Health

మీ పిల్లలు లంచ్ బాక్స్ లో ఇవి పెడుతున్నారా? అయితే జాగ్రత్త…

పిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారం తినిపించడం ఈ రోజుల్లో పెద్ద సవాళుగా మారింది. తల్లిదండ్రులు ఎన్ని ప్రయత్నాలు చేసినా, పిల్లలు తమ ఇష్టమైన జంక్ ఫుడ్ తినడానికే ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తున్నారు. అయితే, పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని, సరైన పోషకాలను అందించే ఆహారాన్ని ఎంచుకోవడం చాలా ముఖ్యం.

ముఖ్యంగా, పాఠశాలకు వెళ్తున్న పిల్లల కోసం సరైన ఆహారం అందించకపోతే, వారి శారీరక..మానసిక ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. అందుకే, పిల్లల లంచ్ బాక్స్‌లో సరైన ఆహారం పెట్టడం తల్లిదండ్రుల బాధ్యతగా మారింది.

చాలా మంది తల్లిదండ్రులు పిల్లలు ఇష్టంగా తినే ఇన్‌స్టంట్ నూడుల్స్ లాంటి ఆహారాన్ని లంచ్ బాక్స్‌లో పెడుతుంటారు. ఇవి త్వరగా తయారవుతాయి, పిల్లలు తినడానికీ ఇష్టపడతారు. కానీ, ఇవి ఆరోగ్యానికి ఏమాత్రం మంచివి కావు. ఎందుకంటే, ఇన్‌స్టంట్ నూడుల్స్ ప్రాసెస్ చేసిన పిండితో తయారవుతాయి.

వీటిలో ఎక్కువగా కెమికల్స్, ఉప్పు, కృత్రిమ రుచులు ఉంటాయి. ఇవి పిల్లల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపించవచ్చు. ఉదయం తయారు చేసిన నూడుల్స్ మధ్యాహ్నం వరకూ తాజాగా ఉండవు, దాంతో పిల్లలు తినకుండా వదిలేయవచ్చు లేదా తిన్నా జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి, వీటి బదులుగా ఇంట్లో స్వచ్ఛంగా తయారు చేసిన పోషకాహారాన్ని ఇవ్వడం ఉత్తమం.

అలాగే, పిల్లలకు వేయించిన స్నాక్స్ ఇవ్వడం కూడా మంచిది కాదు. పిల్లలు సమోసా, చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ వంటి వాటిని చాలా ఇష్టంగా తింటారు. కానీ ఇవి ఎక్కువ నూనెతో తయారవుతాయి, అధిక కొవ్వును కలిగి ఉంటాయి. ఇవి పిల్లల బరువు పెరగడానికి కారణమవుతాయి. క్రమంగా జీర్ణ సమస్యలు, లివర్‌కు సంబంధిత సమస్యలు కూడా రావచ్చు. అందుకే, వేయించిన ఆహారం కాకుండా ఆరోగ్యకరమైన ఆహారాన్ని వారికి ఇవ్వాలి.

కొంతమంది ఆరోగ్యకరమైన అలవాటు అనే ఉద్దేశంతో పచ్చి కూరగాయలను ఎక్కువగా పిల్లలకు లంచ్ బాక్స్ లో పంపుతారు. అయితే ఇటువంటి రా వెజిటేబుల్స్ పిల్లలకు పెద్దగా సెట్ కావు. పిల్లలకు ఎప్పుడు కూడా స్టీమ్ చేసిన వెజిటేబుల్స్ ని పెట్టడమే మంచిది. లేకపోతే వారి జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది. మనం తినే వెజిటేబుల్స్ అలర్ట్ పిల్లలకు జీర్ణం అవ్వదు. కాబట్టి లంచ్ బాక్స్ లో ఎక్కువగా వెజిటేబుల్స్ అలౌడ్స్ కూడా పంపకూడదు.

పిల్లలు తీపి తినడాన్ని చాలా ఇష్టపడతారు. కానీ, అధిక చక్కెర ఉండే ఆహార పదార్థాలను వారికిచ్చినా ఆరోగ్యానికి హానికరమే. చాక్లెట్, క్యాండీ, కుకీస్, బేకరీ ఐటమ్స్ లాంటివి ఎక్కువగా తింటే, పిల్లల్లో క్యావిటీలు, ఒబేసిటీ వంటి సమస్యలు రావచ్చు.

బేకరీ పదార్థాల్లో కృత్రిమ రంగులు, అధిక చక్కెర ఉంటాయి, ఇవి ఆరోగ్యానికి మంచివి కావు. తీపి పదార్థాల బదులుగా, పిల్లలకు తాజా పండ్లు, తక్కువ చక్కెరతో చేసిన హోం మేడ్ ఆహారం ఇవ్వడం ఉత్తమం.

పిల్లలకు ప్యాక్ చేసిన ఆహారం, క్యాన్ డ్రింక్స్ కూడా మంచివి కావు. పిల్లలు బిస్కెట్లు, చిప్స్, బేకరీ పదార్థాలు తినాలనుకుంటారు. కానీ, ఇవి నెమ్మదిగా ఆరోగ్యాన్ని దెబ్బతీయగల హానికరమైన పదార్థాలతో తయారవుతాయి. వీటిలో పామాయిల్, అధిక ఉప్పు, కృత్రిమ రంగులు, ప్రిజర్వేటివ్‌లు ఉంటాయి.

ఇవి పిల్లల ఆరోగ్యంపై మెల్లగా ప్రభావం చూపుతాయి. అదే విధంగా, క్యాన్‌లలో వచ్చే కూల్ డ్రింక్స్, ప్యాక్ చేసిన జ్యూస్‌లు కూడా పిల్లల ఆరోగ్యానికి మంచివి కావు. వీటిలో అధిక చక్కెర మరియు ప్రిజర్వేటివ్‌లు ఉంటాయి, ఇవి పిల్లలకు గ్యాస్ట్రిక్ సమస్యలు, జీర్ణ సమస్యలు కలిగించవచ్చు.

కాబట్టి, పిల్లల ఆరోగ్యాన్ని కాపాడటానికి, లంచ్ బాక్స్‌లో సరైన ఆహారాన్ని పెట్టాలి. ఇంట్లో తయారు చేసిన ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు, తాజా పండ్లు, మెత్తగా ఉండే చిరుధాన్య లడ్డూలు, శరీరానికి శక్తిని ఇచ్చే పొట్టుగల ఆహారాన్ని ఇవ్వాలి. ఆరోగ్యకరమైన ఆహారం పిల్లల అభివృద్ధికి, శక్తికి తోడ్పడుతుంది. పిల్లల భవిష్యత్తును ఆరోగ్యంగా తీర్చిదిద్దే బాధ్యత తల్లిదండ్రులదే.

This post was last modified on February 3, 2025 11:05 am

Share
Published by
Kumar
Tags: KidsSnacks

Recent Posts

నిర్మాత గాయాలకు ‘టాక్సిక్’ మందు అవుతుందా

నిర్మాత దిల్ రాజు అన్నట్టు వందల సినిమాలు తీయకపోయినా కెవిఎన్ ప్రొడక్షన్స్ అనేది ఇప్పుడు అన్ని బాషల ఇండస్ట్రీలో హాట్…

46 minutes ago

కాకా… నిజంగా అలా తీస్తే

మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘కాాకా’ నుంచి ఇటీవల రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్ మెగా అభిమానులనే కాక సామాన్య…

1 hour ago

50 భాషల్లో వారణాసి… డబ్బింగ్ కోసం 1500 ఆర్టిస్టులు

కింగ్ సైజ్ ఫిలిం మేకర్ అని ఎవరికైనా బిరుదు ఇవ్వాల్సి వస్తే అందరి మదిలో మెదిలే ఒకే ఒక్క పేరు…

1 hour ago

రవితేజకు డబ్బులే డబ్బులు

మాస్ రాజా రవితేజ నిఖార్సయిన హిట్టు కొట్టి నాలుగేళ్లయింది. ఈ నాలుగేళ్లలో ఆయన ఆరు చిత్రాలతో పలకరించాడు. వీటిలో కొన్ని…

5 hours ago

దృశ్యం 4… ఇంకెన్నిసార్లు సాగదీస్తారో

ఏదైనా మితంగా తింటేనే అందం. మితిమీరిందా పొట్ట ఉబ్బిపోయి డాక్టర్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. తిండి సామెత సినిమాలకు కూడా…

5 hours ago

హైదరాబాద్ వచ్చిన జాంబీరెడ్డి ఏం చేయబోతున్నాడు

కరోనా తర్వాత థియేటర్స్ కి జనం మళ్ళీ వచ్చేలా చేసిన సినిమాల్లో జాంబీ రెడ్డి ఉంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ…

5 hours ago