమార్లు అత్యాచారం చేశారంటూ మధ్యప్రదేశ్ కు చెందిన ఓ మహిళా కొరియోగ్రాఫర్ సెప్టెంబర్ 15న జానీ మాస్టర్ పై నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అవకాశాల కోసం జానీ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా పనిచేసిన సమయంలో తనపై ఆయన లైంగిక వేధింపులకు దిగారని ఆరోపించింది. బాధిత యువతి మైనర్ గా ఉన్నప్పటి నుంచే లైంగిక దాడి జరుగుతున్న నేపథ్యంలో జానీ మాస్టర్ పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. 2024 ఎన్నికలకు ముందు జనసేన ఎన్నికల ప్రచారంలో జానీ మాస్టర్ కీలకంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే.
This post was last modified on October 24, 2024 2:15 pm
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…
గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…
కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…