మన దేశంలో నెల కిందటితో పోలిస్తే కరోనా కేసులు ఎంతగానో పెరిగాయి. మరణాల రేటూ పెరిగింది. కానీ ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలతో పోలిస్తే ఇండియా ఇప్పటికీ ఎంతో మెరగైన స్థితిలోనే ఉంది. ఇప్పటిదాకా దేశంలో 33 వేల కేసులు నమోదు కాగా.. వెయ్యి మంది దాకా వైరస్ కారణంగా మరణించారు. ఐతే ఈ 33 వేలలో మూడో వంతు కేసులు ఒక్క రాష్ట్రంలో ఉండటమే ఆందోళనకరం. ఆ రాష్ట్రం మహారాష్ట్ర అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అక్కడ రోజు రోజుకూ కేసులు పెరుగుతున్నాయి. మరణాలు కూడా తక్కువగా లేవు. త్వరలోనే అక్కడ రోజు వారీ మరణాల సంఖ్య వంద దాటుతుందేమో అన్న ఆందోళన కూడా కలుగుతోంది. గురువారం ఒక్క రోజే మహారాష్ట్రలో కరోనా కారణంగా 27 మంది మరణించారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
మహారాష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 10 వేలు దాటిపోయింది. గురువారం సాయంత్రానికి కేసుల సంఖ్య 10500 దాకా ఉంది. ఈ రోజు 583 కొత్త కేసులు వెలుగు చూశాయి. ఇండియాలో మరే రాష్ట్రంలోనూ ఇందులో నాలుగో వంతు కేసులు కూడా నమోదు కాలేదు. బుధవారం మహారాష్ట్రలో 32 మంది కరోనా కారణంగా చనిపోవడం గమనార్హం. రాష్ట్రంలో మెజారిటీ కేసులు ముంబయిలోనే నమోదవుతున్నాయి. కొన్ని రోజులుగా అక్కడ ఏ రోజూ వందకు తక్కువ కేసులు నమోదు కాలేదు. ముఖ్యంగా అత్యంత జనసాంద్రత కలిగిన ధారావి మురికివాడలో కరోనా ప్రమాదకర రీతిలో విస్తరిస్తోంది. అక్కడ వందల మంది వైరస్ బారిన పడ్డారు. రోజూ పదుల సంఖ్యలో చనిపోతున్నారు. చిన్న ఇంట్లో పది మంది సర్దుకునే అలాంటి చోట శానిటైజేషన్, సోషల్ డిస్టన్స్ అసాధ్యం. దీంతో కరోనా వేగంగా విస్తరిస్తోంది. మరణాల రేటు కూడా భయానకంగా ఉంటోంది. ఇక్కడ వేలమంది కరోనా వల్ల చనిపోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
This post was last modified on May 1, 2020 1:21 am
బాలీవుడ్ లోనే కాదు ఇతర రాష్ట్రాల్లోనూ దురంధర్ ప్రభంజనం మాములుగా లేదు. మొదటి రోజు స్లోగా మొదలై ఇప్పుడు పదో…
దేశవ్యాప్తంగా మెస్సీ మ్యానియా హోరెత్తుతోంది. అర్జెంటీనా ఫుట్బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ మూడు రోజుల పాటు జరిగే గోట్ ఇండియా…
మొన్న రాత్రి ప్రీమియర్లతో విడుదలైన అఖండ 2 తాండవం ఏపీ తెలంగాణ వ్యాప్తంగా భారీ ఆక్యుపెన్సీలు నమోదు చేసింది. తొలి…
ఈ రోజుల్లో ఒక హీరో సినిమా గురించి తన అభిమానులు చేసే పాజిటివ్ ప్రచారం కంటే.. యాంటీ ఫాన్స్ చేసే…
ఉప్పెనతో టాలీవుడ్ లో సెన్సేషనల్ డెబ్యూ అందుకున్న కృతి శెట్టి ఆ తర్వాత బంగార్రాజు, శ్యామ్ సింగ్ రాయ్ లాంటి…
రాజకీయంగా, వ్యక్తిగతంగా తన ప్రతిష్ఠను చెల్లి దెబ్బతీయాలని ప్రయత్నించిందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జాతీయ కంపెనీ అప్పీలేట్ ట్రిబ్యునల్…