ప్రపంచ వ్యాప్తతంగా ‘నెట్ ఫ్లిక్’ అంటే తెలియని పట్టణ ప్రజలు ఉండరు. ఒకప్పుడు ఇది ఖరీదైనా.. ఇప్పుడు నేరుగా ఇంట్లోకి వచ్చేసింది. తక్కువ ప్రీమియంలతో ఎక్కువ వినోదం అందిస్తున్న ఓటీటీ ప్లాట్ ఫాంగా గుర్తింపు పొందింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ.. నెట్ఫ్లిక్స్ వినియోగదారుల సంఖ్య 60 శాతానికి పైగానే ఉంది. కొత్త కొత్త సినిమాలతోపాటు వెబ్ సిరీస్ ద్వారా వినియోగదారులను ఆకట్టుకోవడంలో నెట్ ఫ్లిక్స్ ముందుంది. అయితే.. ఇప్పుడు ఈ మాధ్యమం తీవ్ర దుమారానికి కారణమైంది.
అమెరికా నుంచి కార్యకలాపాలు నిర్వహించే నెట్ ఫ్లిక్స్ సంస్థపై అక్కడి రిపబ్లికన్ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వర్గం నిప్పులు చెరుగుతోంది. ‘క్యాన్సిల్ నెట్ ఫ్లిక్స్’ హ్యాష్ ట్యాగ్తో నెట్ఫ్లిక్స్ను తక్షణమే వదులుకోవాలన్న పిలుపు జోరుగా వినిపిస్తోంది. దీంతో కేవలం 24 గంటల్లోనే వేల కొద్దీ వినియోగదారులు నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ను వదులుకున్నారు. ఇప్పుడు ఈ పరిణామం.. ప్రపంచ వ్యాప్తంగా పాకింది. భారత్లోనూ ట్రంప్కు మద్దతిచ్చే వారు.. నెట్ఫ్లిక్స్ను వదులుకోవాలని.. ఆన్లైన్ వేదికగా పెద్ద ఉద్యమమే సాగుతోంది.
కారణం ఏంటి?
ఈ ఏడాది అగ్రరాజ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఆ దేశం దాదాపు రెండుగా చీలిపోయింది. వ్యాపార వర్గాల నుంచి ఉద్యోగుల వరకు కూడా.. డెమొక్రాట్ అభ్యర్థిగా ఉన్న కమలా హ్యారిస్కు మద్దతిస్తున్నారు. మరికొన్ని వర్గాలు రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్కు మద్దతిస్తున్నారు. నిన్న మొన్నటి వరకు ట్రంప్ దూకుడుగా ముందుకు సాగారు. మద్దతు కూడా పెరిగింది. ఇక, డెమొక్రాట్ల విషయంలో ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ పోటీ నుంచి తప్పుకొన్నాక.. ఆ పార్టీ పుంజుకుంది.
ఈ క్రమంలోనే విరాళాలు కూడా వస్తున్నాయి. ఇలా.. నెట్ఫ్లిక్స్ సంస్థ కూడా.. 7 మిలియన్ డాలర్ల(7 కోట్ల డాలర్లు. భారత కరెన్సీలో 560 కోట్లు) కమలా హ్యారిస్కు విరాళం ఇచ్చింది. అంతే.. ఈ పరిణామం ట్రంప్ శిబిరంలో కలకలం రేపింది. ఇంత భారీ మొత్తం కమలకు రావడంతో నెట్ ప్లిక్స్పై నిప్పులు చెరుగుతు న్నారు. ఈ క్రమంలోనే నెట్ఫ్లిక్స్ను వదులుకోవాలంటూ.. ఉద్యమం చేస్తున్నారు. ప్రస్తుతం ఆన్లైన్లో పెద్ద ఎత్తున ఈ విషయమే ట్రెండింగ్గా మారడం గమనార్హం.
This post was last modified on July 27, 2024 3:39 pm
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…