Health

తిన్న తర్వాత ఈ ఒక్క పని చేస్తే మీ ఆరోగ్యం పదిలం..

మనకు జీవితంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే. కానీ కొన్ని చిన్న అలవాట్లను మనం నిర్లక్ష్యం చేస్తుంటాము. ముఖ్యంగా భోజనం చేసిన వెంటనే పడుకునే అలవాటు చాలామందిలో ఉంది. అయితే ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇది మంచిది కాదని చెబుతున్నారు. ఎందుకంటే తిన్న వెంటనే నిద్రపోతే జీర్ణ సమస్యలు, బరువు పెరగడం, ఒత్తిడితో పాటు అనేక ఆరోగ్య సమస్యలు రావచ్చు.

రాత్రి భోజనం చేసిన తరువాత కనీసం పది నిమిషాలైనా నడవాలని వారు సూచిస్తున్నారు. లేకపోతే నిటారుగా కూర్చోవడం అవసరం. పడుకుంటే ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవచ్చు. ఫలితంగా అజీర్ణం, గ్యాస్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా రక్తంలో షుగర్ స్థాయిలు కూడా వేగంగా పెరిగే ప్రమాదం ఉంది. దీని వల్ల డయాబెటిస్ రావచ్చని హెచ్చరిస్తున్నారు.

తిన్న తర్వాత కొద్ది నిమిషాలు నడిస్తే ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. శరీరంలోని మెటబాలిజం వేగంగా పనిచేస్తుంది. ఫలితంగా తిన్న ఆహారం ఎనర్జీగా మారిపోతుంది. ఇది బరువు నియంత్రణకు సహాయపడుతుంది. మలబద్ధకం సమస్యలు ఉన్నవారికి వాకింగ్ చేయడం చాలా మంచిది. ఇది పేగుల పనితీరును మెరుగుపరచడంతో పాటు సహజ నిద్రకు కూడా తోడ్పడుతుంది.

తిన్న తరువాత రోజూ వాకింగ్ చేయడం అలవాటు చేసుకోవడం హార్ట్ హెల్త్ కు కూడా మంచిది. తిన్న తర్వాత పది నిమిషాలు నడవడం వల్ల మన శరీరంలోని రక్త ప్రసరణ మెరుగవుతుంది. ఇలా చేయడం వల్ల ఒత్తిడి తగ్గి మనసు హాయిగా మారుతుంది. మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గిపోతాయి. బీపీ సమస్యతో బాధపడేవారికి ఇది ఎంతో ఉపయోగకరం.

తిన్న వెంటనే పడుకుంటే నిద్ర సరిగా రాదు. శరీరం జీర్ణక్రియపై పనిచేస్తుండడంతో నిద్రలో అంతరాయం కలుగుతుంది. కానీ వాకింగ్ చేయడం వల్ల శరీరానికి విశ్రాంతి లభిస్తుంది. శరీరం రిలాక్స్ అవుతుంది. మంచి నిద్ర వస్తుంది. ప్రత్యేకంగా డయాబెటిస్ , నిద్రలేమి లాంటి సమస్యలు ఉన్నవారు ఈ అలవాటు తప్పనిసరిగా పెట్టుకోవాలి. తిన్న తర్వాత నడవడం వల్ల లాభాలే తప్ప నష్టాలు లేవు. కనుక ప్రతి ఒక్కరూ దీన్ని అలవాటుగా మార్చుకోవడం ఆరోగ్యంగా జీవించడానికి సహాయపడుతుంది.

This post was last modified on April 16, 2025 9:20 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

59 minutes ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

1 hour ago

ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె చేతికి రింగ్ లేదేంటి?

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…

1 hour ago

కాసేపు క్లాస్ రూములో విద్యార్థులుగా మారిన చంద్రబాబు, లోకేష్

పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…

2 hours ago

పవన్ కల్యాణ్ హీరోగా… టీడీపీ ఎమ్మెల్యే నిర్మాతగా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…

3 hours ago

రష్యా vs ఉక్రెయిన్ – ఇండియా ఎవరివైపో చెప్పిన మోడీ

ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…

4 hours ago