ప్రభాస్ కొత్త సినిమాల అప్ డేట్ల, రిలీజ్ కోసం కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూడటం బాగా అలవాటైపోయింది అభిమానులకు. ‘బాహుబలి’ దగ్గర్నుంచి ఈ ఒరవడి కొనసాగుతోంది. ఆ సినిమా మొదలైన దగ్గర్నుంచి ఏదో ఒక దశలో ఆలస్యం జరుగుతూనే వచ్చింది. ఆ తర్వాత ‘సాహో’ విషయంలోనూ అలాగే జరిగింది. ఇప్పుడు ‘రాధేశ్యామ్’ కూడా అందుకు భిన్నమేమీ కాదు. ఈ సినిమా అనివార్య కారణాల వల్ల ఆలస్యమవుతూ వచ్చింది.
సినిమా లేటవడం ఒక బాధ అయితే.. అభిమానులు కోరుకునే అప్డేట్లను చిత్ర బృందం ఎప్పటికప్పుడు అందించకపోవడం మరో బాధ. ‘సాహో’ విషయంలో యువి క్రియేషన్స్ నిర్లక్ష్య ధోరణిపై అప్పట్లో ప్రభాస్ అభిమానులు ఎంత గొడవ చేశారో తెలిసిందే. నిర్మాణ సంస్థ ఆఫీసుకు వెళ్లి ఆందోళన చేపట్టే వరకు పరిస్థితి వెళ్లింది. ‘రాధేశ్యామ్’ విషయంలోనూ తమను ఇలాగే ఏడిపిస్తున్నారంటూ అభిమానులు యువి క్రియేషన్స్పై మండిపడుతున్నారు.
‘రాధేశ్యామ్’ పట్టాలెక్కి ఏడాది దాటిపోగా ఇప్పటిదాకా కొన్ని పోస్టర్లు రిలీజ్ చేశారు తప్ప ఏ విశేషాలూ బయట పెట్టలేదు. మొన్న నూతన సంవత్సరాదికి టీజర్ ఏమైనా వస్తుందేమో అని ఆశిస్తే.. ప్రభాస్ది ఒక మామూలు లుక్ రిలీజ్ చేసి సరిపెట్టారు. టీజర్ అప్ డేట్ గురించి సోషల్ మీడియాలో ఎన్ని డిమాండ్లు చేసినా పట్టించుకోవట్లేదు. దీంతో మళ్లీ సోషల్ మీడియాలో ఉద్యమం మొదలుపెట్టారు ప్రభాస్ ఫ్యాన్స్.
ఐతే నిర్మాణ సంస్థ స్పందించలేదు కానీ.. దర్శకుడు రాధాకృష్ణకుమార్కు విషయం తీవ్రత అర్థమై లైన్లోకి వచ్చాడు. ప్రభాస్ అభిమానులు కాస్త ఓపిక పట్టాలని.. టీజర్ అప్డేట్ సిద్ధమవుతోందని.. అభిమానుల ఆకాంక్షలకు ఏమాత్రం తగ్గని విధంగా టీజర్ ఉంటుందని ట్వీట్ చేశాడు. దీంతో ప్రభాస్ అభిమానులు కాస్త చల్లబడ్డారు. రాధాకృష్ణకుమార్ మాటల్ని బట్టి చూస్తే సంక్రాంతికి టీజర్ ఏమైనా వస్తుందేమో అన్న ఆశ వారిలో మొదలైంది. కాగా ప్రస్తుతం ‘రాధేశ్యామ్’ చిత్రీకరణ చివరి దశలో ఉంది. హైదరాబాద్లోని ప్రఖ్యాత ఫలక్ నుమా ప్యాలెస్లో ఈ సినిమా కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుండటం విశేషం. ఈ చిత్రం వేసవిలో విడుదలయ్యే అవకాశాలున్నాయి.
This post was last modified on January 5, 2021 2:26 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…