పియర్ పండు, లేదా బేరిపండు, రుచిలో మధురమైనది మాత్రమే కాదు, ఆరోగ్యకరమైన అనేక ప్రయోజనాలను కూడా అందిస్తుంది. ఈ పండు పుష్కలంగా ఉండే పోషకాలు ఆరోగ్యానికి అనేక రకాల ప్రయోజనాలు కలిగిస్తాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. పియర్ లో ఫైబర్, విటమిన్లు, మినరల్స్, మరియు యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి, ఇవి మన ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి.
పియర్లో అధికమై ఉన్న ఫైబర్ ప్రేగుల ఆరోగ్యానికి మంచిది. దీనిని రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల మలబద్ధకం సమస్యలు తగ్గవచ్చు. కాన్స్టిట్యూషన్ తో బాధపడేవారు వారంలో రెండు మూడు సార్లు పియర్ జ్యూస్ లేదా పండు తినడం ద్వారా మంచి ఫలితాలు లభిస్తాయి.
దీనిలోని ఫైబర్ మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తుందనేది శాస్త్రీయంగా నిరూపించబడింది. అదేవిధంగా, రాగి కూడా పియర్లో సమృద్ధిగా ఉంటుంది, ఇది థైరాయిడ్ సమస్యను నియంత్రించడంలో సహాయపడుతుంది.
పియర్లోని పోషకాలు శరీరానికి అనేక రకాలుగా మేలు చేస్తాయి. దీని లోపల విటమిన్-B3, విటమిన్-B6 వంటి విటమిన్లు మెదడు అభివృద్ధికి సహాయపడతాయి. వీటితో పాటు ఫైబర్, ప్రోటీన్ సమృద్ధిగా ఉండడం వల్ల బరువు తగ్గాలి వారు ఈ పండును తప్పకుండా తీసుకోవాలి. పియర్ ఫ్రూట్స్ క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా బరువు అదుపులో ఉంటుంది.
పియర్లో పొటాషియం పుష్కలంగా ఉండటం వల్ల అధిక రక్తపోటు సమస్యలు తగ్గుతాయి. శరీరంలో రక్తప్రసరణ మెరుగుపడుతుంది. అలాగే, పియర్లోని పక్టిన్ అనే ఒక రకమైన ఫైబర్, కడుపు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఈ పండు జుట్టు, చర్మం ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
ఈ పండులో 6 గ్రాముల ఫైబర్ ఉంటుంది, ఇది మనం రోజూ తీసుకోవాల్సిన ఆహారపు ఫైబర్ అవసరాల్లో 21 శాతం సరిపోతుంది. అలాగే, పియర్ తొక్కలో ఉండే ఫైబర్ కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అందువల్ల, ఈ పండును పొట్టు తీయకుండా తినడం మంచిది. కాబట్టి, ఆరోగ్యమైన జీవనశైలికి, రుచికరమైన, పోషకాహారంగా సమృద్ధిగా ఉన్న పియర్ను రోజు ఆహారంలో చేర్చుకోండి.
గమనిక:
పైన ఇచ్చిన సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఏదైనా కొత్తది ప్రయత్నించే ముందు ఒకసారి మీ డాక్టర్ లేదా న్యూట్రిషన్ ను సంప్రదించడం మంచిది.
This post was last modified on February 3, 2025 10:23 am
త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు కీలక కసరత్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…
ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…
తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…
చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్లో మంచి క్రేజ్తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…