రాజమౌళికి కీరవాణి ఎలాగో సుకుమార్ కు కూడా దేవిశ్రీప్రసాద్ అలానే. ఈ కాంబినేషన్ లో ఏ సినిమా స్టార్ట్ చేసినా మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో అసలు మార్పు ఉండదని అందరికి తెలిసిన విషయమే. వీరి కలయికలో వచ్చే అవుట్ ఫుట్ కూడా సాలీడ్ గా ఉంటుంది. కెరీర్ మొదటి నుంచి కూడా ఈ బంధానికి బ్రేకులు పడలేదు అంటే వారి బాండింగ్ ఎంత బలంగా ఉందొ అర్థం చేసుకోవచ్చు.
ఇక దేవిశ్రీప్రసాద్, సుకుమార్ తరువాత ఆ మధ్య కొరటాలతో కంటిన్యూగా సినిమాలు చేశాడు. అయితే ఆచార్యతో అది బ్రేక్ అయ్యింది. త్రివిక్రమ్ ఒక టైమ్ లో కంటిన్యూగా జర్నీ చేసినా ఆ తరువాత థమన్ కు షిఫ్ట్ అయిపోయాడు. ఇక సుకుమార్ టీమ్ లో ఉంటే యువ దర్శకులు అందరూ దేవికి చాలా క్లోజ్. ఉప్పెన వరకు కూడా సుకుమార్ శిష్యులు చేసే సినిమాలకు అతను మ్యూజిక్ చేస్తూ వచ్చాడు.
బడ్జెట్ తో సంబంధం లేకుండా కుమారి 21F లాంటి చిన్న సినిమాకు కూడా వర్క్ చేశాడు. కానీ ఉప్పెన తరువాత ఎందుకనో సుకుమార్ శిష్యులు సైతం రాక్ స్టార్ పై పెద్దగా ఫోకస్ చేసినట్లు అనిపించడం లేదు. ఆ చిత్ర దర్శకుడు బుచ్చిబాబు RC16 కోసం ఏకంగా రెహమాన్ ను తీసుకోవడం షాకింగ్ అనే చెప్పాలి. సుకుమార్ ప్రియ శిష్యులలో ఒకరైన శ్రీకాంత్ ఓదెల కూడా దసరా సినిమాకు దేవిని తీసుకోలేదు.
ఇక ఇప్పుడు నానితో మరో సినిమా సెట్టవ్వగా అనిరుధ్ ను తీసుకోవడం మరో షాకింగ్ న్యూస్. నిజానికి శ్రీకాంత్ ఈ సినిమాకు దేవిని తీసుకోవాలని అనుకున్నాడుట. కానీ ఏమైందో ఏమో గాని మళ్ళీ నిర్ణయం మారింది. ఏదేమైనా దేవి కాంబినేషన్ కనెక్షన్ లైన్స్ మెల్లగా కట్ అవుతున్నట్లు అనిపిస్తుంది. మరి పుష్ప 2 తరువాత అందరి ఫోకస్ తనపై పడేలా చేస్తాడో లేదో చూడాలి.
This post was last modified on October 17, 2024 9:49 am
పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన…
తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…
ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…
టీమ్ ఇండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ ఇంటర్నేషనల్ కెరీర్ దాదాపు ముగింపు దశకు చేరుకున్నట్లే కనిపిస్తోంది. గతేడాది జరిగిన…
రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…
సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…