3లక్షలకు పైగా టిక్కెట్లు..పావుగంటంటే పావుగంటలోనే.. ప్రజలుఎగబడి.. మరీ.. వీటిని సొంతం చేసుకున్నారు. మరి ఇదేమన్నా.. జక్కన్న రాజమౌళి మూవీనా? లేక.. వచ్చే ఏడాది విడుదల కానున్న ఆర్ ఆర్ ఆర్ మూవీకి సంబంధించిన టిక్కెట్లా.. అంటే.. కానేకాదు! అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు టీటీడీ ప్రవేశ పెట్టిన సర్వదర్శనం టికెట్లు. కేవలం 15 నిముషాల్లో.. దేశవ్యాప్తంగా 3,10,000 మందికి పైగా.. సర్వ దర్శనం టికెట్లను సొంతం చేసుకున్నారు. ఇది.. ఇప్పటి వరకు ఉన్న అన్ని రికార్డులను బద్దలుకొట్టిందని.. టీటీడీ వర్గాలు చెప్పాయి.
డిసెంబర్ నెలకు తిరుమల సర్వదర్శనం టికెట్లు.. ఆన్లైన్లో విడుదల చేసిన పది నిమిషాల్లోనే ఖాళీ అయ్యాయి. ఉదయం 9 గంటలకు తితిదే వెబ్సైట్లో డిసెంబర్ నెల సర్వదర్శనం కోటా టికెట్లు అందు బాటులో ఉంచారు. రోజుకు పది వేల టికెట్ల చొప్పున 3 లక్షలా 90 వేల టికెట్లను 15 నిమిషాల వ్యవధిలోనే భక్తులు బుక్ చేసుకున్నారు. వోటీపీ, వర్చువల్ క్యూ పద్ధతిలో టికెట్లు కేటాయించడంతో.. ప్రక్రియలో ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తలేదు. అలాగే రేపు ఉదయం 9 గంటలకు తిరుమలలో వసతికి సంబంధించిన టోకెన్లు కూడా విడుదల చేస్తామన్నారు.
తిరుమల టీటీడీ విడుదల చేసిన 3,10,000 శ్రీవారి సర్వదర్శనం టిక్కెట్లు కేవలం 16 నిమిషాల వ్యవధిలో నే బుక్ అయ్యి చరిత్ర సృష్టించాయి. టిటిడి ఐటీ విభాగం మరియు జియో ప్లాట్ ఫార్మ్స్ లిమిటెడ్ మధ్య ఎంవోయూ కుదిర్చి క్లౌడ్ టెక్నాలజీని ద్వారా ప్రారంభించిన ఆన్లైన్ బుకింగ్ మంచి ఫలితాన్ని ఇవ్వడంపై శ్రీవారి భక్తుల నుంచి మంచి ప్రశంసలు వస్తున్నాయి. ఈ రోజు విడుదల చేసిన 3,10,000 సర్వ దర్శనం టికెట్లు కేవలం 16 నిమిషాల్లోనే బుక్ అవ్వడంతో మున్ముందు.. మరిన్ని సాంకేతిక మాధ్యమాలను వినియోగించుకునే దిశగా టీటీడీ అడుగులు వేస్తుండడం గమనార్హం.
This post was last modified on November 27, 2021 2:10 pm
ఒక పార్టీలో ఇబ్బందులు రావొచ్చు.. నాయకులు అసంతృప్తి వ్యక్తం చేయొచ్చు. కానీ.. అడుగు పెట్టిన ప్రతిపార్టీలోనూ ఇబ్బందులు వస్తే.. ప్రతిపార్టీపైనా…
‘ఎల్లమ్మ’ గురించి ఇప్పటివరకు ఎక్కువగా మాట్లాడుకున్నది వేణు యెల్దండి కథ, గ్రామీణ నేపథ్యం, డీఎస్పీ లుక్ గురించే. ‘బలగం’ తర్వాత…
వారం రోజుల క్రితం తిరుపతిలో వెంకటేశ్వర స్వామి సాక్షిగా రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి…
మలయాళంలో రీసెంట్ గా విడుదలైన బెత్లేహెమ్ కుటుంబ యూనిట్ కేరళలో ఘనవిజయం సాధించింది. విశ్వనాథ్ అండ్ సన్స్ తరహాలో హీరోయిన్…
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్.. మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ ఏడాది మార్చిలో జరిగిన అసెంబ్లీ…
చాలా గ్యాప్ తర్వాత అల్లరి నరేష్ ఒక ఫుల్ లెన్త్ కామెడీ సినిమాతో వస్తున్నాడు. అదే రంభ ఊర్వశి మేనక.…