పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గత ఏడాది మూడు సినిమాలను పెండింగ్లో పెట్టి రాజకీయాల్లో బిజీ అయిపోయాడు. దాదాపు ఏడాది నుంచి ఆయన సినిమాల చిత్రీకరణలు జరగట్లేదు. ఎన్నికల ఫలితాలు వచ్చాక పవన్ ఏకంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయిపోవడంతో బాధ్యతలు పెరిగిపోయాయి. వెంటనే సినిమాల గురించి ఆలోచించే పరిస్థితి లేకపోయింది. ప్రభుత్వం ఏర్పాటై నాలుగు నెలలు గడిచింది. ఇప్పుడే కొంచెం తీరిక చేసుకుని మళ్లీ షూటింగ్కు హాజరు కావడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఐతే ఆయన తిరిగి ఏ చిత్రాన్ని పట్టాలెక్కిస్తాడు అనే విషయంలో ఉత్కంఠ నెలకొంది.
ఓవైపు ‘హరిహర వీరమల్లు’, మరోవైపు ‘ఓజీ’ చిత్రాలు షూట్కు సన్నాహాలు చేసుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. కొన్ని రోజుల కిందటే ‘హరిహర వీరమల్లు’ టీం కొత్త షెడ్యూల్ గురించి అప్డేట్ ఇచ్చింది. తాజాగా ‘ఓజీ’ టీం నుంచి కూడా అలాంటి అప్డేటే వచ్చింది.
‘ఓజీ’ సినిమాకు ఛాయాగ్రహణం అందిస్తున్న లెజెండరీ సినిమాటోగ్రాఫర్ రవివర్మన్.. తాను తిరిగి ‘ఓజీ’ షూట్కు వచ్చేసినట్లు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. చాలా బిజీగా ఉండే రవివర్మన్.. ఇలా అప్డేట్ ఇచ్చాడు అంటే షూట్ పున:ప్రారంభం అవుతున్నట్లే భావించాలి. బహుశా ప్రస్తుతం చిత్రీకరణకు ఏర్పాట్లు జరుగుతుండొచ్చు. రవివర్మన్ అందులో బిజీగా ఉండొచ్చు. పవన్ ఒకట్రెండు రోజుల్లో చిత్రీకరణలో పాల్గొంటాడని భావిస్తున్నారు. కొన్ని రోజుల ముందు వరకు గుబురు గడ్డంతో కనిపించిన పవన్.. తాజాగా ఆ గడ్డంతో పాటు జుట్టునూ తగ్గించాడు. ఆ లుక్ చూస్తే అది ‘ఓజీ’ కోసమే అయి ఉంటుందని భావిస్తున్నారు.
పవన్ ప్రస్తుతం డిప్యూటీ సీఎం కాబట్టి.. ఆయన మళ్లీ చిత్రీకరణలో పాల్గొంటున్న విషయం గురించి ఆయా చిత్ర బృందాలు మరీ హడావుడి చేస్తే కష్టం. అది జనాలకు రాంగ్ సిగ్నల్స్ ఇస్తుంది. కాబట్టి పవన్ కూడా తన టీం ఎక్కువ హడావుడి చేయకుండా సైలెంట్గా షూటింగ్ చేసి రావడానికే ప్రాధాన్యమిస్తుండొచ్చు. పవన్ అధికారిక, రాజకీయ కార్యకలాపాలకు ఎక్కువ ఇబ్బంది రాకుండా షూట్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
This post was last modified on October 16, 2024 11:34 am
ఒక పెద్ద సినీ కుటుంబానికి చెందిన కొత్త కుర్రాడు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుంటే.. డెబ్యూ మూవీ చేస్తుండగానే వేరే చిత్రాలు…
కోనసీమ కొబ్బరి తోటలకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ…
ఒకప్పుడు ఏపీలో హెచ్ ఐవీ ఎక్కువగా ఉండేది. హైవేల పక్కన ఎక్కువ కండోమ్ లు కనపడేవి అని సీఎం చంద్రబాబు…
ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సీఎం చంద్రబాబు విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను ఆ పదవి నుంచి బర్తరఫ్ చేయాలని సీపీఐ సీనియర్ నేత నారాయణ డిమాండ్…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. త్వరలోనే మరో 40 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు తెలిపారు.…