తలా అజిత్ హీరోగా మైత్రి మూవీ మేకర్స్ రూపొందిస్తున్న గుడ్ బ్యాడ్ అగ్లీ షూటింగ్ ప్లానింగ్ ప్రకారమే జరుగుతోంది కానీ సంక్రాంతి విడుదల విషయంలో ఏర్పడ్డ సందిగ్దత అభిమానులను అయోమయంలో పడేస్తోంది. ఎందుకంటే అజిత్ మరో సినిమా విదాముయార్చి ఇంకా రిలీజ్ కాలేదు. దసరా అన్నారు. కుదరలేదు. దీపావళి అనుకున్నారు. పనవ్వలేదు. పోనీ నవంబర్ లో చూద్దామా అంటే సూర్య కంగువ లాక్ చేసుకుని తెలివైన పని చేసింది. మిగిలింది డిసెంబర్. కానీ వరస డిజాస్టర్లతో కుదేలైన లైకా సంస్థ డిస్ట్రిబ్యూటర్ల నుంచి వస్తున్న ఒత్తిడి కారణంగా జనవరి పొంగల్ బరిలో దించాలని చూస్తోందట.
ఒకవేళ అదే జరిగితే గుడ్ బ్యాడ్ అగ్లీని వాయిదా వేయాల్సి ఉంటుంది. మైత్రి నిర్మాతలు ప్రస్తుతం అజిత్ మాట కోసం ఎదురు చూస్తున్నారని చెన్నై టాక్. సంక్రాంతి లాంటి మంచి సీజన్ తెలుగులోనే కాదు తమిళంలోనూ విపరీతమైన వసూళ్లు తీసుకొస్తుంది. అజిత్, విజయ్ చాలాసార్లు ఈ పండగను వాడుకుని రికార్డులు సృష్టించారు. పైగా ఇప్పటిదాకా వేరే కోలీవుడ్ సినిమాలేవీ అధికారికంగా డేట్లు ప్రకటించలేదు. విక్రమ్ వీర ధీర శూరన్ లాంటి పేర్లు వినిపిస్తున్నాయి కానీ ఇంకా అఫీషియల్ కాలేదు. సో తేదీ కనక కుదిరితే కనకవర్షం ఖాయమని మైత్రి బృందం నమ్మకం. కానీ మ్యాటర్ ఇంకా తేలలేదు.
ఇటుపక్క టాలీవుడ్ లో ఏర్పడ్డ విపరీతమైన పోటీ డబ్బింగ్ సినిమాలకు ఏ మాత్రం స్పేస్ ఇస్తుందనేది అనుమానంగానే ఉంది. అయితే గతంలో వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి మధ్య వారసుడిని దింపి సేఫ్ చేయించుకున్న దిల్ రాజు తరహాలో గుడ్ బ్యాడ్ అగ్లీకి ఏమైనా స్ట్రాటజీ ప్లాన్ చేస్తారేమో చూడాలి. విశాల్ మార్క్ ఆంటోనీతో తమిళంలో బ్లాక్ బస్టర్ అందుకున్న ఆధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ కమర్షియల్ డ్రామాలో అజిత్ డిఫరెంట్ షేడ్స్ పోషించారని టాక్ ఉంది. ఏది ముందు ఏది వెనక్కు ఇంకా తేలని కారణంగానే ప్రమోషన్లు మొదలుపెట్టలేకపోతున్నారు. అజితే ఫైనల్ చేయాలి.
This post was last modified on October 21, 2024 1:53 pm
జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…
గత పది రోజులుగా తమిళనాడు రాజకీయాలు దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…
ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…
నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలకు కేరళలో తీవ్రనిరసన సెగ తగులుతోంది. రాహుల్-ప్రియాంక.. కేరళ మిమ్మల్ని క్షమించదు.…
నిజమేనండోయ్… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏదైనా మాట ఇచ్చారంటే దానిని నెరవేర్చి తీరతారు. ఇందుకు…