తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపడం.. ఈ క్రమంలో గత ఏడాది హైదరాబాద్లో అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ను కూల్చేయడం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. నాగార్జునను కావాలనే రేవంత్ టార్గెట్ చేశారంటూ ఓ వర్గం ఆయనపై మండిపడితే.. ప్రభుత్వం సరైన పనే చేసిందంటూ ఇంకో వర్గం వాదించింది. దీనిపై నాగార్జున తర్వాతి రోజుల్లో ఎలా స్పందిస్తాడా.. కోర్టులో ఎలా పోరాడతాడా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. ఐతే నెమ్మదిగా వ్యవహారం సద్దుమణిగిపోయింది. ఇటీవల తన కొడుకు పెళ్లికి ఆహ్వానించడానికి.. తర్వాత మిస్ ఇండియా ఈవెంట్ సందర్భంగా రేవంత్ను కలిసి ఆయనతో సన్నిహితంగా కనిపించారు నాగ్.
కాగా ఇప్పుడు సీఎం రేవంత్ నాగార్జున గురించి ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రశంసలు కురిపించడం అందరి దృష్టినీ ఆకర్షించింది. హైడ్రా ఆధ్వర్యంలో అక్రమ కట్టడాల కూల్చి వేత గురించి సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత ఏడాది నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ను చెరువు పరిధిలో ఉందనే కూల్చివేశామని రేవంత్ స్పష్టం చేశారు. ఆ సమయంలో చాలామంది విమర్శలు చేశారని ఆయన గుర్తు చేసుకున్నారు.
ఐతే ప్రభుత్వం మంచి ఉద్దేశంతోనే ఈ పని చేసిందని అర్థం చేసుకున్న నాగార్జున.. తర్వాత అక్కడున్న రెండు ఎకరాల స్థలాన్ని ప్రభుత్వానికి ఇచ్చేసి తన పెద్ద మనసును చాటుకున్నారని కొనియాడారు రేవంత్ రెడ్డి. అక్రమ కట్టడాల కూల్చివేత విషయంలో తమది రాజీ లేని విధానం అని రేవంత్ స్పష్టం చేశారు. హైదరాబాద్ పరిధిలోని బతుకమ్మ కుంటలో ఆరు ఎకరాల స్థలాన్ని బీఆర్ఎస్ నేతలు కబ్జా చేసుకున్నారని.. దాని మీద కాంగ్రెస్ నేతలు ఎప్పట్నుంచో పోరాడుతున్నారని… ఆ స్థలాన్ని కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ప్రజలకు ఉపయోగపడేలా చేస్తోందని ఆయనన్నారు.
This post was last modified on June 29, 2025 10:52 am
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…