Movie News

అమ్మ‌కానికి క‌ర‌ణ్ జోహార్ సంస్థ‌?

‘కుచ్ కుచ్ హోతా హై’ లాంటి పెద్ద బ్లాక్ బస్టర్‌తో దర్శకుడిగా పరిచయం అయిన కరణ్ జోహార్.. బాలీవుడ్ చరిత్రలోనే బిగ్గెస్ట్ ఫిలి మేకర్స్‌లో ఒకడిగా ఎదిగాడు. దర్శకుడిగా చాలా వేగంగా పెద్ద స్థాయికి చేరుకోవడంతో నిర్మాణంలోకి కూడా అడుగు పెట్టేశాడు. ధర్మ ప్రొడక్షన్స్ బేనర్ మీద పెద్ద పెద్ద సినిమాలు తీశాడు.

అలాగే డిస్ట్రిబ్యూషన్లోకి కూడా అడుగు పెట్టాడు. పదుల సంఖ్యలో సినిమాలను నిర్మించి, డిస్ట్రిబ్యూట్ చేసి ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే బిగ్గెస్ట్ బేనర్లలో ఒకటిగా ‘ధర్మ ప్రొడక్షన్స్’ను నిలిపాడు. కానీ ఈ మధ్య కరణ్‌కు ఏదీ కలిసి రావడం లేదు. ప్రొడ్యూస్ చేసిన సినిమాలతో పాటు డిస్ట్రిబ్యూట్ చేసిన చిత్రాలు కూడా బోల్తా కొడుతున్నాయి.

కరోనా తర్వాత మొత్తంగా బాలీవుడ్ పరిస్థితే ఆశాజనకంగా లేకపోగా.. కరణ్ లాంటి మంచి సక్సెస్ రేట్ ఉన్న నిర్మాత, డిస్ట్రిబ్యూటర్‌ కూడా నిలబడలేని పరిస్థితి తలెత్తింది. ఈ ఏడాది కరణ్ జోహార్ సంస్థ నుంచి వచ్చిన సినిమాలన్నీ నిరాశపరిచాయి.

లేటెస్ట్‌గా ‘జిగ్రా’ మూవీతో ఎదురు దెబ్బ తిన్నాడు కరణ్. ఆలియా భట్ ప్రధాన పాత్రలో వాసన్ బాల రూపొందించిన ఈ చిత్రానికి టాక్ బాగానే వచ్చినా.. దసరా పండుగ వాతావరణంలో ప్రేక్షకులు ఈ సీరియస్ మూవీని చూడ్డానికి ఇష్టపడలేదు. ఈ చిత్రం భారీగా నష్టాలు మిగిల్చింది.

కొన్నేళ్ల నుంచి సక్సెస్ రేట్ బాగా తగ్గిపోవడంతో కరణ్ సంస్థ ఇప్పుడు ఆర్థిక నష్టాలను తట్టుకోలేని స్థితికి చేరుకుంది. దీంతో ధర్మ ప్రొడక్షన్స్‌లో సగం వాటాను అమ్మేయడానికి కరణ్ జోహార్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. ముకేశ్ అంబానీ సంస్థ రిలయెన్స్ ‘ధర్మ ప్రొడక్సన్స్’లో వాటాను కొనబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ముకేశ్ రంగంలోకి దిగారంటే నెమ్మదిగా ధర్మ ప్రొడక్షన్స్‌ మేజర్ వాటా ఆయన చేతుల్లోకి వెళ్లిపోవడం ఖాయం. అలా అని కరణ్ పూర్తిగా తన సంస్థను వదులుకోకపోవచ్చు. క్రియేటివ్ విషయాలన్నీ కరణ్ చూసుకుంటే.. ఆర్థిక వ్యవహారాలు రిలయన్స్ చేతుల్లోకి వెళ్లిపోతాయన్నమాట.

This post was last modified on October 17, 2024 6:06 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

నియోజ‌క‌వ‌ర్గాల‌పై రేవంత్ కొత్త ఫార్ములా… వ‌ర్కువ‌ట్ అయ్యేనా?

2029 పార్ల‌మెంటు ఎన్నిక‌ల నాటికి దేశంలో నియోజ‌క‌వ‌ర్గాల‌ను పున‌ర్విభ‌జించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం ల‌క్ష్యంగా పెట్టుకున్న విష‌యం తెలిసిందే. ఇటు అసెంబ్లీ,…

2 hours ago

పెను సంక్షోభంలో ప్ర‌పంచం…!

అమెరికా - ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న చర్చల ప్రతిష్టంభ‌న ప్రపంచ దేశాలను పెను సంక్షోభంలోకి నెట్టే దిశగా మారుతోందా?…

3 hours ago

రాష్ట్ర‌ప‌తికి బహుమతిగా మంగళగిరి చీర

భార‌త రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌దిముర్ముతో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ భేటీ అయ్యారు. పార్టీకి చెందిన…

3 hours ago

ఏపీ కొత్త ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌… వైసీపీకి షాకేనా?

ఏపీ రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం క‌మిష‌న‌ర్ ప‌ద‌వి ఖాళీ అయింది. గ‌త నెల 31వ తేదీ వ‌ర‌కు ఉన్న రాష్ట్ర…

3 hours ago

‘హోం’ ప్రశ్నలపై ‘సీఎం’ సమాధానం చెప్తారా?

తెలంగాణలో కీలకమైన హోం శాఖను సీఎం రేవంత్ రెడ్డి తన దగ్గర పెట్టుకున్నారు. శాంతిభద్రతలను ఆయనే పర్యవేక్షిస్తున్నారు. అయితే తరచుగా…

5 hours ago

కేసీఆర్ వరకు వెళ్లిన సీతక్క పంచాయితీ

తెలంగాణలో అధికార పార్టీ కాంగ్రెస్ కు చెందిన మహిళా నేత, సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి కేబినెట్ లో కీలక…

6 hours ago