పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గత ఏడాది మూడు సినిమాలను పెండింగ్లో పెట్టి రాజకీయాల్లో బిజీ అయిపోయాడు. దాదాపు ఏడాది నుంచి ఆయన సినిమాల చిత్రీకరణలు జరగట్లేదు. ఎన్నికల ఫలితాలు వచ్చాక పవన్ ఏకంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయిపోవడంతో బాధ్యతలు పెరిగిపోయాయి. వెంటనే సినిమాల గురించి ఆలోచించే పరిస్థితి లేకపోయింది. ప్రభుత్వం ఏర్పాటై నాలుగు నెలలు గడిచింది. ఇప్పుడే కొంచెం తీరిక చేసుకుని మళ్లీ షూటింగ్కు హాజరు కావడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఐతే ఆయన తిరిగి ఏ చిత్రాన్ని పట్టాలెక్కిస్తాడు అనే విషయంలో ఉత్కంఠ నెలకొంది.
ఓవైపు ‘హరిహర వీరమల్లు’, మరోవైపు ‘ఓజీ’ చిత్రాలు షూట్కు సన్నాహాలు చేసుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. కొన్ని రోజుల కిందటే ‘హరిహర వీరమల్లు’ టీం కొత్త షెడ్యూల్ గురించి అప్డేట్ ఇచ్చింది. తాజాగా ‘ఓజీ’ టీం నుంచి కూడా అలాంటి అప్డేటే వచ్చింది.
‘ఓజీ’ సినిమాకు ఛాయాగ్రహణం అందిస్తున్న లెజెండరీ సినిమాటోగ్రాఫర్ రవివర్మన్.. తాను తిరిగి ‘ఓజీ’ షూట్కు వచ్చేసినట్లు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. చాలా బిజీగా ఉండే రవివర్మన్.. ఇలా అప్డేట్ ఇచ్చాడు అంటే షూట్ పున:ప్రారంభం అవుతున్నట్లే భావించాలి. బహుశా ప్రస్తుతం చిత్రీకరణకు ఏర్పాట్లు జరుగుతుండొచ్చు. రవివర్మన్ అందులో బిజీగా ఉండొచ్చు. పవన్ ఒకట్రెండు రోజుల్లో చిత్రీకరణలో పాల్గొంటాడని భావిస్తున్నారు. కొన్ని రోజుల ముందు వరకు గుబురు గడ్డంతో కనిపించిన పవన్.. తాజాగా ఆ గడ్డంతో పాటు జుట్టునూ తగ్గించాడు. ఆ లుక్ చూస్తే అది ‘ఓజీ’ కోసమే అయి ఉంటుందని భావిస్తున్నారు.
పవన్ ప్రస్తుతం డిప్యూటీ సీఎం కాబట్టి.. ఆయన మళ్లీ చిత్రీకరణలో పాల్గొంటున్న విషయం గురించి ఆయా చిత్ర బృందాలు మరీ హడావుడి చేస్తే కష్టం. అది జనాలకు రాంగ్ సిగ్నల్స్ ఇస్తుంది. కాబట్టి పవన్ కూడా తన టీం ఎక్కువ హడావుడి చేయకుండా సైలెంట్గా షూటింగ్ చేసి రావడానికే ప్రాధాన్యమిస్తుండొచ్చు. పవన్ అధికారిక, రాజకీయ కార్యకలాపాలకు ఎక్కువ ఇబ్బంది రాకుండా షూట్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
కాపు ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు ముగిశాయి. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని ఆయన ఇంటి ప్రాంగణంలోనే…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. ముంబైలోని కోకిలా బెన్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి..…
కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బుధవారం ఉదయం ముద్రగడను…
లెనిన్ సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. వీక్ డేస్ లో నెమ్మదించినప్పటికీ చాలా ఏరియాలలో బ్రేక్ ఈవెన్ దాటేసి లాభాలు…
ఏపీ మాజీ సీఎం జగన్ పై టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి నారా లోకేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.…
‘సప్తసాగరాలు దాటి’ చిత్రంలో తన అందం, అభినయంతో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది రుక్మిణి వసంత్. ఆ సినిమాలో రుక్మిణిని చూసిన…