తండ్రి దగ్గర కొడుక్కి లేని చనువు మనమడికి ఉంటుందని చెబుతారు. దిగ్గజ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి తాజాగా తన మనమడు ఏకాగ్రహ్ రోహన్ మూర్తికి ఖరీదైన బహుమతి అందజేశారు. తన సంస్థలోని 15 లక్షల షేర్లను మనవడి పేరు మీద రిజిస్టర్ చేశారు.
ఈ భారీ షేర్ల విలువ ఏకంగా రూ.240 కోట్లు ఉంటుందని అంచనా. కంపెనీలో తన వాటా షేర్లలో కొన్నింటిని మనమడికి బహుమతిగా ఇచ్చినట్లుగా బీఎస్ఈ ఫైలింగ్ లో నారాయణమూర్తి తెలిపారు. నారాయణ మూర్తికి ఇన్ఫోసిస్ లో 0.40 వాతం వాటా ఉంది. ఇందులో భాగంగా ఆయన వద్ద రూ.1.51 కోట్ల షేర్లు ఉండగా.. వాటిల్లో దగ్గర దగ్గర ఒక శాతం షేర్లను మనమడికి కట్టబెట్టారు. గత ఏడాది నవంబరులో ఆయన కొడుకు రోహాన్ మూర్తి.. కోడలు అపర్ణ క్రిష్ణన్ లకు ఏకాగ్రహ్ పుట్టారు.
తాత ఇచ్చిన ఖరీదైన బహుమతితో ఏకాగ్రహ్ భారత్ లోని అత్యంత పిన్నవయస్కుడైన మిలియనీర్ గా అవతరించారు. నారాయణమూర్తి.. సుధామూర్తికి ఇద్దరు సంతానమన్న విషయం తెలిసిందే.వారిలో కుమార్తె అక్షతా మూర్తి పెద్దవారైతే.. కొడుకు రోహన్ మూర్తి రెండోవారు. అక్షతామూర్తి 2009లో రిషి సునాక్ (ప్రస్తుతం బ్రిటన్ ప్రధానమంత్రి)ని పెళ్లాడగా.. రోహన్ విషయానికి వస్తే.. 2011లో టీవీఎస్ కంపెనీ ఛైర్మన్ వేణు శ్రీనివాసన్ కుమార్తె లక్ష్మీతో పెళ్లైంది. వారిద్దరు 2015లో విడిపోయారు. అనంతరం 2019లో అపర్ణ క్రిష్ణన్ తో పెళ్లి జరిగింది. వీరికి కలిగిన సంతానమే ఏకాగ్రహ్. మనమడికి తాత ఇచ్చిన ఖరీదైన బహుమతి ఇప్పుడు కార్పొరేట్ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది.
This post was last modified on March 19, 2024 12:00 pm
అల్లరి నరేష్ కొత్త సినిమా ఆల్కహాల్ టీజర్ వచ్చి అయిదు నెలలు దాటేసింది. దాంట్లో ప్రకటించిన విడుదల తేదీ జనవరి…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కేవలం హీరోయిజం ఉన్న పాత్రలే చేస్తానని ఎప్పుడూ కట్టుబడరు. అందుకే నాలుగు…
టాలీవుడ్లో మంచి అనుబంధం ఉన్న అగ్ర నిర్మాతల్లో దిల్ రాజు, నాగవంశీలది ఒకటి. ఇద్దరికి బిజినెస్ పరంగా గట్టి బంధమే…
ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి కుటుంబాన్ని సంతోషంలో ముంచెత్తే పరిణామం చోటుచేసుకుంది. చిరు తనయుడు రామ్ చరణ్ కవల పిల్లలకు తండ్రి…
రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు.. ఈ వార్త నిజం కావడానికి దశాబ్దంన్నర పాటు ఎదురు చూడాల్సి వచ్చింది అభిమానులు. వీరి…
రామ్ గోపాల్ వర్మ సత్యతో స్టార్ ఆర్టిస్టుగా మారిపోయిన మనోజ్ బాజ్ పాయ్ తెలుగులోనూ హ్యాపీ, ప్రేమకథ, కొమరం పులి…