‘బాహుబలి’ తర్వాత ‘పాన్ ఇండియా’ పేరుతో చాలా సినిమాలు వచ్చాయి. కానీ వాటిలో నిజంగా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను మెప్పించి విజయం సాధించిన సినిమాలు చాలా తక్కువ. కానీ పాన్ ఇండియా మీద పెద్దగా ఫోకస్ పెట్టకపోయినా.. అనూహ్యంగా ఆ స్థాయిలో ఆదరణ దక్కించుకుని ఘనవిజయం సాధించిన చిత్రాలున్నాయి. కేజీఎఫ్, పుష్ప, కాంతార, కార్తికేయ-2 లాంటి సినిమాలు అందుకు ఉదాహరణ.
వీటిలో కాంతార, కార్తికేయ-2 పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ కావడం పెద్ద షాకే. వీటికి కలిసొచ్చిన అంశం.. వాటిలో కథాంశం దేవుళ్లతో, హిందూ సంస్కృతితో ముడి పడి ఉండడం. ఆ తరహా చిత్రాలను ఇప్పుడు ప్రేక్షకులు బాగా ఇష్టపడుతున్నారు. భాషా భేదం లేకుండా వాటిని ఆదరిస్తున్నారు. అందుకే ఇటీవల కథల్లోకి ఈ అంశాలను జొప్పించే ప్రయత్నం జరుగుతోంది.
టాలీవుడ్లో లేటెస్ట్గా మొదలైన ‘అఖండ-2’ అనౌన్స్మెంట్ వీడియో చూస్తే.. దర్శకుడు బోయపాటి శ్రీను కూడా ట్రెండును బాగానే అర్థం చేసుకుంటున్నాడని అర్థమవుతోంది. ‘అఖండ’ మూవీని కూడా ఉత్తరాది ప్రేక్షకులు బాగానే చూశారు. ఓటీటీలో ఈ సినిమా రిలీజైనపుడు నార్త్ ఇండియాలో కూడా ట్రెండ్ అయింది. అందులో హీరో దైవాంశ సంభూతుడిగా కనిపిస్తాడు. హిందూ సంస్కృతి, దేవాలయాల గురించి పవర్ ఫుల్ డైలాగ్స్ ఉంటాయి. అవి మన ప్రేక్షకులకే కాక నార్త్ ఆడియన్స్కు కూడా నచ్చాయి. ఈ నేపథ్యంలోనే ‘అఖండ-2’లో ఈ అంశాలను మరింత ఎలివేట్ చేసే ప్రయత్నం జరుగుతున్నట్లు కనిపిస్తోంది. అనౌన్స్మెంట్ వీడియో అంతా కూడా దేవుడు, సంస్కృతి ప్రధానంగా సాగాయి.
ముహూర్తం షాట్లో బాలయ్య చెప్పిన డైలాగ్ కూడా శివుడి మీదే కావడం విశేషం. చూస్తుంటే ‘అఖండ-2’ను పాన్ ఇండియా లెవెల్లో బాగా ప్రమోట్ చేసి అక్కడ కూడా పెద్ద స్థాయిలో రిలీజ్ చేసేలా ఉన్నారు. కథాంశానికి అక్కడి ప్రేక్షకులు కనెక్ట్ అయ్యారంటే కాంతార, కార్తికేయ-2 తరహాలో పెద్ద సక్సెస్ కావడం ఖాయం.
This post was last modified on October 16, 2024 6:06 pm
ఒకప్పుడు అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోగా సుమంత్ కు మంచి ఫాలోయింగ్ ఉండేది. సత్యం, గౌరీ, గోదావరి లాంటి…
సౌత్ ఇండియన్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడైన దేవిశ్రీ ప్రసాద్ వయసు ప్రస్తుతం 46 ఏళ్లు. కానీ ఇంతలోనే అతను 27 ఏళ్ల…
ఎట్టకేలకు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల్లో గెలిచాడు. జులై 30 వ తేదీన బీహార్ ఉప ఎన్నికల్లో బంకీపూర్ నుంచి ఎన్నికల…
ఒకపెద్ద సినీ కుటుంబం నుంచి పరిచయం అయ్యే కొత్త హీరో మాస్ ఇమేజ్ కోసమే తపన పడతాడు. కానీ వరుణ్ తేజ్ మాత్రం…
భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఓ సంచలన తీర్పును వెలువరించింది. మారుతున్నకాలానికి అనుగుణంగా మనిషి జీవనయానంలోనూ మార్పులు చోటుచేసుకుంటూ వస్తోంటే... ఆ…
అదేంటో స్పైడర్ మ్యాన్ జ్వరం మనోళ్లకు ఓ రేంజ్ లో పట్టేసింది. భాషతో సంబంధం లేకుండా ముంబై నుంచి మచిలీపట్నం…