టాలీవుడ్లో ఒకప్పుడు ఫుల్ బిజీగా ఉన్న సమంత.. ఇప్పుడు అవకాశాలే లేని స్థితికి చేరుకుంది. ఇందుకు ప్రధాన కారణం ఆమె అనారోగ్యం. నాగచైతన్య నుంచి విడాకులు తీసుకుని మానసికంగా కాస్త కుంగుబాటులో ఉన్న సమయంలో ఆమెకు మయోసైటిస్ అనే ప్రమాదకర జబ్బు సోకింది. దానికి చికిత్స తీసుకోవడం కోసం చాన్నాళ్ల సమయం వెచ్చించింది సామ్. ఇండియాలోనే కాక యుఎస్లోనూ ఆమె చికిత్స సాగింది. ఇందుకోసం కెరీర్లోనూ గ్యాప్ తీసుకోక తప్పలేదు.
అనారోగ్యం నుంచి కోలుకున్నాక ఆమెకు అవకాశాలు తగ్గిపోయాయి. ఈ కారణంతోనే తాను ‘సిటాడెల్’ వెబ్ సిరీస్కు కూడా దూరం కావాల్సిందని.. కానీ రాజ్-డీకే తన కోసమే పట్టుబట్టి ఎదురు చూడడం వల్లే ఈ సిరీస్ చేయగలిగానని అంటోంది సామ్. ఈ సిరీస్లో పాత్రకు తనను అడిగినపుడు తాను చేయనని చెప్పినట్లు ఆమె వెల్లడించింది.
“సిటాడెల్ కథ నా దగ్గరికి వచ్చినపుడే నాకు మయోసైటిస్ కన్ఫమ్ అయింది. దీంతో బన్నీ పాత్రలో నేను నటించలేనని దర్శకులు రాజ్-డీకేలకు చెప్పేశా. ఈ పాత్ర కోసం ఎవరు బాగుంటారో నలుగురు హీరోయిన్ల పేర్లు కూడా చెప్పాను. కానీ నా సూచనలను వాళ్లు తిరస్కరించారు. నాతోనే ఈ సిరీస్ చేయాలని నా ఆరోగ్యం కుదుటపడే వరకు ఎదురు చూశారు. కానీ ఇప్పుడీ సిరీస్ చూస్తుంటే ఆ సమయంలో డైరెక్టర్లు తీసుకున్న నిర్ణయానికి థ్యాంక్స్ చెప్పాలనిపిస్తోంది. ఎందుకంటే నేనే చెప్పినా సరే వేరే వాళ్లను తీసుకోకుండా నాతోనే ఈ పాత్ర చేయించడం నా అదృష్టంగా భావిస్తున్నా” అని సమంత చెప్పింది.
హాలీవుడ్లో రుసో బ్రదర్స్ రూపొందించిన ‘సిటాడెల్’కు లోకల్ అడాప్షన్గా తెరకెక్కిన ఈ సిరీస్ నవంబరు 7న అమేజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ కాబోతోంది. ఇందులో సామ్కు జోడీగా బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ నటించాడు. ఇందులో వరుణ్, సామ్ సీక్రెట్ ఏజెంట్లుగా నటించారు.
This post was last modified on October 18, 2024 1:03 pm
ఐపీఎల్ 2026 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) పరిస్థితి రోజురోజుకూ అట్టడుగుకు పడిపోతోంది. నేటి మ్యాచ్ లో సొంత…
ఇటీవలే టోవినో థామస్ 'పళ్ళి చట్టంబి' తెలుగు వెర్షన్ విడుదలయ్యింది. మార్నింగ్ షోనే డెఫిసిట్ తో మొదలై సాయంత్రానికే డిజాస్టర్…
కల్వకుంట్ల కవిత.. మాజీసీఎం కేసీఆర్ తనయగా.. రాజకీయాల్లోకి అడుగు పెట్టిన ఆమె.. ఎంపీగా, ఎమ్మెల్సీగా వ్యవహరించారు. ఇక, ఆ పార్టీతో…
టాలీవుడ్లో బిగ్గెస్ట్ సినీ ఫ్యామిలీ ఏది అంటే.. మెగా కుటుంబం గురించే ముందుగా చెప్పుకోవాలి. ఆ కుటుంబంలో ఉన్నంత మంది…
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో మలయాళ పరిశ్రమను మినహాయిస్తే.. ప్రతి చోటా సినిమాల మేకింగ్ బాగా టైం తీసుకుంటోంది. కొంచెం స్టార్ ఇమేజ్…
టీడీపీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఏపీకి పలుమార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన దివంగత నందమూరి తారక రామారావుకు భారత దేశ అత్యున్నత పురస్కారం భారత రత్న ఇవ్వాలన్నమాట నిత్యం…