రాజమౌళికి కీరవాణి ఎలాగో సుకుమార్ కు కూడా దేవిశ్రీప్రసాద్ అలానే. ఈ కాంబినేషన్ లో ఏ సినిమా స్టార్ట్ చేసినా మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో అసలు మార్పు ఉండదని అందరికి తెలిసిన విషయమే. వీరి కలయికలో వచ్చే అవుట్ ఫుట్ కూడా సాలీడ్ గా ఉంటుంది. కెరీర్ మొదటి నుంచి కూడా ఈ బంధానికి బ్రేకులు పడలేదు అంటే వారి బాండింగ్ ఎంత బలంగా ఉందొ అర్థం చేసుకోవచ్చు.
ఇక దేవిశ్రీప్రసాద్, సుకుమార్ తరువాత ఆ మధ్య కొరటాలతో కంటిన్యూగా సినిమాలు చేశాడు. అయితే ఆచార్యతో అది బ్రేక్ అయ్యింది. త్రివిక్రమ్ ఒక టైమ్ లో కంటిన్యూగా జర్నీ చేసినా ఆ తరువాత థమన్ కు షిఫ్ట్ అయిపోయాడు. ఇక సుకుమార్ టీమ్ లో ఉంటే యువ దర్శకులు అందరూ దేవికి చాలా క్లోజ్. ఉప్పెన వరకు కూడా సుకుమార్ శిష్యులు చేసే సినిమాలకు అతను మ్యూజిక్ చేస్తూ వచ్చాడు.
బడ్జెట్ తో సంబంధం లేకుండా కుమారి 21F లాంటి చిన్న సినిమాకు కూడా వర్క్ చేశాడు. కానీ ఉప్పెన తరువాత ఎందుకనో సుకుమార్ శిష్యులు సైతం రాక్ స్టార్ పై పెద్దగా ఫోకస్ చేసినట్లు అనిపించడం లేదు. ఆ చిత్ర దర్శకుడు బుచ్చిబాబు RC16 కోసం ఏకంగా రెహమాన్ ను తీసుకోవడం షాకింగ్ అనే చెప్పాలి. సుకుమార్ ప్రియ శిష్యులలో ఒకరైన శ్రీకాంత్ ఓదెల కూడా దసరా సినిమాకు దేవిని తీసుకోలేదు.
ఇక ఇప్పుడు నానితో మరో సినిమా సెట్టవ్వగా అనిరుధ్ ను తీసుకోవడం మరో షాకింగ్ న్యూస్. నిజానికి శ్రీకాంత్ ఈ సినిమాకు దేవిని తీసుకోవాలని అనుకున్నాడుట. కానీ ఏమైందో ఏమో గాని మళ్ళీ నిర్ణయం మారింది. ఏదేమైనా దేవి కాంబినేషన్ కనెక్షన్ లైన్స్ మెల్లగా కట్ అవుతున్నట్లు అనిపిస్తుంది. మరి పుష్ప 2 తరువాత అందరి ఫోకస్ తనపై పడేలా చేస్తాడో లేదో చూడాలి.
This post was last modified on October 17, 2024 9:49 am
స్టార్ లెగసి సృష్టించి పెట్టిన తండ్రి వారసత్వాన్ని మోస్తున్న హీరోలకు దాన్ని కాపాడుకోవడం అంత సులభం కాదు. బాలకృష్ణ, నాగార్జున…
వైసీపీ హయాంలో టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి జరిగిన ఘటన సంచలనం రేపిన సంగతి తెలిసిందే. వైసీపీ నేతలు దేవినేని…
2024 సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంతో పాటు ఏపీలో కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వాలు కొలువుదీరిన సంగతి తెలిసిందే. ఈ సారి…
కొన్ని శుక్రవారాలు సినీ ప్రియులకు చప్పగా అనిపిస్తాయి. కొత్త సినిమాల కోసం ఎదురు చూసే మూవీ లవర్స్ కు కళ్ళముందు…
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ పదవీ కాలం వచ్చే నెల 10వ తేదీతో ముగియనుంది. దీంతో, భారత…
టాలీవుడ్లో ఒకప్పుడు కథానాయికగా ఒక వెలుగు వెలిగింది ముంబయి భామ రకుల్ ప్రీత్. 2013లో ‘వెంకటాద్రి ఎక్స్ప్రెస్’ సినిమాతో కథానాయికగా…