కొన్నిసార్లు మంచి సినిమాలు థియేటర్లలో ఉన్నా జనాలు సరిగా చూడని పరిస్థితి ఉంటుంది. కొన్నిసార్లేమో ప్రేక్షకులు థియేటర్లకు రావడానికి సిద్ధంగా ఉన్నా.. సరైన సినిమాలు ఉండవు. దసరా టైంలో ప్రేక్షకుల ఆకలి తీర్చే సినిమాలు పడకపోవడంతో నిరాశ తప్పలేదు. మంచి టైమింగ్ను టాలీవుడ్ ఉపయోగించుకోలేకపోయిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
దసరా సందడి ముగిశాక.. ఇప్పుడు మరో వీకెండ్ వస్తోంది. కానీ ఈ వారం బాక్సాఫీస్ దగ్గర ఉన్న ఖాళీని ఉపయోగించుకోవడానికి సినిమాలే లేవు. దసరా సినిమాలు రెండో వారం కూడా ప్రభావం చూపుతాయనే ఉద్దేశంతోనే ఏమో.. ఈ వారాన్ని ఖాళీగా వదిలేశారు. ‘లవ్ రెడ్డి’, ‘కల్లు కాంపౌండ్’ అంటూ కొన్ని చిన్న చిత్రాలేవో వస్తున్నాయి కానీ.. వాటిని ప్రేక్షకులు పట్టించుకునే స్థితిలో లేరు. ఇవి కాక పేరున్న చిత్రం ఒక్కటీ రిలీజ్ కావడం లేదు.
పోనీ ముందు వారంలో వచ్చిన సినిమాలైనా బాగున్నాయా అంటూ అదీ లేదు. సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా ‘వేట్టయన్’ తొలి వీకెండ్లోనే ప్రేక్షకులను థియేటర్లకు రప్పించలేకపోయింది. వీకెండ్ తర్వాత సినిమాకు ఆక్యుపెన్సీలు దారుణంగా పడిపోయాయి. తెలుగు నుంచి రిలీజైన సినిమాల్లో ‘విశ్వం’ కొంచెం స్థాయి ఉన్న చిత్రం. దానికీ టాక్ బాలేదు.
వీకెండ్ వరకు ఓ మోస్తరుగా ఆడింది. తర్వాత డల్ అయిపోయింది. జనక అయితే గనక, మా నాన్న సూపర్ హీరో సినిమాలకు వీకెండ్లోనే వసూళ్లు కరవయ్యాయి. తర్వాత కూడా అవి పుంజుకోలేకపోయాయి.
ఈ వీకెండ్లో సినిమా చూద్దామనుకున్నా థియేటర్లకు రప్పించే సినిమాలు కనిపించడం లేదు. ఏ చిత్రం ఎగ్జైటింగ్గా లేకపోవడంతో ప్రేక్షకులు ఈ వీకెండ్ సినిమా లైట్ అన్నట్లు ఊరుకునే పరిస్థితి కనిపిస్తోంది. నెలాఖర్లో దీపావళి వీకెండ్ కోసం మ్యాడ్ రష్ ఉంది కానీ.. వచ్చే వారం కూడా చెప్పుకోదగ్గ సినిమాలు లేవు. దీంతో బాక్సాఫీస్ ఇంకో రెండు వారాలు వెలవెలబోయేలా కనిపిస్తోంది.
This post was last modified on October 18, 2024 9:30 am
టాలీవుడ్లో భోజన ప్రియులుగా కొందరు హీరోలకు పేరుంది. అందులో జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ల పేర్లు ముందు వరుసలో ఉంటాయి. తనకు…
బాలీవుడ్ అతి పెద్ద బ్లాక్ బస్టర్ సాధించిన హీరో రణ్వీర్ సింగ్ విచిత్రమైన పరిస్థితిలో ఉన్నాడు. దురంధర్ 2 తర్వాత…
ఇరు తెలుగు రాష్ట్రాలకు 'సర్' వస్తున్నారు.. దేశవ్యాప్తంగా ఓటరు జాబితాలను సమగ్రంగా పరిశీలించేందుకు భారత ఎన్నికల సంఘం ‘స్పెషల్ ఇంటెన్సివ్…
టీ20 వరల్డ్ కప్ 2026 లీగ్ దశ ముగిసి అసలైన మజా మొదలవ్వబోతోంది. ఈసారి సూపర్ 8 గ్రూపులు ఫైనల్…
హైదరాబాద్ నగరంలోని అమీర్పేట మైత్రీవనం చౌరస్తా వద్ద ఉన్న ఆదిత్య ఎన్క్లేవ్ భవనంలో శుక్రవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది.…
విద్యుత్ శాఖలో అవినీతి ఆరోపణలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. లంచాల వ్యవహారంపై విజిలెన్స్ జరిపిన విచారణలో షాకింగ్ నిజాలు బయటపడటంతో…