పియర్ పండు, లేదా బేరిపండు, రుచిలో మధురమైనది మాత్రమే కాదు, ఆరోగ్యకరమైన అనేక ప్రయోజనాలను కూడా అందిస్తుంది. ఈ పండు పుష్కలంగా ఉండే పోషకాలు ఆరోగ్యానికి అనేక రకాల ప్రయోజనాలు కలిగిస్తాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. పియర్ లో ఫైబర్, విటమిన్లు, మినరల్స్, మరియు యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి, ఇవి మన ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి.
పియర్లో అధికమై ఉన్న ఫైబర్ ప్రేగుల ఆరోగ్యానికి మంచిది. దీనిని రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల మలబద్ధకం సమస్యలు తగ్గవచ్చు. కాన్స్టిట్యూషన్ తో బాధపడేవారు వారంలో రెండు మూడు సార్లు పియర్ జ్యూస్ లేదా పండు తినడం ద్వారా మంచి ఫలితాలు లభిస్తాయి.
దీనిలోని ఫైబర్ మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తుందనేది శాస్త్రీయంగా నిరూపించబడింది. అదేవిధంగా, రాగి కూడా పియర్లో సమృద్ధిగా ఉంటుంది, ఇది థైరాయిడ్ సమస్యను నియంత్రించడంలో సహాయపడుతుంది.
పియర్లోని పోషకాలు శరీరానికి అనేక రకాలుగా మేలు చేస్తాయి. దీని లోపల విటమిన్-B3, విటమిన్-B6 వంటి విటమిన్లు మెదడు అభివృద్ధికి సహాయపడతాయి. వీటితో పాటు ఫైబర్, ప్రోటీన్ సమృద్ధిగా ఉండడం వల్ల బరువు తగ్గాలి వారు ఈ పండును తప్పకుండా తీసుకోవాలి. పియర్ ఫ్రూట్స్ క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా బరువు అదుపులో ఉంటుంది.
పియర్లో పొటాషియం పుష్కలంగా ఉండటం వల్ల అధిక రక్తపోటు సమస్యలు తగ్గుతాయి. శరీరంలో రక్తప్రసరణ మెరుగుపడుతుంది. అలాగే, పియర్లోని పక్టిన్ అనే ఒక రకమైన ఫైబర్, కడుపు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఈ పండు జుట్టు, చర్మం ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
ఈ పండులో 6 గ్రాముల ఫైబర్ ఉంటుంది, ఇది మనం రోజూ తీసుకోవాల్సిన ఆహారపు ఫైబర్ అవసరాల్లో 21 శాతం సరిపోతుంది. అలాగే, పియర్ తొక్కలో ఉండే ఫైబర్ కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అందువల్ల, ఈ పండును పొట్టు తీయకుండా తినడం మంచిది. కాబట్టి, ఆరోగ్యమైన జీవనశైలికి, రుచికరమైన, పోషకాహారంగా సమృద్ధిగా ఉన్న పియర్ను రోజు ఆహారంలో చేర్చుకోండి.
గమనిక:
పైన ఇచ్చిన సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఏదైనా కొత్తది ప్రయత్నించే ముందు ఒకసారి మీ డాక్టర్ లేదా న్యూట్రిషన్ ను సంప్రదించడం మంచిది.
This post was last modified on February 3, 2025 10:23 am
ఒకప్పుడు ఏపీలో హెచ్ ఐవీ ఎక్కువగా ఉండేది. హైవేల పక్కన ఎక్కువ కండోమ్ లు కనపడేవి అని సీఎం చంద్రబాబు…
ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సీఎం చంద్రబాబు విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను ఆ పదవి నుంచి బర్తరఫ్ చేయాలని సీపీఐ సీనియర్ నేత నారాయణ డిమాండ్…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. త్వరలోనే మరో 40 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు తెలిపారు.…
అన్ని పాదయాత్రలు సెంటిమెంటును రాజేస్తాయా.. అన్ని పాదయాత్రలు ఓటు బ్యాంకును దూసుకు వస్తాయా.. అంటే ఇప్పుడున్న పరిస్థితిలో చెప్పడం కష్టంగా…
ఏపీలో కూటమి ప్రభుత్వం ఓ పక్క సంక్షేమం, మరో పక్క రాష్ట్రాభివృద్ధిని బ్యాలెన్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. వృద్ధులు, ఒంటరి…