Uncategorized

మమత బలం పెరుగుతోందా ?

మొన్ననే అఖండ విజయంతో మూడోసారి అధికారంలోకి వచ్చిన మమతాబెనర్జీ బలం మరింత పెరగనున్నదా ? అంటే అవుననే సమాధానం చెప్పుకోవాలి. 294 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికల్లో మమత నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ 213 సీట్లతో అధికారంలోకి వచ్చింది. ఎలాగైనా బీజేపీ జెండా ఎగరేయాలని విశ్వప్రయత్నాలు చేసిన నరేంద్రమోడి, అమిత్ షా ధ్వయం 77 సీట్లతో సరిపెట్టుకోవాల్సొచ్చింది.

నిజానికి 294 సీట్లకు ఎన్నికలు మొదలైనా వివిధ కారణాల వల్ల మూడు నియోజకవర్గాల్లో సమస్య వచ్చింది. రెండు నియోజకవర్గాల్లో నామినేషన్లు వేసిన తర్వాత అభ్యర్ధులు చనిపోయారు. మరో నియోజకవర్గంలో పోలింగ్ అయిపోయిన తర్వాత తృణమూల్ అభ్యర్ధి చనిపోయాడు. ఈ మూడు నియోజకవర్గాలను పక్కనపెట్టేస్తే తాజాగా బీజేపీ తరపున గెలిచిన ఇద్దరు ఎంఎల్ఏలు తమ పదవులకు రాజీనామాలు చేశారు. దీంతో కరోనా వైరస్ సమస్య తగ్గిన తర్వాత ఎన్నికలు జరపాలని కేంద్ర ఎన్నికల కమీషన్ నిర్ణయించింది.

నామినేషన్లు వేసిన తర్వాత అభ్యర్ధులు చనిపోయిన రెండు సెగ్మెంట్లలో ఎలాగూ ఎన్నికలు నిర్వహించాల్సిందే. ఇక పోలింగ్ అయిపోయిన తర్వాత చనిపోయిన తృణమూల్ అభ్యర్ధి మంచి మెజారిటితో గెలిచారు. కాబట్టి ఈ నియోజకవర్గంలో కూడా ఎన్నికలు తప్పదు. పైగా తమ అభ్యర్ధి గెలిచిన సీటు కాబట్టి మమతబెనర్జీ ఇక్కడి నుండే పోటీచేసే అవకాశం ఉందని అంటున్నారు.

ఇక బీజేపీ తరపున గెలిచిన ఇద్దరు ఎంఎల్ఏలు తమ పదవులకు రాజీనామాలు చేశారు. బీజేపీ తరపున మొత్తం ఐదుగురు ఎంపిలు ఎంఎల్ఏలుగా పోటీచేశారు. వీళ్ళల్లో ముగ్గురు ఓడిపోయి ఇద్దరు గెలిచారు. గెలిచిన ఇద్దరు నిజానికి ఎంపిలుగా రాజీనామాలు చేయాలి. కానీ విచిత్రంగా ఎంఎల్ఏలుగా రాజీనామాలు చేశారు. కాబట్టి ఈ రెండుస్ధానాలకు కూడా ఎన్నికలు తప్పవు. మొన్ననే మంచి మెజారిటితో అధికారంలోకి వచ్చిన తృణమూల్ అభ్యర్ధులే ఈ ఐదు నియోజకవర్గాల్లోను గెలుస్తారనటంలో సందేహంలేదు. కాబట్టి మమత మెజారిటి మరింత పెరగటం ఖాయం.

This post was last modified on May 16, 2021 11:30 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

తెలంగాణ నాయకుల జాబితాకు తోడయ్యిన వైఎస్ షర్మిల

కోనసీమ కొబ్బరి తోటలకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ…

2 hours ago

అసెంబ్లీలో కండోమ్ లతో డెకరేషన్.. ఎప్పుడు..? ఎందుకు..?

ఒకప్పుడు ఏపీలో హెచ్ ఐవీ ఎక్కువగా ఉండేది. హైవేల పక్కన ఎక్కువ కండోమ్ లు కనపడేవి అని సీఎం చంద్రబాబు…

2 hours ago

వికలాంగులతో కేక్ కట్ చేయించిన పవన్

ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సీఎం చంద్రబాబు విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా…

3 hours ago

‘పవన్ పదవి వదిలి గుడులూ.. గోపురాల చుట్టూ తిరగొచ్చు’

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను ఆ ప‌ద‌వి నుంచి బ‌ర్త‌ర‌ఫ్ చేయాల‌ని సీపీఐ సీనియ‌ర్ నేత నారాయ‌ణ డిమాండ్…

3 hours ago

ప్రభుత్వ ఉద్యోగాల్లో తగ్గేదే లే అంటున్న సీఎం రేవంత్

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. త్వ‌ర‌లోనే మ‌రో 40 వేల ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయ‌నున్న‌ట్టు తెలిపారు.…

4 hours ago

మళ్ళీ పాద‌యాత్ర చేసి సాధించేది ఏమన్నా ఉందా జగన్?

అన్ని పాదయాత్రలు సెంటిమెంటును రాజేస్తాయా.. అన్ని పాదయాత్రలు ఓటు బ్యాంకును దూసుకు వస్తాయా.. అంటే ఇప్పుడున్న ప‌రిస్థితిలో చెప్పడం కష్టంగా…

5 hours ago