కాలువకు పోలీసుల పహారా ఏంటని ఆశ్చర్యపోతున్నారా ? మీరు విన్నది నిజమే. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు. ఢిల్లీలోని ఐదు పోలీస్ స్టేషన్ల నుంచి 170 మంది పోలీసులు జీపులు, బైకులతో ఆ కాలువకు గస్తీ కాస్తున్నారు. ఎందుకో తెలుసా ఆ కాలువ నుండి ఎవరూ నీటిని దొంగతనం చేయకుండా ఉండడానికి. ఇది ఆశ్చర్యమే అయినా వాస్తవం.
ఢిల్లీలోనిొ నీటి అవసరాలను తీర్చడంలో మునక్ కెనాల్ పాత్ర ముఖ్యమైనది. ఈ 102 కిలోమీటర్ల పొడవైన కాలువ యమునా నది నుండి హర్యానాలోని కర్నాల్లోని మునాక్ రెగ్యులేటర్కు నీటిని అందిస్తుంది. ఆ తర్వాత ఖుబ్రూ బ్యారేజ్, మండోరా బ్యారేజీ మీదుగా వెళ్లి ఢిల్లీలోని హైదర్పూర్ వద్ద ముగుస్తుంది.
ఢిల్లీలో తీవ్రమైన నీటి కొరత వేధిస్తున్నది. మునక్ కెనాల్ నుండి నీళ్లు చోరీ అవుతున్నట్లు ఫిర్యాదులు వచ్చాయి. దీంతో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశాలు ఇవ్వడంతో ఢిల్లీ పోలీసులు కాలువ రెండు ఒడ్డులపై నిఘా ప్రారంభించారు. బవానా నుంచి హైదర్పూర్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ వరకు దాదాపు 15 కిలోమీటర్ల మేర నీటి చౌర్యాన్ని అరికట్టేందుకు 170 మంది పోలీసులు మూడు షిఫ్టుల్లో 24 గంటలపాటు గస్తీ నిర్వహిస్తున్నారు.
కాలువ పర్యవేక్షణ పనిని ఔటర్ నార్త్, రోహిణి జిల్లా పోలీసు ఐదు పోలీసు స్టేషన్లకు అప్పగించారు. ఢిల్లీకి వచ్చిన తర్వాత, మునాక్ కెనాల్ బవానా, నరేలా ఇండస్ట్రియల్ ఏరియా, షహబాద్ డెయిరీ, సమయ్పూర్ బద్లీ , కేఎన్ కట్జు పోలీస్ స్టేషన్ ప్రాంతం మీదుగా హైదర్పూర్ ప్లాంట్కు చేరుకుంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ అన్ని పోలీస్ స్టేషన్ల పోలీసులకు నీటి పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించడం విశేషం. మునక్ కెనాల్ ద్వారా హర్యానా నుంచి ఢిల్లీ వాటాకు 1050 ఎంజీడీల నీరు రావాల్సి ఉండగా ప్రస్తుతం 985 ఎంజీడీల నీరు మాత్రమే అందుతోంది. ఢిల్లీలోని ఏడు వాటర్ ప్లాంట్లు దీని మీదనే ఆధారపడి ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ భద్రత ఏర్పాటు చేశారు.
This post was last modified on June 14, 2024 5:59 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…