Health

నాగార్జున 2 ఎక‌రాలు ఇచ్చారు-రేవంత్ రెడ్డి

తెలంగాణ‌లో రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక అక్ర‌మ క‌ట్ట‌డాల‌పై ఉక్కుపాదం మోప‌డం.. ఈ క్ర‌మంలో గ‌త ఏడాది హైద‌రాబాద్‌లో అక్కినేని నాగార్జున‌కు చెందిన ఎన్ క‌న్వెన్ష‌న్‌ను కూల్చేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారిన సంగ‌తి తెలిసిందే. నాగార్జున‌ను కావాల‌నే రేవంత్ టార్గెట్ చేశారంటూ ఓ వ‌ర్గం ఆయ‌న‌పై మండిప‌డితే.. ప్ర‌భుత్వం స‌రైన ప‌నే చేసిందంటూ ఇంకో వ‌ర్గం వాదించింది. దీనిపై నాగార్జున త‌ర్వాతి రోజుల్లో ఎలా స్పందిస్తాడా.. కోర్టులో ఎలా పోరాడ‌తాడా అని అంద‌రూ ఆస‌క్తిగా ఎదురు చూశారు. ఐతే నెమ్మ‌దిగా వ్య‌వ‌హారం స‌ద్దుమ‌ణిగిపోయింది. ఇటీవ‌ల త‌న కొడుకు పెళ్లికి ఆహ్వానించ‌డానికి.. త‌ర్వాత మిస్ ఇండియా ఈవెంట్ సంద‌ర్భంగా రేవంత్‌ను క‌లిసి ఆయ‌న‌తో స‌న్నిహితంగా క‌నిపించారు నాగ్.

కాగా ఇప్పుడు సీఎం రేవంత్ నాగార్జున గురించి ఒక కార్య‌క్ర‌మంలో మాట్లాడుతూ ప్ర‌శంస‌లు కురిపించ‌డం అంద‌రి దృష్టినీ ఆక‌ర్షించింది. హైడ్రా ఆధ్వ‌ర్యంలో అక్ర‌మ క‌ట్ట‌డాల కూల్చి వేత గురించి సీఎం రేవంత్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. గ‌త ఏడాది నాగార్జున‌కు చెందిన ఎన్ క‌న్వెన్ష‌న్‌ను చెరువు ప‌రిధిలో ఉంద‌నే కూల్చివేశామ‌ని రేవంత్ స్ప‌ష్టం చేశారు. ఆ స‌మ‌యంలో చాలామంది విమ‌ర్శ‌లు చేశార‌ని ఆయ‌న గుర్తు చేసుకున్నారు.

ఐతే ప్ర‌భుత్వం మంచి ఉద్దేశంతోనే ఈ ప‌ని చేసింద‌ని అర్థం చేసుకున్న నాగార్జున‌.. త‌ర్వాత అక్క‌డున్న రెండు ఎక‌రాల స్థలాన్ని ప్ర‌భుత్వానికి ఇచ్చేసి త‌న పెద్ద మ‌న‌సును చాటుకున్నార‌ని కొనియాడారు రేవంత్ రెడ్డి. అక్ర‌మ క‌ట్ట‌డాల కూల్చివేత విష‌యంలో త‌మ‌ది రాజీ లేని విధానం అని రేవంత్ స్ప‌ష్టం చేశారు. హైద‌రాబాద్ ప‌రిధిలోని బ‌తుక‌మ్మ కుంట‌లో ఆరు ఎక‌రాల స్థ‌లాన్ని బీఆర్ఎస్ నేత‌లు క‌బ్జా చేసుకున్నార‌ని.. దాని మీద కాంగ్రెస్ నేత‌లు ఎప్ప‌ట్నుంచో పోరాడుతున్నార‌ని… ఆ స్థ‌లాన్ని కూడా ప్ర‌భుత్వం స్వాధీనం చేసుకుని ప్ర‌జ‌ల‌కు ఉప‌యోగ‌ప‌డేలా చేస్తోంద‌ని ఆయ‌న‌న్నారు.

This post was last modified on June 29, 2025 10:52 am

Share

Recent Posts

సోనియా వందేమాతరాన్ని ఆపమన్నారా

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి వచ్చిన ఒక వీడియో ఇప్పుడు వివాదానికి కేంద్రంగా మారింది.…

51 minutes ago

`కాక్రోచ్‌`లు మ‌ళ్లీ ప‌ని మొద‌లు పెట్టేశారు…

కాక్రోచ్ జ‌న‌తా పార్టీ(సీజేపీ) అధినేత అభిజిత్ దీప్కే ఇటీవ‌ల ప్ర‌క‌టించిన `పాఠ‌శాల‌ల అభివృద్ధి` కార్య‌క్ర‌మానికి 80వ స్వాతంత్ర దినోత్స‌వం వేడుక‌లే…

3 hours ago

జండా పండగ జరుపుకోలేదా జగన్?

స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశమంతా జాతీయ పతాకాన్ని ఎగరేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి లోని రాయపూడి గ్రౌండ్స్…

4 hours ago

అనుప‌మ ఆ రోజు ఏడ్చింది అందుకా?

గ‌త కొన్ని రోజులుగా మ‌ల‌యాళ క‌థానాయిక అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ బ్రేకప్ వ్య‌వ‌హారం సోష‌ల్ మీడియాలో చ‌ర్చ‌నీయాంశంగా మారిన సంగ‌తి తెలిసిందే.…

10 hours ago

తమిళ ప్రేక్షకుల ప్రేమ ఎందుకు తక్కువంటే

తాజాగా విడుదలైన విశ్వనాథ్ అండ్ సన్స్ తెలుగులో చూపిస్తున్న జోరు తమిళంలో ప్రదర్శించడం లేదన్నది వాస్తవం. ఓపెనింగ్స్ నెంబర్లు పోల్చుకుని…

10 hours ago

సోష‌ల్ మీడియా ఎటాక్… ఫరియా క‌న్నీళ్లు

జాతిర‌త్నాలు సినిమాతో మంచి గుర్తింపు సంపాదించి, తెలుగులో వ‌రుస‌గా సినిమాలు చేస్తున్న క‌థానాయిక‌.. ఫ‌రియా అబ్దుల్లా. థియేట‌ర్ బ్యాగ్రౌండ్ నుంచి…

13 hours ago