ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ మూవీస్లో ఒకటైన ‘పుష్ప: ది రూల్’ విడుదలకు ఇంకో 50 రోజులే సమయం ఉంది. ఈ చిత్రాన్ని ముందు అనుకున్న ప్రకారం ఆగస్టు 15న రిలీజ్ చేయలేకపోయిన టీం.. కొత్త డేట్ డిసెంబరు 6కు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమాను థియేటర్లలోకి దించాలని పట్టుదలతో ప్రయత్నం చేస్తోంది.
సినిమాలో ఏ సీన్ లాక్ చేయకుండా రిలీజ్ ముందు రోజు వరకు హడావుడి పడతాడని పేరున్న దర్శకుడు సుకుమార్.. ఈసారి విడుదలకు రెండు నెలల ముందే ఫస్టాఫ్ను లాక్ చేసేయడంతో టీం చాలా ఉత్సాహంగా ఉంది. ప్రస్తుతం చిత్రీకరణ చివరి దశలో ఉండగా.. దాంతో పాటే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా సమాంతరంగా జరుగుతున్నాయి.
ఈ నెలాఖరుకు షూట్ మొత్తం పూర్తి చేసి తర్వాత పూర్తిగా ఎడిటింగ్ పనుల్లో సుకుమార్ నిమగ్నమవుతాడని అంటున్నారు. ఇదిలా ఉంటే సినిమా కథ, హైలైట్ల గురించి.. ముఖ్య పాత్రల గురించి సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.
‘పుష్ప: ది రైజ్’ను ముగించిన ప్రకారం పార్ట్-2లో భన్వర్ సింగ్ షెకావత్ పాత్రలో ఫాహద్ ఫాజిలే మెయిన్ విలన్ అనే అంచనా ప్రేక్షకుల్లో ఉంది. పుష్పకు, షెకావత్కు మధ్య పోరు ఎలా ఉంటుందా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఐతే పుష్ప-2లో ఫాహద్ ఒక్కడే విలన్ కాదు. పుష్ప చాలామందినే ఢీకొట్టాల్సి ఉంది.
కొండారెడ్డి హత్యకు ప్రతీకారం తీర్చుకోవడానికి తన బ్రదర్స్.. అలాగే తన బామ్మర్దిని కోల్పోయినందుకు దెబ్బకు దెబ్బ తీయడానికి మంగళం శీను కూడా రెడీగా ఉంటారు. వీళ్ల పాత్రలు కూడా పుష్ప-2లో కీలకంగా ఉంటాయట. వీరు కాకుండా మరి కొందరు విలన్లు కూడా ఉన్నారు.
ఎంపీ పాత్రలో పుష్ప-1లో పుష్పకు అనుకూలంగానే కనిపించిన రావు రమేష్.. పార్ట్-2లో పుష్పను టార్గెట్ చేస్తాడట. ఆయనతో పాటు ‘కేజీఎఫ్’ ఫేమ్ తారక్ పొన్నప్ప, మలయాళ నటుడు ఆదిత్య మేనన్లతో పాటు ‘యానిమల్’ ఫేమ్ సౌరభ్ సచ్దేవ్ కూడా ‘పుష్ప-2’లో నటిస్తున్నాడు. ఇంతమంది పవర్ ఫుల్ విలన్లను ఢీకొట్టే క్రమంలో పుష్ప పాత్ర ఇంకా పవర్ ఫుల్గా మారుతుందని సమాచారం.
ఏపీలో కూటమి అధికారం చేపట్టి అప్పుడే రెండేళ్లు దాటిపోయింది. 2024 ఎన్నికల్లో ఏ ఒక్కరి ఊహకు అందని రీతిలో టీడీపీ,…
ఏపీ సీఎం చంద్రబాబు.. పాలన, ఆయన తీసుకున్న నిర్ణయాలు.. వేస్తున్న అడుగులు, భవిష్యత్తు ఆంధ్ర ప్రదేశ్ నిర్మాణం.. వంటి పలు…
2024 సార్వత్రిక ఎన్నికల్లో ఏపీతో పాటు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక…
తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు కవిత ఏం మాట్లాడినా.. ఆలోచించే మాట్లాడతారన్న పేరుంది. పైగా మాటల విషయంలో ఆమె…
ఏపీ హోం మంత్రి వంగలపూడి అనితపై వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై…
జనసేన అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రేపు వరంగల్లో పర్యటించనున్నారు. ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న చిన్నారి నిరంజన్…