అదేంటి ప్రభాస్ సినిమాకు సూర్య మూవీకి సంబంధం ఏమనుకుంటున్నారా. అక్కడే ఉంది అసలు మ్యాటర్. నవంబర్ 14 విడుదల కాబోతున్న కంగువ కోసం సూర్య ప్రమోషన్ టూర్ మొదలుపెట్టేశాడు. ముంబై నుంచి మొదలుపెట్టి ఉత్తరాది నగరాల్లో విస్తృతంగా తిరుగుతూ మీడియా, అభిమానులను కలుసుకుంటూ ఎడతెరిపి లేకుండా కెమెరా ముందుకు వస్తూనే ఉన్నాడు. దర్శకుడు సిరుతై శివ, హీరోయిన్ దిశా పటాని, విలన్ బాబీ డియోల్, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ లతో కలిసి తన సినిమాలో ఏమేం ఉన్నాయో, ఏ స్థాయిలో అలరిస్తాయో పూసగుచ్చినట్టు వివరించి చెబుతున్నాడు.
ఇక అసలు విషయానికి వస్తే కంగువని కోలీవుడ్ బాహుబలిగా తమిళనాడు బయ్యర్లు, సినీ లవర్స్ అభివర్ణించుకుంటున్నారు. ఆ స్థాయిలో ఇది కూడా రికార్డులు బద్దలు కొట్టి ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెస్తుందని బోలెడు ఆశలు పెట్టుకున్నారు. దర్శకుడు శివ ఇప్పటిదాకా హ్యాండిల్ చేసినవన్నీ కమర్షియల్ సబ్జెక్టులే. చివరి చిత్రం రజనీకాంత్ పెద్దన్న దారుణంగా ఫ్లాప్ అయ్యింది. అయినా కథ మీద నమ్మకంతో జ్ఞానవేల్ రాజా వందల కోట్లు కుమ్మరించారు. ఆయన కాన్ఫిడెన్స్ ఏ స్థాయిలో ఉందంటే కంగువ 2తో పోటీ పడేందుకు భయపడే స్థాయిలో మొదటి భాగం ఉర్రూతలూగిస్తుందని అంటున్నారు.
ఇదంతా బాగానే ఉంది కానీ బాహుబలి పోలికతోనే వస్తుంది అసలు చిక్కు. గతంలో విజయ్ కూడా ఇలాగే అలోచించి పులిలో నటించాడు. శ్రీదేవి, కిచ్చ సుదీప్ లాంటి భారీ క్యాస్టింగ్ తో విఎఫెక్స్ కు ప్రాధాన్యం ఇస్తూ తెరకెక్కించారు. కట్ చేస్తే బొమ్మ దారుణంగా ఫెయిలయ్యింది. బాహుబలిని స్ఫూర్తిగా తీసుకుని సుందర్ సి కొన్నేళ్ల క్రితం సంఘమిత్ర అనే మల్టీస్టారర్ ప్రకటించారు. సెట్స్ పైకి వెళ్లకుండానే ఆగిపోయింది. ఇప్పుడు కంగువ ఈ నెగటివ్ సెంటిమెంట్స్ ని బ్రేక్ చేయాలి. కాకతాళీయంగా కంగువ, పులి రెండు సినిమాలకూ సంగీతం సమకూర్చింది దేవిశ్రీ ప్రసాదే కావడం గమనించాల్సిన విషయం.
This post was last modified on October 23, 2024 6:06 pm
టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబును తెలంగాణ మంత్రి, కాంగ్రెస్ పార్టీ నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు కలుసుకున్నారు. సోమవారం అమరావతికి…
ప్రేమికుల రోజు సందర్భంగా రీ రిలీజ్ చేసిన లవ్ స్టోరీకి ప్రేక్షకుల నుంచి పెద్దగా రెస్పాన్స్ లేకపోవడం ఆశ్చర్యపరిచే విషయమే.…
70 ఏళ్ల వయసులోనూ ఎంతో హుషారుగా సినిమాలు చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. ముఖ్యంగా ఇటీవల మన శంకర…
తన పాటల కాపీ రైట్స్ విషయంలో నిర్మాతల దగ్గర ముక్కుపిండి మరీ కోర్టుల ద్వారా రాయల్టీ పొందుతున్న ఇళయరాజాకు ఢిల్లీ…
ఏపీ సీఎం చంద్రబాబుతో కలిసి పనిచేయడం తనకు కొత్తకాదని మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ వ్యాఖ్యానించారు. చంద్రబాబు తనకు…
పరిశ్రమలో జరిగే కొన్ని సంఘటనలు విచిత్రంగా ఉంటాయి. అలాంటిదే ఇది కూడా. ఇటీవలే విడుదలైన సీత పయనంకు ఆశించిన స్పందన…