మ్యాచో స్టార్ గోపిచంద్ మొదట హీరోగానే ఎంట్రీ ఇచ్చినప్పటికీ రెండవ అడుగు మాత్రం ప్రతినాయకుడి పాత్రల వైపు మళ్లింది. విలన్ గా ఓ మూడు సినిమాలు చేసిన తరువాత హీరోగా ఎన్నో సినిమాలు చేశాడు. కానీ ప్రేక్షకులను మాత్రం ఎక్కువగా హుక్ చేసింది నెగెటివ్ రోల్స్ తోనే. జయం సినిమా రీమేక్ చేయగా ఆ పాత్రకు గోపి తప్ప మరొకరు సెట్ కారని, తమిళ్ వెర్షన్ లో కూడా అతన్నే తీసుకున్నారు. ఆ రేంజ్ లో ఇంపాక్ట్ చూపించిన గోపి.. వర్షం, నిజం సినిమాలతో మరొక లెవెల్లో ఆకట్టుకున్నాడు.
‘ఒక్కడు’ విలన్ క్యారెక్టర్ కోసం కూడా మొదట గోపినే అనుకున్నారు. కానీ అదే టైమ్ లో మహేష్ నిజం సెట్స్ పై ఉండడం వలన సేమ్ కాంబినేషన్ అని రిపీట్ చేయలేదు. విలన్ గా పర్ఫెక్ట్ యాక్టర్ అనిపించుకున్న గోపి ఆ తరువాత యజ్ఞం, లక్ష్యం, రణం, శౌర్యం, సాహసం, లౌక్యం అంటూ మాస్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు.
అయితే గోపిచంద్ ఈ మధ్య కాలంలో హీరోగా చేసిన ఏ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద పెద్దగా క్లిక్కవ్వలేదు. ఇక గోపి అప్పుడప్పుడు గౌతమ్ నందా లాంటి డిఫరెంట్ కథలు కూడా సెలెక్ట్ చేసుకుంటున్నాడు. కానీ ఆ కథలతోనూ రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ లోనే వెళుతుండడం వలన కెరీర్ కు అదే మైనస్ గా మారింది అనే భావన కూడా ఉంది. ఇక ఇప్పుడు ‘విశ్వం’తో స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇవ్వాలి అనుకుంటున్నాడు. అయితే విలన్ గా ఎందుకు చేయడం లేదనే.. కామెంట్స్ కు గోపి సమాధానం ఇచ్చారు.
చేయాలనే ఆలోచన ఉన్నప్పటికీ సరైన కథ, క్యారెక్టర్ తగలడం లేదని ఓపెన్ గా చెప్పాడు. ‘నేను విలన్ గా చేసిన సినిమాలోని క్యారెక్టర్స్ చూసుకుంటే హీరోలతో సమానంగా పవర్ఫుల్ గా ఉంటాయి. ఆ క్యారెక్టర్స్ ఇంపాక్ట్ వల్లే నేను హీరోగా చేసినప్పటికీ ఆడియెన్స్ ఆదరించారు. అలాగే నటుడిగా అప్పుడు నేను నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ సినిమాలు చేశాను. ఏదేమైనా ఇప్పుడు కూడా అలాంటి క్యారెక్టర్స్ వస్తే చేయడానికి ఇబ్బంది లేదు. కానీ క్యారెక్టర్ కూడా హుక్ చేసే విధంగా ఉండాలి. మంచి క్యారెక్టర్ వస్తే చేయడానికి సిద్ధమే..’ అంటూ గోపి ఓ క్లారిటీ ఇచ్చాడు. అలాగే మరోసారి ప్రభాస్ తో ఛాన్స్ వస్తే, విలన్ గా నటించేందుకు రెడీ అంటూ ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. మరి గోపికి కనెక్ట్ అయ్యే విలన్ వేషాలు ఎప్పుడు వస్తాయో చూడాలి.
This post was last modified on October 16, 2024 1:44 pm
స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ హీరో అవుతాడని చాలా ఏళ్ల ముందే ప్రచారం జరిగింది. సుకుమార్ లాంటి అగ్ర…
రాష్ట్రంలో ప్రతిపక్షం.. బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్.. ప్రజలుకడుతున్న పన్నులతో…
ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…
వైసీపీ అధినేత జగన్పై ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి నిప్పులు చెరిగారు. 'అన్న'…
దేశంలో విమానయాన సంస్థల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న…