ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ మూవీస్లో ఒకటైన ‘పుష్ప: ది రూల్’ విడుదలకు ఇంకో 50 రోజులే సమయం ఉంది. ఈ చిత్రాన్ని ముందు అనుకున్న ప్రకారం ఆగస్టు 15న రిలీజ్ చేయలేకపోయిన టీం.. కొత్త డేట్ డిసెంబరు 6కు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమాను థియేటర్లలోకి దించాలని పట్టుదలతో ప్రయత్నం చేస్తోంది.
సినిమాలో ఏ సీన్ లాక్ చేయకుండా రిలీజ్ ముందు రోజు వరకు హడావుడి పడతాడని పేరున్న దర్శకుడు సుకుమార్.. ఈసారి విడుదలకు రెండు నెలల ముందే ఫస్టాఫ్ను లాక్ చేసేయడంతో టీం చాలా ఉత్సాహంగా ఉంది. ప్రస్తుతం చిత్రీకరణ చివరి దశలో ఉండగా.. దాంతో పాటే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా సమాంతరంగా జరుగుతున్నాయి.
ఈ నెలాఖరుకు షూట్ మొత్తం పూర్తి చేసి తర్వాత పూర్తిగా ఎడిటింగ్ పనుల్లో సుకుమార్ నిమగ్నమవుతాడని అంటున్నారు. ఇదిలా ఉంటే సినిమా కథ, హైలైట్ల గురించి.. ముఖ్య పాత్రల గురించి సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.
‘పుష్ప: ది రైజ్’ను ముగించిన ప్రకారం పార్ట్-2లో భన్వర్ సింగ్ షెకావత్ పాత్రలో ఫాహద్ ఫాజిలే మెయిన్ విలన్ అనే అంచనా ప్రేక్షకుల్లో ఉంది. పుష్పకు, షెకావత్కు మధ్య పోరు ఎలా ఉంటుందా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఐతే పుష్ప-2లో ఫాహద్ ఒక్కడే విలన్ కాదు. పుష్ప చాలామందినే ఢీకొట్టాల్సి ఉంది.
కొండారెడ్డి హత్యకు ప్రతీకారం తీర్చుకోవడానికి తన బ్రదర్స్.. అలాగే తన బామ్మర్దిని కోల్పోయినందుకు దెబ్బకు దెబ్బ తీయడానికి మంగళం శీను కూడా రెడీగా ఉంటారు. వీళ్ల పాత్రలు కూడా పుష్ప-2లో కీలకంగా ఉంటాయట. వీరు కాకుండా మరి కొందరు విలన్లు కూడా ఉన్నారు.
ఎంపీ పాత్రలో పుష్ప-1లో పుష్పకు అనుకూలంగానే కనిపించిన రావు రమేష్.. పార్ట్-2లో పుష్పను టార్గెట్ చేస్తాడట. ఆయనతో పాటు ‘కేజీఎఫ్’ ఫేమ్ తారక్ పొన్నప్ప, మలయాళ నటుడు ఆదిత్య మేనన్లతో పాటు ‘యానిమల్’ ఫేమ్ సౌరభ్ సచ్దేవ్ కూడా ‘పుష్ప-2’లో నటిస్తున్నాడు. ఇంతమంది పవర్ ఫుల్ విలన్లను ఢీకొట్టే క్రమంలో పుష్ప పాత్ర ఇంకా పవర్ ఫుల్గా మారుతుందని సమాచారం.
This post was last modified on October 17, 2024 6:19 pm
తొలి చిత్రం ‘మళ్ళీ రావా’తో దర్శకుడిగా బలమైన ముద్ర వేశాడు గౌతమ్ తిన్ననూరి. సుమంత్ లాంటి ఫాంలో లేని హీరోను పెట్టి,…
ఆరంభ సీజన్లతో పోలిస్తే ‘బిగ్ బాస్’ షోకు ఇప్పుడు ఆదరణ కొంచెం తగ్గిన మాట వాస్తవం. ఒకప్పట్లా సోషల్ మీడియాలో…
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…