అదేంటి ప్రభాస్ సినిమాకు సూర్య మూవీకి సంబంధం ఏమనుకుంటున్నారా. అక్కడే ఉంది అసలు మ్యాటర్. నవంబర్ 14 విడుదల కాబోతున్న కంగువ కోసం సూర్య ప్రమోషన్ టూర్ మొదలుపెట్టేశాడు. ముంబై నుంచి మొదలుపెట్టి ఉత్తరాది నగరాల్లో విస్తృతంగా తిరుగుతూ మీడియా, అభిమానులను కలుసుకుంటూ ఎడతెరిపి లేకుండా కెమెరా ముందుకు వస్తూనే ఉన్నాడు. దర్శకుడు సిరుతై శివ, హీరోయిన్ దిశా పటాని, విలన్ బాబీ డియోల్, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ లతో కలిసి తన సినిమాలో ఏమేం ఉన్నాయో, ఏ స్థాయిలో అలరిస్తాయో పూసగుచ్చినట్టు వివరించి చెబుతున్నాడు.
ఇక అసలు విషయానికి వస్తే కంగువని కోలీవుడ్ బాహుబలిగా తమిళనాడు బయ్యర్లు, సినీ లవర్స్ అభివర్ణించుకుంటున్నారు. ఆ స్థాయిలో ఇది కూడా రికార్డులు బద్దలు కొట్టి ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెస్తుందని బోలెడు ఆశలు పెట్టుకున్నారు. దర్శకుడు శివ ఇప్పటిదాకా హ్యాండిల్ చేసినవన్నీ కమర్షియల్ సబ్జెక్టులే. చివరి చిత్రం రజనీకాంత్ పెద్దన్న దారుణంగా ఫ్లాప్ అయ్యింది. అయినా కథ మీద నమ్మకంతో జ్ఞానవేల్ రాజా వందల కోట్లు కుమ్మరించారు. ఆయన కాన్ఫిడెన్స్ ఏ స్థాయిలో ఉందంటే కంగువ 2తో పోటీ పడేందుకు భయపడే స్థాయిలో మొదటి భాగం ఉర్రూతలూగిస్తుందని అంటున్నారు.
ఇదంతా బాగానే ఉంది కానీ బాహుబలి పోలికతోనే వస్తుంది అసలు చిక్కు. గతంలో విజయ్ కూడా ఇలాగే అలోచించి పులిలో నటించాడు. శ్రీదేవి, కిచ్చ సుదీప్ లాంటి భారీ క్యాస్టింగ్ తో విఎఫెక్స్ కు ప్రాధాన్యం ఇస్తూ తెరకెక్కించారు. కట్ చేస్తే బొమ్మ దారుణంగా ఫెయిలయ్యింది. బాహుబలిని స్ఫూర్తిగా తీసుకుని సుందర్ సి కొన్నేళ్ల క్రితం సంఘమిత్ర అనే మల్టీస్టారర్ ప్రకటించారు. సెట్స్ పైకి వెళ్లకుండానే ఆగిపోయింది. ఇప్పుడు కంగువ ఈ నెగటివ్ సెంటిమెంట్స్ ని బ్రేక్ చేయాలి. కాకతాళీయంగా కంగువ, పులి రెండు సినిమాలకూ సంగీతం సమకూర్చింది దేవిశ్రీ ప్రసాదే కావడం గమనించాల్సిన విషయం.
This post was last modified on October 23, 2024 6:06 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…