Movie News

సమంత చేయనని చెప్పినా వదల్లేదు

టాలీవుడ్లో ఒకప్పుడు ఫుల్ బిజీగా ఉన్న సమంత.. ఇప్పుడు అవకాశాలే లేని స్థితికి చేరుకుంది. ఇందుకు ప్రధాన కారణం ఆమె అనారోగ్యం. నాగచైతన్య నుంచి విడాకులు తీసుకుని మానసికంగా కాస్త కుంగుబాటులో ఉన్న సమయంలో ఆమెకు మయోసైటిస్ అనే ప్రమాదకర జబ్బు సోకింది. దానికి చికిత్స తీసుకోవడం కోసం చాన్నాళ్ల సమయం వెచ్చించింది సామ్. ఇండియాలోనే కాక యుఎస్‌లోనూ ఆమె చికిత్స సాగింది. ఇందుకోసం కెరీర్లోనూ గ్యాప్ తీసుకోక తప్పలేదు.

అనారోగ్యం నుంచి కోలుకున్నాక ఆమెకు అవకాశాలు తగ్గిపోయాయి. ఈ కారణంతోనే తాను ‘సిటాడెల్’ వెబ్ సిరీస్‌కు కూడా దూరం కావాల్సిందని.. కానీ రాజ్-డీకే తన కోసమే పట్టుబట్టి ఎదురు చూడడం వల్లే ఈ సిరీస్ చేయగలిగానని అంటోంది సామ్. ఈ సిరీస్‌లో పాత్రకు తనను అడిగినపుడు తాను చేయనని చెప్పినట్లు ఆమె వెల్లడించింది.

“సిటాడెల్ కథ నా దగ్గరికి వచ్చినపుడే నాకు మయోసైటిస్ కన్ఫమ్ అయింది. దీంతో బన్నీ పాత్రలో నేను నటించలేనని దర్శకులు రాజ్-డీకేలకు చెప్పేశా. ఈ పాత్ర కోసం ఎవరు బాగుంటారో నలుగురు హీరోయిన్ల పేర్లు కూడా చెప్పాను. కానీ నా సూచనలను వాళ్లు తిరస్కరించారు. నాతోనే ఈ సిరీస్ చేయాలని నా ఆరోగ్యం కుదుటపడే వరకు ఎదురు చూశారు. కానీ ఇప్పుడీ సిరీస్ చూస్తుంటే ఆ సమయంలో డైరెక్టర్లు తీసుకున్న నిర్ణయానికి థ్యాంక్స్ చెప్పాలనిపిస్తోంది. ఎందుకంటే నేనే చెప్పినా సరే వేరే వాళ్లను తీసుకోకుండా నాతోనే ఈ పాత్ర చేయించడం నా అదృష్టంగా భావిస్తున్నా” అని సమంత చెప్పింది.

హాలీవుడ్లో రుసో బ్రదర్స్ రూపొందించిన ‘సిటాడెల్’కు లోకల్ అడాప్షన్‌గా తెరకెక్కిన ఈ సిరీస్ నవంబరు 7న అమేజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ కాబోతోంది. ఇందులో సామ్‌కు జోడీగా బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ నటించాడు. ఇందులో వరుణ్, సామ్ సీక్రెట్ ఏజెంట్లుగా నటించారు.

This post was last modified on October 18, 2024 1:03 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పరకామణి చోరీ పై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

వైసీపీ పాల‌నా కాలంలో తిరుమ‌ల శ్రీవారి ప‌ర‌కామ‌ణిలో 900 డాల‌ర్ల  చోరీ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ ప‌రిణామం తిరుమ‌ల…

2 hours ago

వారిని సెంటర్లో పడేసి కొట్టమంటున్న టీడీపీ ఎమ్మెల్యే!

నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…

2 hours ago

రేట్లు లేకపోయినా రాజాసాబ్ లాగుతాడా?

ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…

4 hours ago

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…

9 hours ago

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

9 hours ago