ప్రభాస్ గురించి ఎంత చెప్పినా తక్కువే. సంపధలోనే కాదు, మంచితనంలోను మహారాజే. బాహుబలి సినిమా కంటే ముందే అతని భవిష్యత్తుని చాలామంది ఊహించారు. ఆ కటౌట్ కు ఏదో ఒక రోజు ఇండియా మొత్తం థ్రిల్ అవుతుందని అన్నారు. అయితే ఇండస్ట్రీలోకి రాక మునుపు ప్రభాస్ కు కూడా అప్పుడప్పుడు కొన్ని నెగిటివ్ కామెంట్స్ కూడా ఎదురయ్యాయి. అతనితో క్లోజ్ గా ఉండేవాళ్ళు కొందరు ప్రభాస్ బద్ధకాన్ని చూసి ఎలా బ్రతుకుతాడో ఏంటో అనేవారు.
కానీ వర్క్ విషయంలోకి వచ్చేసరికి గొడ్డులా పని చేస్తాడని రాజమౌళి సైతం బాహుబలి టైమ్ లో క్లారిటీ ఇచ్చాడు. నేడు ప్రభాస్ పుట్టినరోజు కావడంతో అతనికి సంబంధించిన అనేక రకాల విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఒక సందర్భంలో ప్రభాస్ తన స్నేహితుడు చేసిన కామెంట్స్ గురించి కూడా నవ్వుతూ చెప్పాడు. “ఓ రోజు హీరో అవుతానని చెప్పినప్పుడు నా స్నేహితుడు ‘నువ్వు హీరో ఏంట్రా బాబూ’ అంటూ నవ్వాడు. కుటుంబ సభ్యులు కూడా మొదట షాక్ అయ్యారు కానీ, చివరకు నటనలో శిక్షణ కోసం సత్యానంద్ గారి దగ్గరకు పంపించారు” అని అన్నారు.
మూడు నెలల ట్రైనింగ్ తర్వాత, ఫైట్స్, డ్యాన్స్లలో శిక్షణ తీసుకోవాలని భావించినా సాధ్యపడలేదు. ఇక ఒకరోజు నిర్మాత అశోక్ కుమార్, హీరోగా పరిచయం చేయాలని నిర్ణయించి, ప్రభాస్ తండ్రి సూర్యనారాయణ రాజు, పెద్దనాన్న కృష్ణం రాజు గారిని కలిశారు. కథ నచ్చడంతో వారు అంగీకరించారు, కానీ ప్రభాస్ కొంత టెన్షన్గా ఫీల్ అయ్యాడు. “ఇది మంచి అవకాశం, యాక్షన్తో కూడిన లవ్ స్టోరీ చేయటం కెరీర్కు ప్లస్ అవుతుంది” అని పెద్దవాళ్లు నచ్చజెప్పారు. అలా, 2002లో నవంబరు 11న విడుదలైన ‘ఈశ్వర్’ సినిమాతో ప్రభాస్ తన టాలీవుడ్ ప్రయాణాన్ని ప్రారంభించారు.
This post was last modified on October 23, 2024 11:25 am
వైసీపీ అధినేత జగన్ మారుతాడేమో, ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరుగుతుందేమో అని కూటమి నాయకులు పలుసార్లు భావిస్తూ వచ్చారు. అందుకే…
వైసీపీ అధినేత జగన్పై సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ పాలనతో రాష్ట్రం పూర్తిగా విధ్వంసమైందని అన్నారు.…
అమరావతి రాజధానిపై వైసీపీ అధినేతగా జగన్ చేసిన తాజా వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనపై మరోసారి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజధాని విషయంలో…
వైసీపీ అధినేత జగన్ హయాంలో ఓ కుటుంబం రోడ్డున పడింది. కేవలం మాస్క్ అడిగిన పాపానికి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించి…
కోనసీమ జిల్లా వాసులు ఎంతో పవిత్రంగా, ప్రతిష్టాత్మకంగా నిర్వహించుకునే పండుగ జగ్గన్నతోట ప్రభల తీర్థం. ఇది తరతరాలుగా సంప్రదాయబద్ధంగా కొనసాగుతూ…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. వైసీపీ నేతలకు, కార్యకర్తలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పిఠాపురం నియోజకవర్గంలో పిచ్చి పిచ్చి…