అదేంటి ప్రభాస్ సినిమాకు సూర్య మూవీకి సంబంధం ఏమనుకుంటున్నారా. అక్కడే ఉంది అసలు మ్యాటర్. నవంబర్ 14 విడుదల కాబోతున్న కంగువ కోసం సూర్య ప్రమోషన్ టూర్ మొదలుపెట్టేశాడు. ముంబై నుంచి మొదలుపెట్టి ఉత్తరాది నగరాల్లో విస్తృతంగా తిరుగుతూ మీడియా, అభిమానులను కలుసుకుంటూ ఎడతెరిపి లేకుండా కెమెరా ముందుకు వస్తూనే ఉన్నాడు. దర్శకుడు సిరుతై శివ, హీరోయిన్ దిశా పటాని, విలన్ బాబీ డియోల్, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ లతో కలిసి తన సినిమాలో ఏమేం ఉన్నాయో, ఏ స్థాయిలో అలరిస్తాయో పూసగుచ్చినట్టు వివరించి చెబుతున్నాడు.
ఇక అసలు విషయానికి వస్తే కంగువని కోలీవుడ్ బాహుబలిగా తమిళనాడు బయ్యర్లు, సినీ లవర్స్ అభివర్ణించుకుంటున్నారు. ఆ స్థాయిలో ఇది కూడా రికార్డులు బద్దలు కొట్టి ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెస్తుందని బోలెడు ఆశలు పెట్టుకున్నారు. దర్శకుడు శివ ఇప్పటిదాకా హ్యాండిల్ చేసినవన్నీ కమర్షియల్ సబ్జెక్టులే. చివరి చిత్రం రజనీకాంత్ పెద్దన్న దారుణంగా ఫ్లాప్ అయ్యింది. అయినా కథ మీద నమ్మకంతో జ్ఞానవేల్ రాజా వందల కోట్లు కుమ్మరించారు. ఆయన కాన్ఫిడెన్స్ ఏ స్థాయిలో ఉందంటే కంగువ 2తో పోటీ పడేందుకు భయపడే స్థాయిలో మొదటి భాగం ఉర్రూతలూగిస్తుందని అంటున్నారు.
ఇదంతా బాగానే ఉంది కానీ బాహుబలి పోలికతోనే వస్తుంది అసలు చిక్కు. గతంలో విజయ్ కూడా ఇలాగే అలోచించి పులిలో నటించాడు. శ్రీదేవి, కిచ్చ సుదీప్ లాంటి భారీ క్యాస్టింగ్ తో విఎఫెక్స్ కు ప్రాధాన్యం ఇస్తూ తెరకెక్కించారు. కట్ చేస్తే బొమ్మ దారుణంగా ఫెయిలయ్యింది. బాహుబలిని స్ఫూర్తిగా తీసుకుని సుందర్ సి కొన్నేళ్ల క్రితం సంఘమిత్ర అనే మల్టీస్టారర్ ప్రకటించారు. సెట్స్ పైకి వెళ్లకుండానే ఆగిపోయింది. ఇప్పుడు కంగువ ఈ నెగటివ్ సెంటిమెంట్స్ ని బ్రేక్ చేయాలి. కాకతాళీయంగా కంగువ, పులి రెండు సినిమాలకూ సంగీతం సమకూర్చింది దేవిశ్రీ ప్రసాదే కావడం గమనించాల్సిన విషయం.
This post was last modified on October 23, 2024 6:06 pm
పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…