ఎక్కడ చూసినా పుష్ప 2 ది రూల్ కు సంబంధించిన వార్తలతో సినీ వ్యాపార వర్గాలు హోరెత్తిపోతున్నాయి. ఇంకా సరైన రీతిలో ప్రమోషన్ మొదలుకాకపోయినా అభిమానులు అంతకన్నా హై ఫీలవుతున్నారు. సుమారు 1100 కోట్ల దాకా థియేటర్, నాన్ థియేటర్ రెవిన్యూ చేయబోతోందన్న టాక్ వాళ్ళను కుదురుగా ఉండనివ్వడం లేదు. కేరళలో ఎన్నడూ లేనిది ఒక పరభాషా చిత్రం ఏకంగా 50 కోట్లు పలకడం గురించి మల్లువుడ్ వర్గాలు తీవ్రంగా చర్చించుకుంటున్నాయి. ఏరియాల వారీగా ఏకంగా రాజమౌళి నెంబర్లనే సవాల్ చేసే రీతిలో పుష్ప 2 కోసం డబ్బులు కుమ్మరించేందుకు డిస్ట్రిబ్యూటర్లు రెడీ అవుతున్నారు.
మా సైట్ కొద్దిరోజుల క్రితం అక్టోబర్ 10న చెప్పినట్టే పుష్ప 2 ఒకరోజు ముందు అంటే డిసెంబర్ 5నే రిలీజ్ కానుంది. దీనికి సంబంధించిన అఫీషియల్ ప్రెస్ మీట్ రేపు జరగబోతోంది. ఇది కాకుండా వేరే షాకింగ్ న్యూస్ పెద్దగా ఉండకపోవచ్చు. ఇదిలా ఉండగా డిసెంబర్ 6ని లాక్ చేసుకున్న బాలీవుడ్ భారీ ప్యాన్ ఇండియా మూవీ చావా ఇప్పుడు పుష్పకు వస్తున్న క్రేజ్ చూసి చెమటలు తెచ్చుకుంటోందని నార్త్ బయ్యర్ల మాట. విక్కీ కౌశల్, రష్మిక మందన్న జంటగా నటించిన ఈ పీరియాడిక్ డ్రామా ప్రసిద్ధ మరాఠా వీరుడు, రాజు ఛత్రపతి శంభాజీ కథ ఆధారంగా భారీ బడ్జెట్ తో రూపొందుతోంది.
కొన్ని ఉత్తరాది రాష్ట్రాల్లో చావాకు క్రేజ్ ఉన్నప్పటికీ పుష్ప 2 లాంటి కమర్షియల్ గ్రాండియర్ ని తట్టుకోగలమా అనే మీమాంసలో నిర్మాతలు ఉన్నట్టు సమాచారం. పోస్ట్ పోన్ గురించి ఇంకా చెప్పలేదు కానీ ఒకవేళ జరిగినా ఆశ్చర్యం లేదని అక్కడి వర్గాలు అంటున్నాయి. నిజానికి ఆగస్ట్ లోనే పుష్ప 2 వస్తుందని చెప్పినప్పుడు అదే డేట్ కి రావాలనుకున్న సింగం అగైన్ మరో ఆలోచన లేకుండా వాయిదా వేసుకుంది. ఇప్పుడు చావాకు అదే పరిస్థితి వచ్చినా ఆశ్చర్యం లేదు. పెద్ద ఎత్తున బిజినెస్ జరిగింది కనక సోలో రిలీజ్ అయితే రికవరీ వేగంగా ఉంటుందని డిస్ట్రిబ్యూటర్లు భావిస్తున్నారు. చూడాలి మరి.
This post was last modified on October 23, 2024 5:41 pm
వచ్చే ఎన్నికల్లోనూ కూటమి విజయం సాధిస్తుందన్న బలమైన సంకేతాలు వస్తున్నాయి. నాయకులు చెప్పడమే కాదు.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న కొన్ని ఆన్లైన్…
ఒకపక్క ఇరుముడి విరగాడేస్తోంది. వీకెండ్ టికెట్లు దొరక్క అల్లాడిపోతున్న ప్రేక్షకులు లక్షల్లో ఉన్నారు. ఇచ్చిన థియేటర్లు సరిపోక వేరే సినిమాలవి…
నిన్న హైదరాబాద్ లో జరిగిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సౌండ్ బార్ల మీద కూర్చున్న…
సోషల్ మీడియా రాను రాను మరీ సెన్సిటివ్ గా, టాక్సిక్ గా మారిపోతోంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ…
రాయ్ పూర్ లోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షా పేపర్ లీకేజి వ్యవహారం ఇప్పుడు…
పార్టీలు బలంగా ఉండాలంటే.. సమాజంలోని పలు వర్గాల మద్దతు అవసరం. నాయకులు, అధినేతలు ఎంత బలంగా ఉన్నా.. సమాజంలోని వర్గాలు…