ఎక్కడ చూసినా పుష్ప 2 ది రూల్ కు సంబంధించిన వార్తలతో సినీ వ్యాపార వర్గాలు హోరెత్తిపోతున్నాయి. ఇంకా సరైన రీతిలో ప్రమోషన్ మొదలుకాకపోయినా అభిమానులు అంతకన్నా హై ఫీలవుతున్నారు. సుమారు 1100 కోట్ల దాకా థియేటర్, నాన్ థియేటర్ రెవిన్యూ చేయబోతోందన్న టాక్ వాళ్ళను కుదురుగా ఉండనివ్వడం లేదు. కేరళలో ఎన్నడూ లేనిది ఒక పరభాషా చిత్రం ఏకంగా 50 కోట్లు పలకడం గురించి మల్లువుడ్ వర్గాలు తీవ్రంగా చర్చించుకుంటున్నాయి. ఏరియాల వారీగా ఏకంగా రాజమౌళి నెంబర్లనే సవాల్ చేసే రీతిలో పుష్ప 2 కోసం డబ్బులు కుమ్మరించేందుకు డిస్ట్రిబ్యూటర్లు రెడీ అవుతున్నారు.
మా సైట్ కొద్దిరోజుల క్రితం అక్టోబర్ 10న చెప్పినట్టే పుష్ప 2 ఒకరోజు ముందు అంటే డిసెంబర్ 5నే రిలీజ్ కానుంది. దీనికి సంబంధించిన అఫీషియల్ ప్రెస్ మీట్ రేపు జరగబోతోంది. ఇది కాకుండా వేరే షాకింగ్ న్యూస్ పెద్దగా ఉండకపోవచ్చు. ఇదిలా ఉండగా డిసెంబర్ 6ని లాక్ చేసుకున్న బాలీవుడ్ భారీ ప్యాన్ ఇండియా మూవీ చావా ఇప్పుడు పుష్పకు వస్తున్న క్రేజ్ చూసి చెమటలు తెచ్చుకుంటోందని నార్త్ బయ్యర్ల మాట. విక్కీ కౌశల్, రష్మిక మందన్న జంటగా నటించిన ఈ పీరియాడిక్ డ్రామా ప్రసిద్ధ మరాఠా వీరుడు, రాజు ఛత్రపతి శంభాజీ కథ ఆధారంగా భారీ బడ్జెట్ తో రూపొందుతోంది.
కొన్ని ఉత్తరాది రాష్ట్రాల్లో చావాకు క్రేజ్ ఉన్నప్పటికీ పుష్ప 2 లాంటి కమర్షియల్ గ్రాండియర్ ని తట్టుకోగలమా అనే మీమాంసలో నిర్మాతలు ఉన్నట్టు సమాచారం. పోస్ట్ పోన్ గురించి ఇంకా చెప్పలేదు కానీ ఒకవేళ జరిగినా ఆశ్చర్యం లేదని అక్కడి వర్గాలు అంటున్నాయి. నిజానికి ఆగస్ట్ లోనే పుష్ప 2 వస్తుందని చెప్పినప్పుడు అదే డేట్ కి రావాలనుకున్న సింగం అగైన్ మరో ఆలోచన లేకుండా వాయిదా వేసుకుంది. ఇప్పుడు చావాకు అదే పరిస్థితి వచ్చినా ఆశ్చర్యం లేదు. పెద్ద ఎత్తున బిజినెస్ జరిగింది కనక సోలో రిలీజ్ అయితే రికవరీ వేగంగా ఉంటుందని డిస్ట్రిబ్యూటర్లు భావిస్తున్నారు. చూడాలి మరి.
సెలబ్రెటీల కుటుంబాల్లో కొందరిలో ఎంతో ప్రతిభ ఉన్నప్పటికీ.. అది ఎప్పుడో కానీ బయటికి రాదు. ఎప్పుడూ మామూలుగా కనిపించే వ్యక్తులు..…
రిలీజైన రోజు నుంచి వీకెండ్ దాకా చెడుగుడు ఆడేసిన లెనిన్ ఎట్టకేలకు అఖిల్ కెరీర్ లో ఒక హిట్టుని చేర్చేసింది.…
టాలీవుడ్ అగ్రశ్రేణి డ్యాన్స్ మాస్టర్లు ఇద్దరి మధ్య వివాదం రాజుకుంది. జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ మధ్య ఘర్షణ చోటు…
టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…
మలయాళ హీరో అయినప్పటికీ సలార్ నుంచి పృథ్విరాజ్ సుకుమారన్ కు మన దగ్గర కూడా ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ నమ్మకంతోనే…
ఘట్టమనేని మూడో తరం నుంచి మొదటి వారసుడు జయకృష్ణ తొలి సినిమా శ్రీనివాస మంగాపురం జూలై 30 విడుదలకు రెడీ…