ప్రభాస్ కొత్త సినిమాల అప్ డేట్ల, రిలీజ్ కోసం కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూడటం బాగా అలవాటైపోయింది అభిమానులకు. ‘బాహుబలి’ దగ్గర్నుంచి ఈ ఒరవడి కొనసాగుతోంది. ఆ సినిమా మొదలైన దగ్గర్నుంచి ఏదో ఒక దశలో ఆలస్యం జరుగుతూనే వచ్చింది. ఆ తర్వాత ‘సాహో’ విషయంలోనూ అలాగే జరిగింది. ఇప్పుడు ‘రాధేశ్యామ్’ కూడా అందుకు భిన్నమేమీ కాదు. ఈ సినిమా అనివార్య కారణాల వల్ల ఆలస్యమవుతూ వచ్చింది.
సినిమా లేటవడం ఒక బాధ అయితే.. అభిమానులు కోరుకునే అప్డేట్లను చిత్ర బృందం ఎప్పటికప్పుడు అందించకపోవడం మరో బాధ. ‘సాహో’ విషయంలో యువి క్రియేషన్స్ నిర్లక్ష్య ధోరణిపై అప్పట్లో ప్రభాస్ అభిమానులు ఎంత గొడవ చేశారో తెలిసిందే. నిర్మాణ సంస్థ ఆఫీసుకు వెళ్లి ఆందోళన చేపట్టే వరకు పరిస్థితి వెళ్లింది. ‘రాధేశ్యామ్’ విషయంలోనూ తమను ఇలాగే ఏడిపిస్తున్నారంటూ అభిమానులు యువి క్రియేషన్స్పై మండిపడుతున్నారు.
‘రాధేశ్యామ్’ పట్టాలెక్కి ఏడాది దాటిపోగా ఇప్పటిదాకా కొన్ని పోస్టర్లు రిలీజ్ చేశారు తప్ప ఏ విశేషాలూ బయట పెట్టలేదు. మొన్న నూతన సంవత్సరాదికి టీజర్ ఏమైనా వస్తుందేమో అని ఆశిస్తే.. ప్రభాస్ది ఒక మామూలు లుక్ రిలీజ్ చేసి సరిపెట్టారు. టీజర్ అప్ డేట్ గురించి సోషల్ మీడియాలో ఎన్ని డిమాండ్లు చేసినా పట్టించుకోవట్లేదు. దీంతో మళ్లీ సోషల్ మీడియాలో ఉద్యమం మొదలుపెట్టారు ప్రభాస్ ఫ్యాన్స్.
ఐతే నిర్మాణ సంస్థ స్పందించలేదు కానీ.. దర్శకుడు రాధాకృష్ణకుమార్కు విషయం తీవ్రత అర్థమై లైన్లోకి వచ్చాడు. ప్రభాస్ అభిమానులు కాస్త ఓపిక పట్టాలని.. టీజర్ అప్డేట్ సిద్ధమవుతోందని.. అభిమానుల ఆకాంక్షలకు ఏమాత్రం తగ్గని విధంగా టీజర్ ఉంటుందని ట్వీట్ చేశాడు. దీంతో ప్రభాస్ అభిమానులు కాస్త చల్లబడ్డారు. రాధాకృష్ణకుమార్ మాటల్ని బట్టి చూస్తే సంక్రాంతికి టీజర్ ఏమైనా వస్తుందేమో అన్న ఆశ వారిలో మొదలైంది. కాగా ప్రస్తుతం ‘రాధేశ్యామ్’ చిత్రీకరణ చివరి దశలో ఉంది. హైదరాబాద్లోని ప్రఖ్యాత ఫలక్ నుమా ప్యాలెస్లో ఈ సినిమా కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుండటం విశేషం. ఈ చిత్రం వేసవిలో విడుదలయ్యే అవకాశాలున్నాయి.
This post was last modified on January 5, 2021 2:26 pm
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…