దక్షిణాదిని తిరుగులని స్టార్ ఇమేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించిన హీరోయిన్లలో సమంత ఒకరు. ఆమె విజయశాంతి, నయనతార, అనుష్కల మాదిరి పవర్ ఫుల్ మాస్ రోల్స్ చేయకపోయినా.. తన శైలిలో క్లాస్ సినిమాలు చేస్తూనే భారీగా అభిమాన గణాన్ని సంపాదించుకుంది.
స్టార్ హీరోల సినిమాల్లో గ్లామర్, పెర్ఫామెన్స్ ఓరియెంటెడ్ రోల్స్ చేస్తూనే.. యుటర్న్, ఓ బేబీ, యశోద లాంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాలతోనూ ఆకట్టుకుంది. ఐతే ఎలాంటి హీరోయిన్కైనా ఒక దశ తర్వాత అవకాశాలు తగ్గడం, కెరీర్ డౌన్ అవడం మామూలే.
అందులోనూ సమంత పెళ్లి చేసుకోవడంతో ఇక తన కెరీర్ క్లోజ్ అనుకున్నారు. కానీ ఆమె తర్వాత కూడా బలంగా నిలబడింది. కానీ వ్యక్తిగత జీవితంలో ఒడుదొడుకులు, అనారోగ్యం సమంత కెరీర్ మీద ప్రభావం చూపాయి. ముఖ్యంగా అనారోగ్యం తర్వాత కెరీర్ బాగా డౌన్ అయింది.
మయోసైటిస్కు చికిత్స తీసుకున్నాక సామ్ లుక్ కూడా మారిపోయింది. సమంతలో ఒకప్పటి ఛార్మ్ మిస్సయిందనే ఫీలింగ్ అభిమానుల్లో కలిగింది. చివరి చిత్రం ‘శాకుంతలం’ డిజాస్టర్ కావడం.. తర్వాత కెరీర్లో గ్యాప్ కూడా రావడం తన కెరీర్ మీద ప్రతికూల ప్రభావం చూపేలా కనిపించింది.
ఇక సమంత కెరీర్ ముగిసినట్లే అనే అభిప్రాయానికి వచ్చేశారు జనం. కానీ సామ్ ‘సిటాడెల్’ వెబ్ సిరీస్తో బౌన్స్ బ్యాక్ అయ్యే ప్రయత్నంలో ఉంది. ఈ సిరీస్ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. యాక్షన్ అవతార్లో సమంత మెప్పించింది. అందులో సామ్ పాత్ర వినోదమూ పంచేలా ఉంది. ఈ సిరీస్ ప్రమోషన్లలో సమంత చాలా ఆకర్షణీయంగా కనిపించడం విశేషం.
ముఖంలో మునుపటి ఛార్మ్ కనిపించింది. ఓవరాల్ లుక్ కూడా బాగుంది. ఆకర్షణీయమైన స్టైలింగ్ కూడా తోడవడంతో సమంత ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి. ఈ సిరీస్ బాగుంటే సామ్ కెరీర్ మళ్లీ వేగం పుంజుకోవడం ఖాయం.
This post was last modified on October 17, 2024 6:18 pm
టాలీవుడ్లో భోజన ప్రియులుగా కొందరు హీరోలకు పేరుంది. అందులో జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ల పేర్లు ముందు వరుసలో ఉంటాయి. తనకు…
బాలీవుడ్ అతి పెద్ద బ్లాక్ బస్టర్ సాధించిన హీరో రణ్వీర్ సింగ్ విచిత్రమైన పరిస్థితిలో ఉన్నాడు. దురంధర్ 2 తర్వాత…
ఇరు తెలుగు రాష్ట్రాలకు 'సర్' వస్తున్నారు.. దేశవ్యాప్తంగా ఓటరు జాబితాలను సమగ్రంగా పరిశీలించేందుకు భారత ఎన్నికల సంఘం ‘స్పెషల్ ఇంటెన్సివ్…
టీ20 వరల్డ్ కప్ 2026 లీగ్ దశ ముగిసి అసలైన మజా మొదలవ్వబోతోంది. ఈసారి సూపర్ 8 గ్రూపులు ఫైనల్…
హైదరాబాద్ నగరంలోని అమీర్పేట మైత్రీవనం చౌరస్తా వద్ద ఉన్న ఆదిత్య ఎన్క్లేవ్ భవనంలో శుక్రవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది.…
విద్యుత్ శాఖలో అవినీతి ఆరోపణలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. లంచాల వ్యవహారంపై విజిలెన్స్ జరిపిన విచారణలో షాకింగ్ నిజాలు బయటపడటంతో…