ప్రభాస్ పుట్టిన రోజు వస్తోంది.. ఈసారి అప్డేట్స్తో మోత మోగిపోతుంది అంటూ తెగ హడావుడి జరిగింది సోషల్ మీడియాలో. ఓవైపు ప్రభాస్ పాత సినిమాల రీ రిలీజ్ల సందడి.. మరోవైపు కొత్త చిత్రాల కబుర్లతో అక్టోబరు 23న రెబల్ ఫ్యాన్స్ హంగామా మామూలుగా ఉండదంటూ కొన్ని రోజుల ముందు హంగామా నడిచింది. ప్రభాస్ నటిస్తున్న అన్ని సినిమాల నుంచి అప్డేట్స్ ఇవ్వడమే కాదు.. కొత్త ప్రాజెక్టులను కూడా ప్రకటిస్తారని వార్తలు వచ్చాయి. కానీ తీరా చూస్తే అభిమానులు కోరుకున్న అప్డేట్స్ ఏవీ రాలేదు.
‘రాజా సాబ్’ నుంచి మోషన్ పోస్టర్తో సరిపెట్టారు. నిజానికి అభిమానులు ఆశించింది ‘రాజా సాబ్’ టీజర్. టీం కూడా టీజర్ ట్రీట్ ఇవ్వబోతున్నట్లే సంకేతాలు ఇచ్చింది. తీరా చూస్తే మోషన్ పోస్టర్ మాత్రమే వదిలారు. అందులో ప్రభాస్ లుక్ ఆసక్తికరంగానే ఉంది కానీ.. ఇప్పటికే గ్లింప్స్ వదిలిన నేపథ్యంలో ఈసారి టీజర్ రిలీజ్ చేసి ఉంటే బాగుండేదనే ఫీలింగ్ కలిగింది.
ఇక ‘ఫౌజీ’ (వర్కింగ్ టైటిల్) సినిమా నుంచి ఏదైనా పోస్టర్ వస్తుందని ఆశించారు ఫ్యాన్స్. టైటిల్ కూడా అనౌన్స్ చేస్తారనుకున్నారు. కానీ ఈ రోజుకు ‘రాజా సాబ్’ ట్రీట్తో సరిపెట్టుకోండి, మన సినిమా గురించి ఇంకోసారి అప్డేట్ ఇస్తాం అంటూ ప్రభాస్-హను టీం ఉస్సూరుమనిపించింది. ఇక ‘స్పిరిట్’ నుంచి అప్డేట్ ఆశిస్తే.. గత ఏడాది రెడ్ కలర్లో హ్యాపీ బర్త్ డే ప్రభాస్ పోస్టర్ డిజైన్ చేసిన సందీప్ రెడ్డి ఈసారి వైట్ కలర్ బ్యాక్డ్రాప్లో అదే పోస్టర్ను మార్చి వదిలాడంటూ సోషల్ మీడియాలో కౌంటర్లు పడుతున్నాయి.
ప్రభాస్ నుంచి ‘సలార్-2’; ‘కల్కి-2’ సినిమాలు రావాల్సి ఉన్న నేపథ్యంలో వాటి నుంచి ఏమైనా అప్డేట్స్ ఉంటాయేమో అని ఆశిస్తే.. అటు నుంచి సౌండే లేదు. ఇక ప్రభాస్ నుంచి సర్ప్రైజ్ ప్రాజెక్టు గురించి అనౌన్స్మెంట్ ఉంటుందని జరిగిన ప్రచారమంతా ఉత్తిదే అని తేలిపోయింది. మొత్తంగా రెబల్ ఫ్యాన్స్ను ఈ బర్త్ డే చాల ా డిజప్పాయింట్ చేసిందనే చెప్పాలి. మరోవైపు ప్రభాస్ పాత సినిమాల రీ రిలీజ్ సందడి కూడా అనుకున్నంతగా లేకపోయింది.
కొందరు స్టార్ హీరోయిన్లు కెరీర్ మంచి ఊపులో కొనసాగుతున్న టైంలోనే వ్యక్తిగత జీవితంలో సెటిల్ అవ్వాలని చూస్తుంటారు. ఈ క్రమంలో…
మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…
పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్తో పాటు కనిపిస్తున్నది…
సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…
ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…