3లక్షలకు పైగా టిక్కెట్లు..పావుగంటంటే పావుగంటలోనే.. ప్రజలుఎగబడి.. మరీ.. వీటిని సొంతం చేసుకున్నారు. మరి ఇదేమన్నా.. జక్కన్న రాజమౌళి మూవీనా? లేక.. వచ్చే ఏడాది విడుదల కానున్న ఆర్ ఆర్ ఆర్ మూవీకి సంబంధించిన టిక్కెట్లా.. అంటే.. కానేకాదు! అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు టీటీడీ ప్రవేశ పెట్టిన సర్వదర్శనం టికెట్లు. కేవలం 15 నిముషాల్లో.. దేశవ్యాప్తంగా 3,10,000 మందికి పైగా.. సర్వ దర్శనం టికెట్లను సొంతం చేసుకున్నారు. ఇది.. ఇప్పటి వరకు ఉన్న అన్ని రికార్డులను బద్దలుకొట్టిందని.. టీటీడీ వర్గాలు చెప్పాయి.
డిసెంబర్ నెలకు తిరుమల సర్వదర్శనం టికెట్లు.. ఆన్లైన్లో విడుదల చేసిన పది నిమిషాల్లోనే ఖాళీ అయ్యాయి. ఉదయం 9 గంటలకు తితిదే వెబ్సైట్లో డిసెంబర్ నెల సర్వదర్శనం కోటా టికెట్లు అందు బాటులో ఉంచారు. రోజుకు పది వేల టికెట్ల చొప్పున 3 లక్షలా 90 వేల టికెట్లను 15 నిమిషాల వ్యవధిలోనే భక్తులు బుక్ చేసుకున్నారు. వోటీపీ, వర్చువల్ క్యూ పద్ధతిలో టికెట్లు కేటాయించడంతో.. ప్రక్రియలో ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తలేదు. అలాగే రేపు ఉదయం 9 గంటలకు తిరుమలలో వసతికి సంబంధించిన టోకెన్లు కూడా విడుదల చేస్తామన్నారు.
తిరుమల టీటీడీ విడుదల చేసిన 3,10,000 శ్రీవారి సర్వదర్శనం టిక్కెట్లు కేవలం 16 నిమిషాల వ్యవధిలో నే బుక్ అయ్యి చరిత్ర సృష్టించాయి. టిటిడి ఐటీ విభాగం మరియు జియో ప్లాట్ ఫార్మ్స్ లిమిటెడ్ మధ్య ఎంవోయూ కుదిర్చి క్లౌడ్ టెక్నాలజీని ద్వారా ప్రారంభించిన ఆన్లైన్ బుకింగ్ మంచి ఫలితాన్ని ఇవ్వడంపై శ్రీవారి భక్తుల నుంచి మంచి ప్రశంసలు వస్తున్నాయి. ఈ రోజు విడుదల చేసిన 3,10,000 సర్వ దర్శనం టికెట్లు కేవలం 16 నిమిషాల్లోనే బుక్ అవ్వడంతో మున్ముందు.. మరిన్ని సాంకేతిక మాధ్యమాలను వినియోగించుకునే దిశగా టీటీడీ అడుగులు వేస్తుండడం గమనార్హం.
This post was last modified on November 27, 2021 2:10 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…