టాక్ షోలలో కొత్త ట్రెండ్ సృష్టించిన అన్ స్టాపబుల్ సీజన్ 4 కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో అమాంతం అద్భుతాలు చేస్తామనే స్థాయిలో విజువల్స్ చూపించలేదు కానీ బాలయ్య మాత్రం డబుల్ ఎనర్జీతో నడిపిస్తాననే హామీ ప్రేక్షకుల్లో హైప్ పెంచింది. ఇదిలా ఉండగా ఈ నాలుగో సిరీస్ మొదటి ఎపిసోడ్ ని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుతో షూట్ చేయబోతున్నట్టు లేటెస్ట్ అప్డేట్. ఇద్దరి మధ్య బంధుత్వంతో పాటు సిఎం, ఎమ్మెల్యే అనే బాండింగ్ ఉండటంతో అంచనాలు ఎక్కువగా ఉంటాయి.
కాకపోతే గత సీజన్ లోనే బాలయ్య అండ్ బాబు కాంబోని ఆడియన్స్ చూసేశారు కాబట్టి ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఏం చెప్పిస్తారనే సందేహం రావడం సహజం. అప్పుడు ప్రతిపక్షం, ఇప్పుడు సగర్వ అధికార పక్షం అనే పాయింట్ సరిపోదు. ఎందుకంటే అన్ స్టాపబుల్ 4 చూసేవాళ్ళలో రాజకీయాలంటే ఆసక్తి ఉన్న వాళ్ళతో పాటు సినిమా బ్యాచ్ ఎక్కువగా ఉంటారు. అందుకే గత బాబు ఎపిసోడ్ కోట్లాది వ్యూస్ తో సూపర్ హిట్ అయ్యింది. ఎమోషనల్ విషయాలు, 90 దశకంలో టిడిపి అధికార మార్పిడి నాటి పరిణామాలు, గెలుపోటముల ముచ్చట్లు, రెండు కుటుంబాల మధ్య అనుబంధాలు ఇలా ఎన్నో పంచుకున్నారు.
ఇప్పుడు కొత్తగా వియ్యంకులు ఏం షేర్ చేసుకుంటారనేది చూడాలి. రెండోసారి అంటే అంత ఆసక్తి ఉండదనే కామెంట్స్ వినిపిస్తున్నప్పటికీ అలా అనిపించకుండా ఎపిసోడ్ డిజైన్ చేశారనే మాట యూనిట్ నుంచి వినిపిస్తోంది. బాబు జైలు జీవితం, ఇరు ఫ్యామిలీలు అనుభవించిన మానసిక క్షోభ, లోకేష్ విజయం, జనసేన పాత్ర, పవన్ కళ్యాణ్ చొరవ ఇలా ఎన్నో కొత్త అంశాలు చర్చలోకి వస్తాయని అంటున్నారు. ఈ ఎపిసోడ్ లోనే పవన్ కళ్యాణ్ కూడా రావొచ్చని లీక్ వచ్చింది కానీ ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ తప్పించి ఖరారుగా చెప్పలేదు. నిజం కాకపోయినా ఓకే కానీ బాబుతో బాలయ్య ఎలాంటి సంచలన విషయాలు రాబడతారో చూడాలి.
This post was last modified on October 19, 2024 1:06 pm
తమిళంలో కొన్నేళ్లుగా నంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న విజయ్.. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నికల బరిలోకి దిగే…
తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…
న్యూజిలాండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…
ఈ ఏడాది మార్చి-ఏప్రిల్ మధ్య జరిగే తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినానికి భారీ ప్రకటన చేసేందుకు ఏపీ మంత్రి నారా…