మహారాష్ట్రలో కరోనా.. బాబోయ్

మన దేశంలో నెల కిందటితో పోలిస్తే కరోనా కేసులు ఎంతగానో పెరిగాయి. మరణాల రేటూ పెరిగింది. కానీ ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలతో పోలిస్తే ఇండియా ఇప్పటికీ ఎంతో మెరగైన స్థితిలోనే ఉంది. ఇప్పటిదాకా దేశంలో 33 వేల కేసులు నమోదు కాగా.. వెయ్యి మంది దాకా వైరస్ కారణంగా మరణించారు. ఐతే ఈ 33 వేలలో మూడో వంతు కేసులు ఒక్క రాష్ట్రంలో ఉండటమే ఆందోళనకరం. ఆ రాష్ట్రం మహారాష్ట్ర అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అక్కడ రోజు రోజుకూ కేసులు పెరుగుతున్నాయి. మరణాలు కూడా తక్కువగా లేవు. త్వరలోనే అక్కడ రోజు వారీ మరణాల సంఖ్య వంద దాటుతుందేమో అన్న ఆందోళన కూడా కలుగుతోంది. గురువారం ఒక్క రోజే మహారాష్ట్రలో కరోనా కారణంగా 27 మంది మరణించారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

మహారాష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 10 వేలు దాటిపోయింది. గురువారం సాయంత్రానికి కేసుల సంఖ్య 10500 దాకా ఉంది. ఈ రోజు 583 కొత్త కేసులు వెలుగు చూశాయి. ఇండియాలో మరే రాష్ట్రంలోనూ ఇందులో నాలుగో వంతు కేసులు కూడా నమోదు కాలేదు. బుధవారం మహారాష్ట్రలో 32 మంది కరోనా కారణంగా చనిపోవడం గమనార్హం. రాష్ట్రంలో మెజారిటీ కేసులు ముంబయిలోనే నమోదవుతున్నాయి. కొన్ని రోజులుగా అక్కడ ఏ రోజూ వందకు తక్కువ కేసులు నమోదు కాలేదు. ముఖ్యంగా అత్యంత జనసాంద్రత కలిగిన ధారావి మురికివాడలో కరోనా ప్రమాదకర రీతిలో విస్తరిస్తోంది. అక్కడ వందల మంది వైరస్ బారిన పడ్డారు. రోజూ పదుల సంఖ్యలో చనిపోతున్నారు. చిన్న ఇంట్లో పది మంది సర్దుకునే అలాంటి చోట శానిటైజేషన్, సోషల్ డిస్టన్స్ అసాధ్యం. దీంతో కరోనా వేగంగా విస్తరిస్తోంది. మరణాల రేటు కూడా భయానకంగా ఉంటోంది. ఇక్కడ వేలమంది కరోనా వల్ల చనిపోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

This post was last modified on May 1, 2020 1:21 am

Share
Show comments
Published by
suman

Recent Posts

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

1 hour ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

3 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

4 hours ago

ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె చేతికి రింగ్ లేదేంటి?

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…

4 hours ago

కాసేపు క్లాస్ రూములో విద్యార్థులుగా మారిన చంద్రబాబు, లోకేష్

పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…

4 hours ago

పవన్ కల్యాణ్ హీరోగా… టీడీపీ ఎమ్మెల్యే నిర్మాతగా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…

5 hours ago