రాజమౌళికి కీరవాణి ఎలాగో సుకుమార్ కు కూడా దేవిశ్రీప్రసాద్ అలానే. ఈ కాంబినేషన్ లో ఏ సినిమా స్టార్ట్ చేసినా మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో అసలు మార్పు ఉండదని అందరికి తెలిసిన విషయమే. వీరి కలయికలో వచ్చే అవుట్ ఫుట్ కూడా సాలీడ్ గా ఉంటుంది. కెరీర్ మొదటి నుంచి కూడా ఈ బంధానికి బ్రేకులు పడలేదు అంటే వారి బాండింగ్ ఎంత బలంగా ఉందొ అర్థం చేసుకోవచ్చు.
ఇక దేవిశ్రీప్రసాద్, సుకుమార్ తరువాత ఆ మధ్య కొరటాలతో కంటిన్యూగా సినిమాలు చేశాడు. అయితే ఆచార్యతో అది బ్రేక్ అయ్యింది. త్రివిక్రమ్ ఒక టైమ్ లో కంటిన్యూగా జర్నీ చేసినా ఆ తరువాత థమన్ కు షిఫ్ట్ అయిపోయాడు. ఇక సుకుమార్ టీమ్ లో ఉంటే యువ దర్శకులు అందరూ దేవికి చాలా క్లోజ్. ఉప్పెన వరకు కూడా సుకుమార్ శిష్యులు చేసే సినిమాలకు అతను మ్యూజిక్ చేస్తూ వచ్చాడు.
బడ్జెట్ తో సంబంధం లేకుండా కుమారి 21F లాంటి చిన్న సినిమాకు కూడా వర్క్ చేశాడు. కానీ ఉప్పెన తరువాత ఎందుకనో సుకుమార్ శిష్యులు సైతం రాక్ స్టార్ పై పెద్దగా ఫోకస్ చేసినట్లు అనిపించడం లేదు. ఆ చిత్ర దర్శకుడు బుచ్చిబాబు RC16 కోసం ఏకంగా రెహమాన్ ను తీసుకోవడం షాకింగ్ అనే చెప్పాలి. సుకుమార్ ప్రియ శిష్యులలో ఒకరైన శ్రీకాంత్ ఓదెల కూడా దసరా సినిమాకు దేవిని తీసుకోలేదు.
ఇక ఇప్పుడు నానితో మరో సినిమా సెట్టవ్వగా అనిరుధ్ ను తీసుకోవడం మరో షాకింగ్ న్యూస్. నిజానికి శ్రీకాంత్ ఈ సినిమాకు దేవిని తీసుకోవాలని అనుకున్నాడుట. కానీ ఏమైందో ఏమో గాని మళ్ళీ నిర్ణయం మారింది. ఏదేమైనా దేవి కాంబినేషన్ కనెక్షన్ లైన్స్ మెల్లగా కట్ అవుతున్నట్లు అనిపిస్తుంది. మరి పుష్ప 2 తరువాత అందరి ఫోకస్ తనపై పడేలా చేస్తాడో లేదో చూడాలి.
This post was last modified on October 17, 2024 9:49 am
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…