వచ్చే నెల నవంబర్ 14న కంగువగా రాబోతున్న సూర్య దాని ప్రమోషన్ల కోసం నార్త్ మొత్తం చుట్టేస్తున్నాడు. తమిళనాడుతో పాటు ఏపీ తెలంగాణకు సంబంధించిన కార్యక్రమాలు చివరి పది రోజుల్లో ఉదృతం చేయబోతున్నారు. చెన్నైలో జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత హైదరాబాద్ లోనూ అంతటి ఘనమైన వేడుక చేసే ప్లాన్ లో ఉంది చిత్ర బృందం. దీనికన్నా చాలా ఆలస్యంగా మొదలైన దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు సినిమా వేగంగా షూటింగ్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. దీని తర్వాత కమెడియన్ కం డైరెక్టర్ ఆర్జె బాలాజీకు అధికారికంగా సూర్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
దీనికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన లీకులు చూద్దాం. కరుప్పు టైటిల్ పరిశీలనలో ఈ ఫాంటసీ డ్రామాలో సూర్య దేవుడి తరహా వేషం వేయబోతున్నట్టు తెలిసింది. అంటే గోపాల గోపాలలో పవన్ కళ్యాణ్ టైపు అన్నమాట. నిజానికి ఆర్జె బాలాజీ నయనతారతో మూకుతి అమ్మన్ (అమ్మోరు తల్లి) తీశాక దానికి కొనసాగింపుగా ఇంకో భాగం రాసుకున్నాడు. కానీ నిర్మాత, హీరోయిన్ తో ఏదో పొసగకపోవడంతో దాన్ని మగ పాత్రగా మార్చుకుని దేవుడిగా చేశాడట. అది సూర్యకు విపరీతంగా నచ్చడంతో తెరకెక్కుతోందని చెన్నై టాక్. గతంలో చూడని కొత్త ట్రీట్ మెంట్ ఇందులో ఉంటుందని అంటున్నారు.
స్టార్ హీరోలను డీల్ చేసిన అనుభవం లేని ఆర్జె బాలాజీకి అవకాశం ఇవ్వడం పట్ల అభిమానుల్లో అనుమానాలు ఉన్నా సూర్య మాత్రం కంటెంట్ ని బలంగా నమ్మేశాడు. దానికి తగ్గట్టే స్క్రిప్ట్ బాగా వచ్చిందట. కంగువ రిలీజైన తర్వాత కొంచెం బ్రేక్ తీసుకుని దీని రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టబోతున్నారు. ఇంకోవైపు కంగువ పార్ట్ 2కి కూడా రంగం సిద్ధం చేస్తున్నారు. వెట్రిమారన్ తో తొలుత ప్లాన్ చేసుకున్న వడివాసల్ గురించి ఎలాంటి అప్డేట్స్ లేవు. దర్శకుడు హీరో ఇద్దరూ ఏ సందర్భంలో టాపిక్ వచ్చినా త్వరలో అంటున్నారు తప్పించి మొదలుపెట్టే దిశగా చర్యలు తీసుకోవడం లేదు. సుధా కొంగర ప్రాజెక్టు కూడా సూర్య డ్రాప్ అయ్యారు.
మరో ఏడాది తర్వాత తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పాదయాత్రల సందడి మొదలుకానుంది. ఎన్నికలకు ముందు ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రధాన పార్టీలు…
థియేటర్ రన్ పూర్తి చేసుకున్న పెద్ది ఇటీవలే ఓటిటిలో వచ్చిన సంగతి తెలిసిందే. అయితే నార్త్ ఆడియన్స్ తో పాటు…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి.. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ లేఖ రాశారు. ``షాబాద్ ఘటన దారుణం`` అని…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉదార స్వభావం, దాతృత్వం గురించి జనసైనికులు, ఆయన అభిమానులు గొప్పగా…
కాపు ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు ముగిశాయి. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని ఆయన ఇంటి ప్రాంగణంలోనే…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నీటిపారుదల విధానాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. ఎల్నినో పరిస్థితుల్లోనూ నీటి సమస్య…