సినిమాలు చేయడంలో మంచి వేగం చూపిస్తున్న విశ్వక్ సేన్ అంతే స్థాయిలో వరస విజయాలు అందుకోలేకపోతున్నాడు. ఎన్నో ఆశలు పెట్టుకున్న మాస్ కా దాస్, బాగా ప్రమోట్ చేసుకున్న గ్యాంగ్స్ అఫ్ గోదావరి అభిమానులను నిరాశపరిచాయి. గామికి ప్రశంసలు దక్కి బ్రేక్ ఈవెన్ అయ్యింది కానీ రిపీట్ వేల్యూ ఉన్న మూవీగా నిలవలేదు.
తాజాగా వచ్చే నెల నవంబర్ 22 మెకానిక్ రాకీగా రాబోతున్నాడు. రవితేజ్ ఎం దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ డ్రామాలో రెగ్యులర్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నప్పటికీ పాయింట్ ఉన్న వైవిధ్యం ప్రేక్షకులకు కొత్త అనుభూతి నిస్తుందనే నమ్మకం విశ్వక్ వ్యక్తం చేస్తున్నాడు.
ఇవాళ ట్రైలర్ లాంచ్ జరిగింది. కాన్సెప్ట్ ఏంటో చెప్పేశారు. కంప్యూటర్ ఇంజనీరింగ్ తప్పిన కుర్రాడు(విశ్వక్) తండ్రి (నరేష్) నడిపే మెకానిక్ షెడ్ బాధ్యతలు తీసుకుంటాడు. నచ్చిన అమ్మాయి వెంట పడే హాబీ ఉన్న ఇతని జీవితంలోకి ఇద్దరు ముద్దుగుమ్మలు వస్తారు. కట్ చేస్తే ఒక విలన్ (సునీల్) వల్ల వీళ్ళ వ్యాపారానికి గండి పడటమే కాదు కుటుంబం ప్రమాదంలో పడుతుంది. దీనికి రాకీ ఏం చేశాడనేది అసలు స్టోరీ.
ఈవెంట్ లో మాట్లాడిన విశ్వక్ సేన్ నవంబర్ 21 ప్రీమియర్లు వేస్తామని ఒకవేళ నచ్చలేదని ఎవరైనా చెబితే రిలీజ్ రోజు థియేటర్లకు రావొద్దని చెప్పాడు. ఈ టైపు ఛాలెంజులు గతంలోనూ చేశాడు విశ్వక్.
సరిపోదా శనివారం తర్వాత సంగీత దర్శకుడు జేక్స్ బిజోయ్ కి మెకానిక్ రాకీ అంతకు మించి బ్రేక్ ఇస్తుందని అన్నాడు. బజ్ లేదని ఇప్పటిదాకా చాలా మంది అన్నారని, అసలు తామే బజ్ తేలేదని, ఇప్పటి నుంచి మారుతుందని అన్నాడు.
మొత్తానికి బోలెడు కబుర్లతో అభిమానులను ఖుష్ చేసిన విశ్వక్ బృందం నెల రోజుల ముందే ట్రైలర్ ని అందులోనూ ఫస్ట్ వెర్షన్ ని విడుదల చేయడం గమనార్షం. మీనాక్షి చౌదరి, శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో సునీల్ మెయిన్ విలన్ గా నటిస్తున్నాడు. ఆటోమొబైల్స్ కు సంబంధించిన క్రైమ్ ఎలిమెంట్ ఇందులో కీలకంగా ఉంటుందని టాక్.
This post was last modified on October 20, 2024 6:41 pm
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…