తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపడం.. ఈ క్రమంలో గత ఏడాది హైదరాబాద్లో అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ను కూల్చేయడం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. నాగార్జునను కావాలనే రేవంత్ టార్గెట్ చేశారంటూ ఓ వర్గం ఆయనపై మండిపడితే.. ప్రభుత్వం సరైన పనే చేసిందంటూ ఇంకో వర్గం వాదించింది. దీనిపై నాగార్జున తర్వాతి రోజుల్లో ఎలా స్పందిస్తాడా.. కోర్టులో ఎలా పోరాడతాడా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. ఐతే నెమ్మదిగా వ్యవహారం సద్దుమణిగిపోయింది. ఇటీవల తన కొడుకు పెళ్లికి ఆహ్వానించడానికి.. తర్వాత మిస్ ఇండియా ఈవెంట్ సందర్భంగా రేవంత్ను కలిసి ఆయనతో సన్నిహితంగా కనిపించారు నాగ్.
కాగా ఇప్పుడు సీఎం రేవంత్ నాగార్జున గురించి ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రశంసలు కురిపించడం అందరి దృష్టినీ ఆకర్షించింది. హైడ్రా ఆధ్వర్యంలో అక్రమ కట్టడాల కూల్చి వేత గురించి సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత ఏడాది నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ను చెరువు పరిధిలో ఉందనే కూల్చివేశామని రేవంత్ స్పష్టం చేశారు. ఆ సమయంలో చాలామంది విమర్శలు చేశారని ఆయన గుర్తు చేసుకున్నారు.
ఐతే ప్రభుత్వం మంచి ఉద్దేశంతోనే ఈ పని చేసిందని అర్థం చేసుకున్న నాగార్జున.. తర్వాత అక్కడున్న రెండు ఎకరాల స్థలాన్ని ప్రభుత్వానికి ఇచ్చేసి తన పెద్ద మనసును చాటుకున్నారని కొనియాడారు రేవంత్ రెడ్డి. అక్రమ కట్టడాల కూల్చివేత విషయంలో తమది రాజీ లేని విధానం అని రేవంత్ స్పష్టం చేశారు. హైదరాబాద్ పరిధిలోని బతుకమ్మ కుంటలో ఆరు ఎకరాల స్థలాన్ని బీఆర్ఎస్ నేతలు కబ్జా చేసుకున్నారని.. దాని మీద కాంగ్రెస్ నేతలు ఎప్పట్నుంచో పోరాడుతున్నారని… ఆ స్థలాన్ని కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ప్రజలకు ఉపయోగపడేలా చేస్తోందని ఆయనన్నారు.
This post was last modified on June 29, 2025 10:52 am
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…
ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…
తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…
చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్లో మంచి క్రేజ్తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…
దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కలిసి సినిమా చేయాలని వాళ్లిద్దరి అభిమానులు ఎన్నో ఏళ్ల ముందు…