Trends

మనమడికి ఇన్ఫో నారాయణమూర్తి ఖరీదైన గిఫ్టు

తండ్రి దగ్గర కొడుక్కి లేని చనువు మనమడికి ఉంటుందని చెబుతారు. దిగ్గజ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి తాజాగా తన మనమడు ఏకాగ్రహ్ రోహన్ మూర్తికి ఖరీదైన బహుమతి అందజేశారు. తన సంస్థలోని 15 లక్షల షేర్లను మనవడి పేరు మీద రిజిస్టర్ చేశారు.

ఈ భారీ షేర్ల విలువ ఏకంగా రూ.240 కోట్లు ఉంటుందని అంచనా. కంపెనీలో తన వాటా షేర్లలో కొన్నింటిని మనమడికి బహుమతిగా ఇచ్చినట్లుగా బీఎస్ఈ ఫైలింగ్ లో నారాయణమూర్తి తెలిపారు. నారాయణ మూర్తికి ఇన్ఫోసిస్ లో 0.40 వాతం వాటా ఉంది. ఇందులో భాగంగా ఆయన వద్ద రూ.1.51 కోట్ల షేర్లు ఉండగా.. వాటిల్లో దగ్గర దగ్గర ఒక శాతం షేర్లను మనమడికి కట్టబెట్టారు. గత ఏడాది నవంబరులో ఆయన కొడుకు రోహాన్ మూర్తి.. కోడలు అపర్ణ క్రిష్ణన్ లకు ఏకాగ్రహ్ పుట్టారు.

తాత ఇచ్చిన ఖరీదైన బహుమతితో ఏకాగ్రహ్ భారత్ లోని అత్యంత పిన్నవయస్కుడైన మిలియనీర్ గా అవతరించారు. నారాయణమూర్తి.. సుధామూర్తికి ఇద్దరు సంతానమన్న విషయం తెలిసిందే.వారిలో కుమార్తె అక్షతా మూర్తి పెద్దవారైతే.. కొడుకు రోహన్ మూర్తి రెండోవారు. అక్షతామూర్తి 2009లో రిషి సునాక్ (ప్రస్తుతం బ్రిటన్ ప్రధానమంత్రి)ని పెళ్లాడగా.. రోహన్ విషయానికి వస్తే.. 2011లో టీవీఎస్ కంపెనీ ఛైర్మన్ వేణు శ్రీనివాసన్ కుమార్తె లక్ష్మీతో పెళ్లైంది. వారిద్దరు 2015లో విడిపోయారు. అనంతరం 2019లో అపర్ణ క్రిష్ణన్ తో పెళ్లి జరిగింది. వీరికి కలిగిన సంతానమే ఏకాగ్రహ్. మనమడికి తాత ఇచ్చిన ఖరీదైన బహుమతి ఇప్పుడు కార్పొరేట్ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది.

This post was last modified on March 19, 2024 12:00 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

బాలయ్య బ్యాక్ టు డ్యూటీ

ఎన్నికలు అయిపోయాయి. ఫలితాలు ఇంకో పద్దెనిమిది రోజుల్లో రాబోతున్నాయి. ఎవరికి వారు విజయం పట్ల ధీమాగా ఉన్నారు. అధికార పార్టీ,…

25 mins ago

పూజా హెగ్డే కోరుకున్న బ్రేక్ దొరికింది

మొన్నటిదాకా టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా అత్యధిక డిమాండ్ అనుభవించిన పూజా హెగ్డే కెరీర్ ప్రారంభంలో వచ్చిన ఐరన్ లెగ్…

2 hours ago

ఆమంచి .. ఎవరి ‘కొంప’ ముంచేనో ?!

ప్రకాశం జిల్లాలో ఆమంచి కృష్ణమోహన్ రాజకీయంగా ఒక బలమైన నాయకుడే అని చెప్పాలి. అయితే తన రాజకీయ భవిష్యత్తు కోసం…

3 hours ago

అమెరికాలో వెంటాడిన మృత్యువు

తెలంగాణలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత రెండు ప్రమాదాలు తప్పించుకుని మూడో ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. నెలల వ్యవధిలో…

3 hours ago

కోర్టు మెట్లెక్కిన జూనియర్  !

ప్రముఖ హీరో జూనియర్ ఎన్టీఆర్ 2003లో జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో  681 చదరపు గజాల స్థలం సుంకు గీత అనే…

3 hours ago

ప్రభాస్ ఊరిస్తోంది దేని గురించంటే

ఒక్క చిన్న ఇన్స్ టా పోస్ట్ తో ప్రభాస్ సోషల్ మీడియాని ఊపేస్తున్నాడు. హలో డార్లింగ్స్ చివరికి చాలా ప్రత్యేకం…

4 hours ago