Bhakti

3 ల‌క్ష‌ల టిక్కెట్లు.. 15 నిమిషాలు..

3ల‌క్ష‌ల‌కు పైగా  టిక్కెట్లు..పావుగంటంటే పావుగంట‌లోనే..  ప్ర‌జ‌లుఎగ‌బ‌డి.. మ‌రీ.. వీటిని సొంతం చేసుకున్నారు. మ‌రి ఇదేమ‌న్నా.. జ‌క్కన్న రాజ‌మౌళి మూవీనా?  లేక‌.. వ‌చ్చే ఏడాది విడుద‌ల కానున్న ఆర్ ఆర్ ఆర్ మూవీకి సంబంధించిన టిక్కెట్లా.. అంటే.. కానేకాదు!  అఖిలాండ కోటి బ్ర‌హ్మాండ నాయ‌కుడైన తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకునేందుకు టీటీడీ ప్ర‌వేశ పెట్టిన స‌ర్వ‌ద‌ర్శనం టికెట్లు. కేవ‌లం 15 నిముషాల్లో.. దేశ‌వ్యాప్తంగా 3,10,000  మందికి పైగా.. స‌ర్వ‌ ద‌ర్శ‌నం టికెట్ల‌ను సొంతం చేసుకున్నారు. ఇది.. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న అన్ని రికార్డుల‌ను బ‌ద్ద‌లుకొట్టింద‌ని.. టీటీడీ వ‌ర్గాలు చెప్పాయి.

డిసెంబర్‌ నెలకు తిరుమల సర్వదర్శనం టికెట్లు.. ఆన్‌లైన్‌లో విడుదల చేసిన పది నిమిషాల్లోనే ఖాళీ అయ్యాయి. ఉదయం 9 గంటలకు తితిదే వెబ్‌సైట్‌లో డిసెంబర్ నెల సర్వదర్శనం కోటా టికెట్లు అందు బాటులో ఉంచారు. రోజుకు పది వేల టికెట్ల చొప్పున 3 లక్షలా 90 వేల టికెట్లను 15 నిమిషాల వ్యవధిలోనే భక్తులు బుక్‌ చేసుకున్నారు. వోటీపీ, వర్చువల్ క్యూ పద్ధతిలో టికెట్లు కేటాయించడంతో.. ప్రక్రియలో ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తలేదు. అలాగే రేపు ఉదయం 9 గంటలకు తిరుమలలో వసతికి సంబంధించిన టోకెన్లు కూడా విడుదల చేస్తామన్నారు.  

తిరుమల  టీటీడీ విడుదల చేసిన 3,10,000 శ్రీవారి సర్వదర్శనం టిక్కెట్లు కేవలం 16 నిమిషాల వ్యవధిలో నే బుక్ అయ్యి చరిత్ర సృష్టించాయి.  టిటిడి ఐటీ విభాగం మరియు జియో ప్లాట్ ఫార్మ్స్ లిమిటెడ్ మధ్య ఎంవోయూ కుదిర్చి క్లౌడ్ టెక్నాలజీని ద్వారా ప్రారంభించిన  ఆన్లైన్ బుకింగ్ మంచి ఫలితాన్ని  ఇవ్వడంపై శ్రీవారి భక్తుల నుంచి మంచి ప్రశంసలు వస్తున్నాయి. ఈ రోజు విడుదల చేసిన 3,10,000 సర్వ దర్శనం టికెట్లు కేవలం 16 నిమిషాల్లోనే బుక్ అవ్వడంతో మున్ముందు.. మ‌రిన్ని సాంకేతిక మాధ్య‌మాల‌ను వినియోగించుకునే దిశ‌గా టీటీడీ అడుగులు వేస్తుండ‌డం గ‌మ‌నార్హం. 

This post was last modified on November 27, 2021 2:10 pm

Share
Show comments

Recent Posts

ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయితే రచ్చే

రేపు రాత్రి ప్రీమియర్లతో విడుదల కాబోతున్న మన శంకరవరప్రసాద్ గారు మీద ఆల్రెడీ ఉన్న బజ్ మరింత పెరిగే దిశగా…

29 minutes ago

ప్రతిచోట చీపురు పట్టుకొని పవన్ ఊడవాలా?

పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన…

3 hours ago

విమర్శకులను పనితీరుతో కొడుతున్న లోకేష్..!

తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…

5 hours ago

రండి.. కూర్చుని మాట్లాడుకుందాం: ఏపీకి రేవంత్ రెడ్డి పిలుపు

ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…

5 hours ago

షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?

టీమ్ ఇండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ ఇంటర్నేషనల్ కెరీర్ దాదాపు ముగింపు దశకు చేరుకున్నట్లే కనిపిస్తోంది. గతేడాది జరిగిన…

5 hours ago

‘వైసీపీ చేసిన పాపాలను కడుగుతున్నాం’

రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…

14 hours ago