Uncategorized

మమత బలం పెరుగుతోందా ?

మొన్ననే అఖండ విజయంతో మూడోసారి అధికారంలోకి వచ్చిన మమతాబెనర్జీ బలం మరింత పెరగనున్నదా ? అంటే అవుననే సమాధానం చెప్పుకోవాలి. 294 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికల్లో మమత నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ 213 సీట్లతో అధికారంలోకి వచ్చింది. ఎలాగైనా బీజేపీ జెండా ఎగరేయాలని విశ్వప్రయత్నాలు చేసిన నరేంద్రమోడి, అమిత్ షా ధ్వయం 77 సీట్లతో సరిపెట్టుకోవాల్సొచ్చింది.

నిజానికి 294 సీట్లకు ఎన్నికలు మొదలైనా వివిధ కారణాల వల్ల మూడు నియోజకవర్గాల్లో సమస్య వచ్చింది. రెండు నియోజకవర్గాల్లో నామినేషన్లు వేసిన తర్వాత అభ్యర్ధులు చనిపోయారు. మరో నియోజకవర్గంలో పోలింగ్ అయిపోయిన తర్వాత తృణమూల్ అభ్యర్ధి చనిపోయాడు. ఈ మూడు నియోజకవర్గాలను పక్కనపెట్టేస్తే తాజాగా బీజేపీ తరపున గెలిచిన ఇద్దరు ఎంఎల్ఏలు తమ పదవులకు రాజీనామాలు చేశారు. దీంతో కరోనా వైరస్ సమస్య తగ్గిన తర్వాత ఎన్నికలు జరపాలని కేంద్ర ఎన్నికల కమీషన్ నిర్ణయించింది.

నామినేషన్లు వేసిన తర్వాత అభ్యర్ధులు చనిపోయిన రెండు సెగ్మెంట్లలో ఎలాగూ ఎన్నికలు నిర్వహించాల్సిందే. ఇక పోలింగ్ అయిపోయిన తర్వాత చనిపోయిన తృణమూల్ అభ్యర్ధి మంచి మెజారిటితో గెలిచారు. కాబట్టి ఈ నియోజకవర్గంలో కూడా ఎన్నికలు తప్పదు. పైగా తమ అభ్యర్ధి గెలిచిన సీటు కాబట్టి మమతబెనర్జీ ఇక్కడి నుండే పోటీచేసే అవకాశం ఉందని అంటున్నారు.

ఇక బీజేపీ తరపున గెలిచిన ఇద్దరు ఎంఎల్ఏలు తమ పదవులకు రాజీనామాలు చేశారు. బీజేపీ తరపున మొత్తం ఐదుగురు ఎంపిలు ఎంఎల్ఏలుగా పోటీచేశారు. వీళ్ళల్లో ముగ్గురు ఓడిపోయి ఇద్దరు గెలిచారు. గెలిచిన ఇద్దరు నిజానికి ఎంపిలుగా రాజీనామాలు చేయాలి. కానీ విచిత్రంగా ఎంఎల్ఏలుగా రాజీనామాలు చేశారు. కాబట్టి ఈ రెండుస్ధానాలకు కూడా ఎన్నికలు తప్పవు. మొన్ననే మంచి మెజారిటితో అధికారంలోకి వచ్చిన తృణమూల్ అభ్యర్ధులే ఈ ఐదు నియోజకవర్గాల్లోను గెలుస్తారనటంలో సందేహంలేదు. కాబట్టి మమత మెజారిటి మరింత పెరగటం ఖాయం.

This post was last modified on May 16, 2021 11:30 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

20 minutes ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

1 hour ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

3 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

5 hours ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

9 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

9 hours ago