Health

తిన్న తర్వాత ఈ ఒక్క పని చేస్తే మీ ఆరోగ్యం పదిలం..

మనకు జీవితంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే. కానీ కొన్ని చిన్న అలవాట్లను మనం నిర్లక్ష్యం చేస్తుంటాము. ముఖ్యంగా భోజనం చేసిన వెంటనే పడుకునే అలవాటు చాలామందిలో ఉంది. అయితే ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇది మంచిది కాదని చెబుతున్నారు. ఎందుకంటే తిన్న వెంటనే నిద్రపోతే జీర్ణ సమస్యలు, బరువు పెరగడం, ఒత్తిడితో పాటు అనేక ఆరోగ్య సమస్యలు రావచ్చు.

రాత్రి భోజనం చేసిన తరువాత కనీసం పది నిమిషాలైనా నడవాలని వారు సూచిస్తున్నారు. లేకపోతే నిటారుగా కూర్చోవడం అవసరం. పడుకుంటే ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవచ్చు. ఫలితంగా అజీర్ణం, గ్యాస్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా రక్తంలో షుగర్ స్థాయిలు కూడా వేగంగా పెరిగే ప్రమాదం ఉంది. దీని వల్ల డయాబెటిస్ రావచ్చని హెచ్చరిస్తున్నారు.

తిన్న తర్వాత కొద్ది నిమిషాలు నడిస్తే ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. శరీరంలోని మెటబాలిజం వేగంగా పనిచేస్తుంది. ఫలితంగా తిన్న ఆహారం ఎనర్జీగా మారిపోతుంది. ఇది బరువు నియంత్రణకు సహాయపడుతుంది. మలబద్ధకం సమస్యలు ఉన్నవారికి వాకింగ్ చేయడం చాలా మంచిది. ఇది పేగుల పనితీరును మెరుగుపరచడంతో పాటు సహజ నిద్రకు కూడా తోడ్పడుతుంది.

తిన్న తరువాత రోజూ వాకింగ్ చేయడం అలవాటు చేసుకోవడం హార్ట్ హెల్త్ కు కూడా మంచిది. తిన్న తర్వాత పది నిమిషాలు నడవడం వల్ల మన శరీరంలోని రక్త ప్రసరణ మెరుగవుతుంది. ఇలా చేయడం వల్ల ఒత్తిడి తగ్గి మనసు హాయిగా మారుతుంది. మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గిపోతాయి. బీపీ సమస్యతో బాధపడేవారికి ఇది ఎంతో ఉపయోగకరం.

తిన్న వెంటనే పడుకుంటే నిద్ర సరిగా రాదు. శరీరం జీర్ణక్రియపై పనిచేస్తుండడంతో నిద్రలో అంతరాయం కలుగుతుంది. కానీ వాకింగ్ చేయడం వల్ల శరీరానికి విశ్రాంతి లభిస్తుంది. శరీరం రిలాక్స్ అవుతుంది. మంచి నిద్ర వస్తుంది. ప్రత్యేకంగా డయాబెటిస్ , నిద్రలేమి లాంటి సమస్యలు ఉన్నవారు ఈ అలవాటు తప్పనిసరిగా పెట్టుకోవాలి. తిన్న తర్వాత నడవడం వల్ల లాభాలే తప్ప నష్టాలు లేవు. కనుక ప్రతి ఒక్కరూ దీన్ని అలవాటుగా మార్చుకోవడం ఆరోగ్యంగా జీవించడానికి సహాయపడుతుంది.

This post was last modified on April 16, 2025 9:20 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

తారక్ పుట్టిన రోజు.. డబుల్ ధమాకా?

మే నెల వచ్చిందంటే నందమూరి అభిమానుల ఉత్సాహం మామూలుగా ఉండదు. లెజెండరీ నటుడు సీనియర్ ఎన్టీఆరే కాక ఆయన మనవడు జూనియర్…

8 hours ago

2027లో జగన్ 2.0 పాదయాత్ర అంట!

2024 సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన వైసీపీ ఇప్పుడప్పుడే కోలుకునేలా కనిపించడం లేదనే చెప్పాలి. అప్పటిదాకా 151 సీట్లతో…

9 hours ago

యుద్ధ స‌న్న‌ద్ధం:  రాష్ట్రాల‌కు కేంద్రం సంచ‌ల‌న ఆదేశాలు

భార‌త్‌-పాకిస్థాన్ ల మ‌ధ్య పెరుగుతున్న ఉద్రిక్త‌త‌లు ఏ క్ష‌ణ‌మైనా యుద్ధానికి దారితీయొచ్చ‌ని ర‌క్ష‌ణ రంగ నిపుణులు చెబుతు న్న స‌మ‌యంలో…

9 hours ago

ఇక తెలుగుదేశంలో ‘ ఏఐ ‘ హ‌వా మొద‌లైందా…!

తెలుగు దేశం పార్టీ నిర్వ‌హించే ప‌సుపు పండుగ మ‌హానాడుకు ఏర్పాట్లు ప్రారంభ‌మ‌య్యాయి. వైసీపీ అధినేత జ‌గ‌న్ సొంత జిల్లా క‌డ‌ప‌లో…

12 hours ago

‘సిరివెన్నెల’కు న్యాయం చేయలేకపోయా – త్రివిక్రమ్

సిరివెన్నెల సీతారామశాస్త్రి అంటే త్రివిక్రమ్‌కు ఎంత అభిమానమో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఒక సినీ వేడుకలో ఆయన సిరివెన్నెల గురించి…

13 hours ago

వీరమల్లు వస్తే ఎవరికి టెన్షన్

హరిహర వీరమల్లు షూటింగ్ కు ముగింపుకొచ్చేసింది. సెట్స్ లో నిన్నటి నుంచి పవన్ కళ్యాణ్ హాజరు కావడంతో టీమ్ ఉత్సహంగా…

13 hours ago