కొన్నిసార్లు మంచి సినిమాలు థియేటర్లలో ఉన్నా జనాలు సరిగా చూడని పరిస్థితి ఉంటుంది. కొన్నిసార్లేమో ప్రేక్షకులు థియేటర్లకు రావడానికి సిద్ధంగా ఉన్నా.. సరైన సినిమాలు ఉండవు. దసరా టైంలో ప్రేక్షకుల ఆకలి తీర్చే సినిమాలు పడకపోవడంతో నిరాశ తప్పలేదు. మంచి టైమింగ్ను టాలీవుడ్ ఉపయోగించుకోలేకపోయిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
దసరా సందడి ముగిశాక.. ఇప్పుడు మరో వీకెండ్ వస్తోంది. కానీ ఈ వారం బాక్సాఫీస్ దగ్గర ఉన్న ఖాళీని ఉపయోగించుకోవడానికి సినిమాలే లేవు. దసరా సినిమాలు రెండో వారం కూడా ప్రభావం చూపుతాయనే ఉద్దేశంతోనే ఏమో.. ఈ వారాన్ని ఖాళీగా వదిలేశారు. ‘లవ్ రెడ్డి’, ‘కల్లు కాంపౌండ్’ అంటూ కొన్ని చిన్న చిత్రాలేవో వస్తున్నాయి కానీ.. వాటిని ప్రేక్షకులు పట్టించుకునే స్థితిలో లేరు. ఇవి కాక పేరున్న చిత్రం ఒక్కటీ రిలీజ్ కావడం లేదు.
పోనీ ముందు వారంలో వచ్చిన సినిమాలైనా బాగున్నాయా అంటూ అదీ లేదు. సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా ‘వేట్టయన్’ తొలి వీకెండ్లోనే ప్రేక్షకులను థియేటర్లకు రప్పించలేకపోయింది. వీకెండ్ తర్వాత సినిమాకు ఆక్యుపెన్సీలు దారుణంగా పడిపోయాయి. తెలుగు నుంచి రిలీజైన సినిమాల్లో ‘విశ్వం’ కొంచెం స్థాయి ఉన్న చిత్రం. దానికీ టాక్ బాలేదు.
వీకెండ్ వరకు ఓ మోస్తరుగా ఆడింది. తర్వాత డల్ అయిపోయింది. జనక అయితే గనక, మా నాన్న సూపర్ హీరో సినిమాలకు వీకెండ్లోనే వసూళ్లు కరవయ్యాయి. తర్వాత కూడా అవి పుంజుకోలేకపోయాయి.
ఈ వీకెండ్లో సినిమా చూద్దామనుకున్నా థియేటర్లకు రప్పించే సినిమాలు కనిపించడం లేదు. ఏ చిత్రం ఎగ్జైటింగ్గా లేకపోవడంతో ప్రేక్షకులు ఈ వీకెండ్ సినిమా లైట్ అన్నట్లు ఊరుకునే పరిస్థితి కనిపిస్తోంది. నెలాఖర్లో దీపావళి వీకెండ్ కోసం మ్యాడ్ రష్ ఉంది కానీ.. వచ్చే వారం కూడా చెప్పుకోదగ్గ సినిమాలు లేవు. దీంతో బాక్సాఫీస్ ఇంకో రెండు వారాలు వెలవెలబోయేలా కనిపిస్తోంది.
This post was last modified on October 18, 2024 9:30 am
రాష్ట్రంలో ప్రతిపక్షం.. బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్.. ప్రజలుకడుతున్న పన్నులతో…
ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…
వైసీపీ అధినేత జగన్పై ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి నిప్పులు చెరిగారు. 'అన్న'…
దేశంలో విమానయాన సంస్థల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న…
ఏపీలో మరో కీలక పథకం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. 'దివ్యాంగ శక్తి' పేరుతో కీలక పథకాన్ని సీఎం చంద్రబాబు, ఉప…