టాలీవుడ్లో ఒకప్పుడు ఫుల్ బిజీగా ఉన్న సమంత.. ఇప్పుడు అవకాశాలే లేని స్థితికి చేరుకుంది. ఇందుకు ప్రధాన కారణం ఆమె అనారోగ్యం. నాగచైతన్య నుంచి విడాకులు తీసుకుని మానసికంగా కాస్త కుంగుబాటులో ఉన్న సమయంలో ఆమెకు మయోసైటిస్ అనే ప్రమాదకర జబ్బు సోకింది. దానికి చికిత్స తీసుకోవడం కోసం చాన్నాళ్ల సమయం వెచ్చించింది సామ్. ఇండియాలోనే కాక యుఎస్లోనూ ఆమె చికిత్స సాగింది. ఇందుకోసం కెరీర్లోనూ గ్యాప్ తీసుకోక తప్పలేదు.
అనారోగ్యం నుంచి కోలుకున్నాక ఆమెకు అవకాశాలు తగ్గిపోయాయి. ఈ కారణంతోనే తాను ‘సిటాడెల్’ వెబ్ సిరీస్కు కూడా దూరం కావాల్సిందని.. కానీ రాజ్-డీకే తన కోసమే పట్టుబట్టి ఎదురు చూడడం వల్లే ఈ సిరీస్ చేయగలిగానని అంటోంది సామ్. ఈ సిరీస్లో పాత్రకు తనను అడిగినపుడు తాను చేయనని చెప్పినట్లు ఆమె వెల్లడించింది.
“సిటాడెల్ కథ నా దగ్గరికి వచ్చినపుడే నాకు మయోసైటిస్ కన్ఫమ్ అయింది. దీంతో బన్నీ పాత్రలో నేను నటించలేనని దర్శకులు రాజ్-డీకేలకు చెప్పేశా. ఈ పాత్ర కోసం ఎవరు బాగుంటారో నలుగురు హీరోయిన్ల పేర్లు కూడా చెప్పాను. కానీ నా సూచనలను వాళ్లు తిరస్కరించారు. నాతోనే ఈ సిరీస్ చేయాలని నా ఆరోగ్యం కుదుటపడే వరకు ఎదురు చూశారు. కానీ ఇప్పుడీ సిరీస్ చూస్తుంటే ఆ సమయంలో డైరెక్టర్లు తీసుకున్న నిర్ణయానికి థ్యాంక్స్ చెప్పాలనిపిస్తోంది. ఎందుకంటే నేనే చెప్పినా సరే వేరే వాళ్లను తీసుకోకుండా నాతోనే ఈ పాత్ర చేయించడం నా అదృష్టంగా భావిస్తున్నా” అని సమంత చెప్పింది.
హాలీవుడ్లో రుసో బ్రదర్స్ రూపొందించిన ‘సిటాడెల్’కు లోకల్ అడాప్షన్గా తెరకెక్కిన ఈ సిరీస్ నవంబరు 7న అమేజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ కాబోతోంది. ఇందులో సామ్కు జోడీగా బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ నటించాడు. ఇందులో వరుణ్, సామ్ సీక్రెట్ ఏజెంట్లుగా నటించారు.
This post was last modified on October 18, 2024 1:03 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…