Movie News

రానా పట్టుబడితే రీమేక్ అవ్వాల్సిందే

ఏదైనా భాషలో హిట్టయిన సినిమాను వీలైనంత త్వరగా రీమేక్ చేసుకుంటేనే సేఫ్. లేదంటే సబ్ టైటిల్స్ పెట్టుకుని ఆడియన్స్ ఓటిటిలో చూసేస్తే ఉన్న థ్రిల్ కాస్తా తగ్గిపోతుంది. గాడ్ ఫాదర్, భీమ్లా నాయక్ లాంటి స్టార్ హీరోల చిత్రాలు అందుకే ఆశించినంత పెద్ద రేంజ్ కి వెళ్లలేకపోయాయి.

2021లో కోలీవుడ్ నుంచి మానాడు వచ్చింది. పెద్ద సక్సెస్. రేసులో వెనుకబడ్డ శింబుకి కొత్త లైఫ్ ఇచ్చింది. ముఖ్యంగా ఆర్టిస్టుగా ఎస్జె సూర్య పెద్ద స్థాయికి వెళ్లేందుకు దోహదపడింది. ఓటిటిలో తెలుగు డబ్బింగ్ తో పాటు అందుబాటులోకి వచ్చాక మన ఆడియన్స్ భారీ సంఖ్యలో చూశారు. అంత పెద్ద రీచ్ ఉంది దీనికి.

మానాడు రీమేక్ హక్కులు సురేష్ సంస్థ ఎప్పుడో కొనుగోలు చేసింది. కానీ హీరో దర్శకుడు దొరక్క వాయిదా పెడుతూ వచ్చారు. సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ ఇలా రెండు మూడు పేర్లు వినిపించాయి కానీ అవేవి కార్యరూపం దాల్చలేదు.

ఒకదశలో రవితేజ దగ్గరకు కూడా వెళ్లిందన్నారు కానీ అదంతా పుకారు స్టేజి దగ్గరే ఆగిపోయింది. కట్ చేస్తే ఇప్పుడీ మానాడుని ముందు హిందీలో తీసే ప్లానింగ్ లో ఉన్నాడు రానా. ఆకాశవాణితో దర్శకుడిగా రుజువు చేసుకున్న అశ్విన్ గంగరాజుతో తెరకెక్కించే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. హీరో ఎవరనేది ఇంకా తేలలేదు కానీ క్యాస్టింగ్ పనులు మొదలుపెట్టలేదట.

మరి తెలుగులో తీస్తారా లేదానేది అనుమానంగానే ఉంది. టైం లూప్ కాన్సెప్ట్ ఆధారంగా ఒక సామాన్యుడికి, పోలీస్ ఆఫీసర్ కు మధ్య జరిగే పొలిటికల్ డ్రామాగా రూపొందిన ఈ థ్రిల్లర్ కి దర్శకుడు వెంకట్ ప్రభు. ఫామ్ కోల్పోయిన ఆయనకు నాగచైతన్య, విజయ్ లు ఆఫర్లు ఇచ్చేలా చేసింది మానాడునే.

ఇంత ట్రాక్ రికార్డు ఉన్న బ్లాక్ బస్టర్ త్వరగా రీమేక్ అయ్యుంటే బాగుండేది. సౌత్ లో ఆడిన సినిమాలన్నీ హిందీ రీమేక్ లో ఆడతాయనే గ్యారెంటీ లేదు. జెర్సీ, హిట్ ది ఫస్ట్ కేస్, అల వైకుంఠపురములో లాంటివి దారుణంగా పోయాయి. అందుకే రానా నార్త్ ఆడియన్స్ కు తగ్గట్టు కీలక మార్పులు చేయించాడట. 

This post was last modified on October 18, 2024 9:30 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

నియోజ‌క‌వ‌ర్గాల‌పై రేవంత్ కొత్త ఫార్ములా… వ‌ర్కువ‌ట్ అయ్యేనా?

2029 పార్ల‌మెంటు ఎన్నిక‌ల నాటికి దేశంలో నియోజ‌క‌వ‌ర్గాల‌ను పున‌ర్విభ‌జించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం ల‌క్ష్యంగా పెట్టుకున్న విష‌యం తెలిసిందే. ఇటు అసెంబ్లీ,…

2 hours ago

పెను సంక్షోభంలో ప్ర‌పంచం…!

అమెరికా - ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న చర్చల ప్రతిష్టంభ‌న ప్రపంచ దేశాలను పెను సంక్షోభంలోకి నెట్టే దిశగా మారుతోందా?…

3 hours ago

రాష్ట్ర‌ప‌తికి బహుమతిగా మంగళగిరి చీర

భార‌త రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌దిముర్ముతో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ భేటీ అయ్యారు. పార్టీకి చెందిన…

3 hours ago

ఏపీ కొత్త ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌… వైసీపీకి షాకేనా?

ఏపీ రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం క‌మిష‌న‌ర్ ప‌ద‌వి ఖాళీ అయింది. గ‌త నెల 31వ తేదీ వ‌ర‌కు ఉన్న రాష్ట్ర…

3 hours ago

‘హోం’ ప్రశ్నలపై ‘సీఎం’ సమాధానం చెప్తారా?

తెలంగాణలో కీలకమైన హోం శాఖను సీఎం రేవంత్ రెడ్డి తన దగ్గర పెట్టుకున్నారు. శాంతిభద్రతలను ఆయనే పర్యవేక్షిస్తున్నారు. అయితే తరచుగా…

5 hours ago

కేసీఆర్ వరకు వెళ్లిన సీతక్క పంచాయితీ

తెలంగాణలో అధికార పార్టీ కాంగ్రెస్ కు చెందిన మహిళా నేత, సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి కేబినెట్ లో కీలక…

6 hours ago