Movie News

బాహుబలి బరువు మోస్తున్న కంగువ

అదేంటి ప్రభాస్ సినిమాకు సూర్య మూవీకి సంబంధం ఏమనుకుంటున్నారా. అక్కడే ఉంది అసలు మ్యాటర్. నవంబర్ 14 విడుదల కాబోతున్న కంగువ కోసం సూర్య ప్రమోషన్ టూర్ మొదలుపెట్టేశాడు. ముంబై నుంచి మొదలుపెట్టి ఉత్తరాది నగరాల్లో విస్తృతంగా తిరుగుతూ మీడియా, అభిమానులను కలుసుకుంటూ ఎడతెరిపి లేకుండా కెమెరా ముందుకు వస్తూనే ఉన్నాడు. దర్శకుడు సిరుతై శివ, హీరోయిన్ దిశా పటాని, విలన్ బాబీ డియోల్, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ లతో కలిసి తన సినిమాలో ఏమేం ఉన్నాయో, ఏ స్థాయిలో అలరిస్తాయో పూసగుచ్చినట్టు వివరించి చెబుతున్నాడు.

ఇక అసలు విషయానికి వస్తే కంగువని కోలీవుడ్ బాహుబలిగా తమిళనాడు బయ్యర్లు, సినీ లవర్స్ అభివర్ణించుకుంటున్నారు. ఆ స్థాయిలో ఇది కూడా రికార్డులు బద్దలు కొట్టి ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెస్తుందని బోలెడు ఆశలు పెట్టుకున్నారు. దర్శకుడు శివ ఇప్పటిదాకా హ్యాండిల్ చేసినవన్నీ కమర్షియల్ సబ్జెక్టులే. చివరి చిత్రం రజనీకాంత్ పెద్దన్న దారుణంగా ఫ్లాప్ అయ్యింది. అయినా కథ మీద నమ్మకంతో జ్ఞానవేల్ రాజా వందల కోట్లు కుమ్మరించారు. ఆయన కాన్ఫిడెన్స్ ఏ స్థాయిలో ఉందంటే కంగువ 2తో పోటీ పడేందుకు భయపడే స్థాయిలో మొదటి భాగం ఉర్రూతలూగిస్తుందని అంటున్నారు.

ఇదంతా బాగానే ఉంది కానీ బాహుబలి పోలికతోనే వస్తుంది అసలు చిక్కు. గతంలో విజయ్ కూడా ఇలాగే అలోచించి పులిలో నటించాడు. శ్రీదేవి, కిచ్చ సుదీప్ లాంటి భారీ క్యాస్టింగ్ తో విఎఫెక్స్ కు ప్రాధాన్యం ఇస్తూ తెరకెక్కించారు. కట్ చేస్తే బొమ్మ దారుణంగా ఫెయిలయ్యింది. బాహుబలిని స్ఫూర్తిగా తీసుకుని సుందర్ సి కొన్నేళ్ల క్రితం సంఘమిత్ర అనే మల్టీస్టారర్ ప్రకటించారు. సెట్స్ పైకి వెళ్లకుండానే ఆగిపోయింది. ఇప్పుడు కంగువ ఈ నెగటివ్ సెంటిమెంట్స్ ని బ్రేక్ చేయాలి. కాకతాళీయంగా కంగువ, పులి రెండు సినిమాలకూ సంగీతం సమకూర్చింది దేవిశ్రీ ప్రసాదే కావడం గమనించాల్సిన విషయం.

This post was last modified on October 23, 2024 6:06 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

45 minutes ago

‘నీట్’ గా పేపర్ అమ్మేశారట!

నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…

48 minutes ago

భగీరథ్ కేసు వాదించేది వైసీపీ ఎంపీనే

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…

2 hours ago

కేరళం ‘సీల్డ్ కవర్’ తెరచుకునేదెన్నడో..?

దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…

2 hours ago

ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్న మోదీ వ్యాఖ్యలు

యావత్తు ప్రపంచాన్ని కరోనా చుట్టుముట్టిన తరుణంలో లాక్ డౌన్ అంటే ఏమిటో… ఎలా ఉంటుందో చూశాం. ఇప్పుడు కరోనా లాంటి…

5 hours ago

ఒక్క ఓటుతో గెలిస్తే ఓటేయొద్దా…?

తమిళ రాజకీయాల్లో వరుసబెట్టి ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తమిళనాడు అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడిన దగ్గర నుంచి రోజుకో…

6 hours ago